RS Praveen: సంజయ్‌లా పారిపోను.. సిట్ నోటీసులు ఇస్తే తప్పకుండా స్పందిస్తా: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తన కుటుంబ ప్రమేయం ఉంది కాబట్టే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) స్పందించడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. లీకేజీలో కమిషన్ ఛైర్మన్ సహా సభ్యులందరూ బాధ్యులేనని.. వారిని ఉద్యోగాల నుంచి తప్పించి దేశద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సిట్ తనకు నోటీసులు ఇస్తే తప్పకుండా స్పందిస్తానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తరహాలో పారిపోనని, అన్ని ఆధారాలు అందజేసి సిట్‌కు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు.

Published : 28 Mar 2023 18:26 IST

టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తన కుటుంబ ప్రమేయం ఉంది కాబట్టే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) స్పందించడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. లీకేజీలో కమిషన్ ఛైర్మన్ సహా సభ్యులందరూ బాధ్యులేనని.. వారిని ఉద్యోగాల నుంచి తప్పించి దేశద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సిట్ తనకు నోటీసులు ఇస్తే తప్పకుండా స్పందిస్తానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తరహాలో పారిపోనని, అన్ని ఆధారాలు అందజేసి సిట్‌కు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు.

Tags :

మరిన్ని