మరణ శాసనం
మనిషి తన జీవితకాలంలో ఎంతో కొంత సంపద ఆర్జిస్తాడు. ‘బీదవాడిగా పుట్టడం తప్పు కాదు. కాని, బీదవాడిగా మరణించడం తప్పు’ అంటారు. ఎంతో కిందిస్థాయి నుంచి గొప్పస్థాయికి చేరినవాళ్లు మనకు చాలా మంది కనిపిస్తారు.
మనిషి తన జీవితకాలంలో ఎంతో కొంత సంపద ఆర్జిస్తాడు. ‘బీదవాడిగా పుట్టడం తప్పు కాదు. కాని, బీదవాడిగా మరణించడం తప్పు’ అంటారు. ఎంతో కిందిస్థాయి నుంచి గొప్పస్థాయికి చేరినవాళ్లు మనకు చాలా మంది కనిపిస్తారు.
స్థాయీభేదం వివిధ రంగాలకు సంబంధించి ఉంటుంది. ప్రపంచం ధనం అనే ఇరుసు మీద తిరుగుతుంటుంది. అభినందించేవాళ్లకంటే అసూయచెందేవాళ్లే సమాజంలో ఎక్కువ. పువ్వులిచ్చేవాళ్లకన్నా రాళ్లు విసిరేవాళ్లే విరివిగా కనిపిస్తారు.
ప్రపంచ సంపదల్లో ఐశ్వర్యానికి ప్రథమ స్థానం ఉన్నా, మరికొన్నింటి గురించీ ముచ్చటించుకోక తప్పదు. విద్య, ఆధ్యాత్మిక సాధన, లలితకళలు, సంగీత సాహిత్యాలు- ఇలా వివిధ రంగాల్లో కృషికి తగిన స్థాయి లభిస్తుంది. స్థాయికి తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయి.
ప్రతి వ్యక్తీ, వారసులకు తన ఆర్జనలో భాగస్వామ్యం కల్పించాలని తహతహలాడతాడు. అక్రమార్జనాపరులు కొన్ని తరాలవరకు తమ వంశీకులు సుఖజీవనం గడపాలని అపారంగా ఆస్తులు కూడబెడతారు. చట్టానికి పట్టుబడకుండా అనామకుల పేర్లమీద ఆస్తులు రాస్తారు. చట్టానికి కళ్లు లేకపోయినా దృఢమైన చేతులున్నాయి. వాటికి చిక్కినప్పుడు విలాపం తప్పదు. అప్పుడు పశ్చాత్తాపం, ఆత్మ విచారం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.
ధనం సుఖాన్నిస్తుంది. కాని, దుఃఖాన్ని నివారించలేదు. కాబట్టి, జీవిత పరమా వధి ధనార్జన మాత్రమే కాకూడదు. కేవలం ధనార్జనలో జీవితాన్ని గడిపిన వాళ్లను ఈ లోకం గుర్తుపెట్టుకోదు. ఆ ధనాన్ని లోకక్షేమం కోసం వెచ్చించిన వారిని మరిచి పోదు. కేవలం తనవారి కోసమే పాటుపడినవాళ్లను, అయినవాళ్లే మరిచి పోతారు.
ఆచారాలు పాటించినా ఆశ్రితులను ఆదుకునేవాళ్లను ప్రపంచం పూజిస్తుంది. నడిచే దేవుడిగా, పెరియవగా ప్రసిద్ధి కెక్కిన కంచి పెదస్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతి ఆ కోవకు చెందినవారు. ఇప్పటికీ వేలాది భక్తులు ఆయన్ను మనసు అనే గుడిలో ఆరాధిస్తుంటారు. ఆయన ఆర్తులను ఆదుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎందరో సాధకులకు, ఆధ్యాత్మికవేత్తలకు ఆయన ఆదర్శం. ఎవరు ఆధ్యాత్మిక ఆదర్శాన్ని పాటిస్తారో వారు ధన్యజీవులు.
జన్మించినవారికి మరణం తప్పదు. జననం- మరణాలకు మధ్యగల కాలమే మనది. అందులో కొంత భాగాన్ని కాలం హరిస్తుంది. మిగిలిన స్వల్పకాలం ఎంత సద్వినియోగం చేసుకుంటే అంతగా జన్మ సాఫల్యం కలుగుతుంది. మరణించే ముందు తమ సంపదను వారసులకు కట్టబెట్టేది మరణశాసనం. జీవి ఏ విధంగా మరణించాలో నిర్ణయించేది కూడా మరణశాసనమే. మనిషి ఘనత జననంలో కంటే మరణంలోనే తెలుస్తుందంటారు. అభిమన్యుడు వీరమరణం చెంది అమరుడైనాడు. కర్ణుడు మహాదాతగా ప్రఖ్యాతి పొందాడు.
అంత ఘనులం కాకపోయినా మన స్థాయికి తగిన విధంగా ప్రపంచ క్షేమం కోసం పాటుపడాలి. మరణంలోగా భూమాత రుణం తీర్చుకోవాలి. మాతతోపాటు మాతృదేశానికి మనస్ఫూర్తిగా సేవలందించాలి. మన వారసులకే కాదు, సమాజంలో మనసున్న వారందరికీ మన జీవితం ఆదర్శం కావాలి. ఈ ఆదర్శమే మనం జాతికి ఇచ్చే సంపద. మహానాయకులు జాతికి ఇచ్చిన వారసత్వ సంపద ఇదే. వారి త్యాగాలే మన స్వేచ్ఛా జీవనానికి పునాదులయ్యాయి. ఆస్తుల పంపకానికి రాసేది లిఖిత మరణ శాసనం. ఆదర్శాలను పంచేది అలిఖిత మరణశాసనం!
కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు
-
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
-
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం