YS Sharmila: పదేళ్లు ఎంపీగా ఉన్న అవినాష్‌రెడ్డి కడపకు ఏం చేశారు?: వైఎస్‌ షర్మిల

పదేళ్లు ఎంపీగా ఉన్న అవినాష్‌రెడ్డి కడపకు ఏం చేశారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు.

Published : 09 May 2024 13:00 IST

పదేళ్లు ఎంపీగా ఉన్న అవినాష్‌రెడ్డి కడపకు ఏం చేశారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం అవినాష్‌రెడ్డి ఒక్క పోరాటమైనా చేశారా? ఆయన కేసుల కోసమే దిల్లీకి వెళ్తున్నారు తప్ప.. ప్రజల కోసం కాదు. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది. అవినాష్ రెడ్డిని జగన్‌మోహన్‌రెడ్డే కాపాడుతున్నారు’ అని షర్మిల అన్నారు.

Tags :

మరిన్ని