సౌందర్యం
భగవంతుడి సృష్టిలో ఎన్నెన్నో అందాలు. అందాన్ని ఆస్వాదించడం ఆరాధించే లక్షణం జీవుల్లో మనిషికే లభించిన గొప్ప వరం. పక్షులు, నదులు, లోయలు, పర్వతాలు, సూర్యోదయ సూర్యాస్తమయాలు, చల్లని వెన్నెల, వసంతరాత్రులు, రుతువులతోపాటు అలంకరణ మార్చుకొనే ప్రకృతికాంత... అంతా సౌందర్యమయమే. ‘అందమైనదాన్ని చూసే అవకాశాన్ని కోల్పోకూడదు.
భగవంతుడి సృష్టిలో ఎన్నెన్నో అందాలు. అందాన్ని ఆస్వాదించడం ఆరాధించే లక్షణం జీవుల్లో మనిషికే లభించిన గొప్ప వరం. పక్షులు, నదులు, లోయలు, పర్వతాలు, సూర్యోదయ సూర్యాస్తమయాలు, చల్లని వెన్నెల, వసంతరాత్రులు, రుతువులతోపాటు అలంకరణ మార్చుకొనే ప్రకృతికాంత... అంతా సౌందర్యమయమే. ‘అందమైనదాన్ని చూసే అవకాశాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే, అందం దేవుడి చేతిరాత’ అంటారు ఒక తత్వవేత్త. అందం ఒక రూపమే కాదు, ఒక పరవశం. అందుకే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని తాపత్రయపడతారు. వారు పూజించే దైవాలను సైతం అత్యంత సౌందర్యమూర్తులుగా ఆవిష్కరించుకొంటారు.
కంటికి కనిపించేది, రూపురేఖలకు చెందినది బాహ్యసౌందర్యం. గుణాలకు, వ్యక్తిత్వానికి చెందినది అంతస్సౌందర్యం. నిత్యమైనది సత్యమైనది నాశనం లేనిది- శాశ్వత సౌందర్యం. బాహ్యసౌందర్యం అందరినీ ఆకర్షిస్తుంది. అది సుమశరుడి సమ్మోహనాస్త్రం. చక్రవర్తులను సైతం పాదాక్రాంతుల్ని చేసుకోగలిగేది, తాపసులను సైతం తపింపజేయగలదు. అది ప్రకృతి సహజం.
అంతస్సౌందర్యం కంటికి కనిపించేది కాదు, అది హృదయంలో పొందే అనుభూతి. అది మనుషుల వ్యక్తిత్వంలో ప్రస్ఫుటమవుతుంది. నడతలో ఆత్మవిశ్వాసం, హృదయంలో నిర్మలత్వం, చూపులో సానుభూతి, మాటల్లో మర్యాద నిజాయతీ, చేతల్లో సహాయం మొదలైనవి వారి లక్షణాలు. అటువంటివారు అందరి అభిమానాన్నీ పొందుతారు. బాహ్య సౌందర్యం వసంతమాసంలో వికసించే పుష్పం. అంతస్సౌందర్యం వినీల ఆకాశంలో ప్రకాశించే తార. భారతీయ తాత్విక చింతనలో ‘సత్యం శివం సుందరం’ అనేవి విడదీయరానివి. ఏది నిత్యమో అదే సత్యం. ఏది సత్యమో అదే శివం. ఏది శివమో అదే సుందరం. అదే శాశ్వత సౌందర్యం!
ఈ దృశ్యమాన జగత్తులో అణువు నుంచి బ్రహ్మాండం వరకు అన్నింటా ఆత్మరూపంలో వెలుగుతూ, క్షణక్షణం మారుతున్న ఈ దృశ్య జగత్తులో తాను మాత్రం మారక కాలాతీతుడై ఉండేవాడు పరమాత్మ. దేహానికి, దానిలోని అంతఃకరణాలైన మనసు బుద్ధి చిత్తం అహంకారాలకు అతీతంగా ఉండి, అవి జరిపే కార్యకలాపాలకు సర్వసాక్షిగా నిలిచి, దేహం నశించిన తరవాతా ఆత్మగా వెలుగొందే నిత్యం సత్యం అయిన ఆ పరమాత్మే శాశ్వత సౌందర్యం. శాశ్వత సౌందర్యాన్వేషణ అంతర్ముఖుణ్ని చేస్తుంది.
ధనుర్దాసు గొప్ప విలుకాడు, మల్లయోధుడు. అంతకు మించి సౌందర్య పిపాసి. ప్రేయసి నేత్ర సౌందర్యానికి దాసుడు. సదా ఆమె కన్నులనే చూస్తూ తన్మయత్వంలో మునిగిపోయి వాటి సోయగానికి ఎండ తగలకుండా గొడుగు పట్టుకుని తిరిగేవాడు. అది గమనించిన భగవద్రామానుజులు ‘ఈ సౌందర్యం కొన్నాళ్లకు తరిగిపోతుంది. నీకు శాశ్వత సౌందర్యాన్ని చూపిస్తాను’ అని కోవెలలో శ్రీ రంగనాథుని దర్శింపజేస్తారు. శాశ్వత సౌందర్యానుభూతి చెందిన ధనుర్దాసు రామానుజుల శిష్యుడై రంగనాథుడి భక్తుడై జన్మ సార్థకం చేసుకొన్నాడు.
బాహ్య సౌందర్యంలోను, అంతస్సౌందర్యంలోను, అన్నింటా ప్రకాశిస్తూ వీటికి అతీతంగా వెలిగే శాశ్వతమైన ఆత్మ సౌందర్యాన్వేషణ చేయాలి. అందుకు త్రికరణ శుద్ధిగా సాధన చేయాలి. అప్పుడే అది అనుభవైకవేద్యమవుతుంది. ఆ స్థితికి చేరిన క్షణం బ్రహ్మానందసింధువులో బిందువులమవుతాం.
కస్తూరి హనుమన్నాగేంద్ర ప్రసాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్