YS Sharmila: జగన్‌.. ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు!: వై ఎస్ షర్మిల

అవినాష్ రెడ్డిని చట్టసభల్లోకి వెళ్లకుండా చేయడమే తన లక్ష్యమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటు అభ్యర్థి వై ఎస్ షర్మిల స్పష్టం చేశారు. జగన్ పాలనలో రాజశేఖర్ రెడ్డి మార్క్ ఎక్కుడా కనిపించడంలేదని విమర్శించారు.

Updated : 07 May 2024 18:03 IST

అవినాష్ రెడ్డిని చట్టసభల్లోకి వెళ్లకుండా చేయడమే తన లక్ష్యమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటు అభ్యర్థి వై ఎస్ షర్మిల స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఒక్కసారి కూడా ఆయన గురించి జగన్ మోహన్ రెడ్డి.. ఒక మంచిమాట మాట్లాడక పోగా ఇపుడు ఎన్నికల్లో ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సబబేనా? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో రాజశేఖర్ రెడ్డి మార్క్ ఎక్కుడా కనిపించడంలేదని షర్మిల విమర్శించారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టానని చెప్పారు. ఈ సారి ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని.. కడప ఎంపీ విజయం నుంచే అది ఆరంభం అవుతుందని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు