Komatireddy: వచ్చే నెల నుంచే ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తాం!: మంత్రి కోమటిరెడ్డి
ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చుతాం. వంద రోజుల్లో అమలు చేసి తీరుతాం. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పులపాలైంది. అందువల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోంది’’ అని మంత్రి చెప్పారు.
Published : 23 Jan 2024 16:25 IST
Tags :