Pawan Kalyan: జగన్‌ పాలనలో స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి: పవన్ కల్యాణ్

ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడలేని, సమస్యలపై ప్రశ్నించలేని పరిస్థితులను ముఖ్యమంత్రి జగన్ కల్పించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు.

Published : 10 May 2024 11:04 IST

ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడలేని, సమస్యలపై ప్రశ్నించలేని పరిస్థితులను ముఖ్యమంత్రి జగన్ కల్పించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. రైతుల సంక్షేమం, మహిళల భద్రత, యువతకు ఉపాధి విషయంలో ముఖ్యమంత్రికి కనీస చిత్తశుద్ధి లేదన్నారు. తిరుమల పవిత్రతను మంటగలపటం, హిందూ ఆలయాలపై దాడులు విషయంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందన్నారు. రాజముద్ర స్థానంలో జగన్ బొమ్మ వేసుకోవటం వల్లే ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వ్యాఖ్యానించారు. అమరావతి వంటి రాజధాని అవసరమని.. మూడుచోట్ల రాజధాని అనేది ప్రజలకు ఇబ్బందులు తెస్తుందని విశ్లేషించారు. 

Tags :

మరిన్ని