Buggana: మురికిగా నీళ్లు.. రోడ్లేమో వేయరు!.. మంత్రి బుగ్గనకు నిరసన సెగ

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సుందర్ సింగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ రోడ్లు, తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని మహిళలు ఆయన్ను నిలదీశారు.

Published : 06 May 2024 13:03 IST

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సుందర్ సింగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ రోడ్లు, తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని మహిళలు ఆయన్ను నిలదీశారు. చాలా రోజుల నుంచి సరైన రోడ్లు లేవని, మట్టి రోడ్లతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు వాపోయారు. తాగునీటి పైప్‌లైన్‌ లీకై నీరు కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులకు ఒకసారైనా నీళ్లు రావడంలేదని తెలపడంతో నీటి సరఫరా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాలనీలో ఉన్న బోరింగ్‌కు కూడా రిపేర్‌ చేయించడం లేదని తెలిపారు. కాలనీవాసులు చందాలు వేసుకొని మరమ్మతులు చేయిస్తున్నట్లు చెప్పారు. దీంతో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

మరిన్ని