Vizag: వైకాపా నేతల భూదాహానికి విశాఖ విలవిల..!

విశాఖ అంటే గుర్తొచ్చేది పర్యాటకం! పారిశ్రామిక ప్రగతి, పర్యాటకుల సందడి మధ్య ఒకప్పుడు. సాగరనగరం వెలిగిపోయేది. కానీ, ఇప్పుడు వైకాపా దందాలు, దోపిడీల మధ్య నలిగిపోతోంది.

Published : 09 May 2024 12:21 IST

విశాఖ అంటే గుర్తొచ్చేది పర్యాటకం! పారిశ్రామిక ప్రగతి, పర్యాటకుల సందడి మధ్య ఒకప్పుడు. సాగరనగరం వెలిగిపోయేది. కానీ, ఇప్పుడు వైకాపా దందాలు, దోపిడీల మధ్య నలిగిపోతోంది. భూములు కొల్లగొట్టి, సామాన్యుల్ని బెదరగొట్టి, పరిశ్రమలను తరిమికొట్టి, కొండలకు గుండుకొట్టి, ఐటీ ప్రగతికి గుండు సున్నా చుట్టి ఐదేళ్లలో విశాఖను జగన్ మూక నంజుకుతింది. కార్యనిర్వాహక రాజధాని వలవిసిరి దాదాపు రూ.8450 కోట్ల విలువైన ప్రాజెక్టులను వైకాపా నాయకులు చేజిక్కించుకున్నారు. 13 ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి రూ.23 వేల కోట్ల రుణం తెచ్చిన జగన్.. ఆ డబ్బుతో రుషికొండపై క్యాంప్‌ ఆఫీస్‌ కట్టుకోవడం తప్ప విశాఖకు ప్రత్యేకంగా పైసా కేటాయించలేదు. ఇదీ విశాఖపై జగన్ మార్క్ దొంగ ప్రేమ.

Tags :

మరిన్ని