ప్రకాశంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమిదే పైచేయి: మాగుంట శ్రీనివాసులురెడ్డి

గత ప్రభుత్వ పాలనలో ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కూటమి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Updated : 09 May 2024 13:56 IST

నాలుగు సార్లు ఎంపీగా మూడు దశాబ్దాలుగా ఒంగోలు పార్లమెంటుతో అవినాభావ సంబంధం ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి మరోసారి ఒంగోలు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు. స్వచ్చంధ సంస్థ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించడమేకాక ఎంపీగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ వివాదరహితుడిగా పేరున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం తరఫున ఎంపీగా ఈసారి బరిలో ఉన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని ఈటీవీ ముఖాముఖిలో ఆయన స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని