Nara Brahmani: మంగళగిరిలో.. వాలీబాల్ ఆడి అలరించిన నారా బ్రాహ్మణి!

ఏపీలో రాజ్యాంగం ప్రకారం పాలన జరగడంలేదని నారా లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంగళగిరిలో ఆమె విస్తృతంగా పర్యటించారు. నారా లోకేశ్‌ క్రీడా ప్రాంగణంలో పిల్లలతో కలిసి సరదాగా కాసేపు వాలీబాల్ ఆడి అలరించారు.

Published : 05 May 2024 21:25 IST

ఏపీలో రాజ్యాంగం ప్రకారం పాలన జరగడంలేదని నారా లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంగళగిరిలో ఆమె విస్తృతంగా పర్యటించారు. నారా లోకేశ్‌ క్రీడా ప్రాంగణంలో పిల్లలతో కలిసి సరదాగా కాసేపు వాలీబాల్ ఆడి అలరించారు. అనంతరం ఎస్ఆర్ అపార్ట్‌మెంట్‌వాసులతో నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు. తమ ఇంటి దగ్గర ఉన్న ప్రజావేదికను కూల్చి.. వైకాపా తన విధ్వంస పాలనను ప్రారంభించిందని బ్రాహ్మణి మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పనులను పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కల్పనతోపాటు మంగళగిరికి ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. 

Tags :

మరిన్ని