Lok Sabha Polls: ఆ రాష్ట్రంలో 72 ఏళ్లలో గెలిచింది ముగ్గురు మహిళలే!

సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ పోటీ చేస్తుండటంతో ఈ రాష్ట్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 72 ఏళ్ల చరిత్రలో హిమాచల్ నుంచి కేవలం ముగ్గురు మహిళలే లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Published : 09 May 2024 11:01 IST

సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ పోటీ చేస్తుండటంతో ఈ రాష్ట్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 4 లోక్‌సభ స్థానాలున్న హిమాచల్‌ప్రదేశ్‌లోని మొత్తం ఓటర్లలో మహిళల శాతం 49. కానీ, 72 ఏళ్ల చరిత్రలో హిమాచల్ నుంచి కేవలం ముగ్గురు మహిళలే లోక్‌సభకు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో కూడా ఇద్దరు మాత్రమే బరిలో ఉన్నారు. 1967 వరకు హిమాచల్ అసెంబ్లీకి ఒక్క మహిళ కూడా ఎన్నిక కాకపోవడం గమనార్హం.    

Tags :

మరిన్ని