Telangana: వేములవాడలో పోటెత్తిన భక్తులు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవులు రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి ముందుగా.. భక్తులు వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో సమ్మక్క జాతరకు ముందు వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
Published : 25 Dec 2023 15:14 IST
Tags :