భూ వివాదం కారణంగానే రామకృష్ణయ్య హత్య: వరంగల్ సీపీ
భూ వివాదం కారణంగానే విశ్రాంత ఎంపీడీవో రామకృష్ణయ్య హత్య జరిగిందని వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. జనగామ జిల్లాలో అపహరణకు గురై, అనంతరం హత్యకు గురైన రామకృష్ణయ్య కేసులో.. ఐదుగురు సభ్యుల సుపారీ గ్యాంగ్లో ముగ్గురిని అరెస్టు చేశామని సీపీ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. అంజయ్య అనే నిందితుడు అసైన్డ్ భూములు కొనుగోలు చేయగా.. ఆ భూములపై రామకృష్ణయ్య అధికారులకు ఫిర్యాదు చేశారని సీపీ తెలిపారు. ఆ ఫిర్యాదు మేరకు అంజయ్య కొన్న భూములను.. అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారని చెప్పారు. ఈ విషయంలో పగ పెంచుకొని, రామకృష్ణయ్యను అంజయ్య సుపారీ గ్యాంగ్తో హత్య చేయించాడని సీపీ వివరించారు.
Published : 18 Jun 2023 20:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్