చేపల పరదాలు..!
‘చేపా చేపా ఎందుకు ఎండలేదూ అంటే... గడ్డిమోపు అడ్డమొచ్చిందీ...’ వంటి కథలు అక్కడ వినిపించవు. ఎండేలా ఎండబెడితే ఎలాంటి చేపయినా ఎండి తీరాల్సిందే అంటారు కోలి తెగ వాసులు. ముంబైలో వాళ్లు నివసించే కోలి వాడలకు- ముఖ్యంగా వెర్సోవా బీచ్ వైపు వెళితే...
చేపల పరదాలు..!
‘చేపా చేపా ఎందుకు ఎండలేదూ అంటే... గడ్డిమోపు అడ్డమొచ్చిందీ...’ వంటి కథలు అక్కడ వినిపించవు. ఎండేలా ఎండబెడితే ఎలాంటి చేపయినా ఎండి తీరాల్సిందే అంటారు కోలి తెగ వాసులు. ముంబైలో వాళ్లు నివసించే కోలి వాడలకు- ముఖ్యంగా వెర్సోవా బీచ్ వైపు వెళితే... అంతస్తులవారీగా కట్టిన వెదురు గుంజలూ వాటికి పరదాల్లా వేలాడుతున్న చేపలూ కనిపిస్తాయి. కోలి ప్రజలు ఓర్పుగా నేర్పుగా కర్రలకి చేపల్ని కట్టే పద్ధతే ఎంతో చిత్రంగా ఉంటుంది. ఒక చేప నోట్లో మరో చేప తలని దూర్చి, కర్రకి అటొకటీ ఇటొకటీ వచ్చేలా వేలాడదీస్తుంటారు. ఆ చేపలు మూడునాలుగురోజుల్లో ఆసాంతం ఎండి, ఎంతకాలమైనా నిల్వ ఉంటాయి. చేపల్ని పట్టడం, వాటిని అమ్మడమే ప్రధాన వృత్తిగా చేసుకున్న కోలి తెగ ప్రజలకు చేపలన్నా చేపలతో చేసే రకరకాల వంటకాలన్నా మహా ఇష్టం. అందులోనూ ఈల్ చేపల మాదిరిగా ఉండే బాంబే డక్ లేదా బాంబిల్ చేపలంటే మరీనట. అందుకే వేసవిలో పట్టిన ఈ రకం చేపల్ని జాగ్రత్తగా ఎండబెట్టి నిల్వచేసుకుంటారట. వర్షాకాలంలో సముద్రంలోకి వెళ్లరు కాబట్టి అవసరం మేరకు ఇంట్లో ఉంచుకుని మిగిలినవి మార్కెట్కు తరలిస్తారట... చేప రుచి లేందే వాళ్లకి ముద్ద దిగదు మరి!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
తాజా వార్తలు (Latest News)
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?