KCR: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ అనిశ్చితి: కేసీఆర్‌

పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ అనిశ్చితి రాబోతోందని భారాస (BRS) అధినేత కేసీఆర్‌ (KCR) అన్నారు.

Updated : 07 May 2024 12:36 IST

పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ అనిశ్చితి రాబోతోందని భారాస (BRS) అధినేత కేసీఆర్‌ (KCR) అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల బస్సుయాత్రలో ఉన్న కేసీఆర్‌ సోమవారం ‘ఈనాడు-ఈటీవీ’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రధాని మోదీ వికృతరూపానికి దిల్లీ మద్యం కేసు నిదర్శనమని కేసీఆర్‌ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల్ని రాచిరంపాన పెడుతోందని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలు రెఫరెండమన్న సీఎం తోకముడిచారని.. తాము 12కుపైగా లోక్‌సభ సీట్లు గెలవబోతున్నామని వెల్లడించారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు.

Tags :

మరిన్ని