గొప్ప స్నేహితుడు
నిస్వార్థంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా మేలు చేసేవాడు స్నేహితుడు. అలాంటి స్నేహితుణ్ని పొందాలంటే అటువంటి స్నేహాన్ని ముందు అతడికి అందించే అర్హత మనం సంపాదించుకోవాలి.
నిస్వార్థంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా మేలు చేసేవాడు స్నేహితుడు. అలాంటి స్నేహితుణ్ని పొందాలంటే అటువంటి స్నేహాన్ని ముందు అతడికి అందించే అర్హత మనం సంపాదించుకోవాలి. నిజమైన స్నేహవృక్షం త్యాగాన్ని పూస్తుంది. సేవను ఫలిస్తుంది. ఆదర్శ బీజాన్ని ప్రసాదిస్తుంది. విశ్వకల్యాణానికి నీడనిస్తుంది. భావితరాలకు మార్గనిర్దేశం చేస్తుంది. మిత్రుడి ఆపదలను తనంతతానే గ్రహించి, ఆదుకునేవాడే అసలైన మిత్రుడు.
మనిషికి విపత్తులు రావడం కూడా మంచిదేనని, ఆ విపత్తులలో ఎవడు తానుగా వచ్చి ఓదార్పును, సలహాలను ఇవ్వడమే కాకుండా గట్టెక్కిస్తాడో వాడే నిజమైన మిత్రుడని మనకు అర్థమవుతుంది. చెరువునిండా నీరున్నప్పుడు కప్పలు ఎన్నో చేరతాయి. చెరువు ఎండిపోగానే, అక్కడ ఒక్క కప్పా కనిపించదు. వేమన చెప్పిన ఈ సూక్తిలో ఎంతో అంతరార్థం ఉంది. స్నేహానికి దీన్ని అన్వయించుకోవాలి.
రామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహశపథం చేసి పరస్పరం సహకరించుకున్నారు. వాసుదేవుడు సుదీర్ఘ కాలం తరవాత తనను చూడవచ్చిన కుచేలుడికి సకల మర్యాదలు చేసి, అతడి దీన స్థితిని గ్రహించి, అపార సంపదను ఇచ్చి అనుగ్రహిస్తాడు. ఫలితం ఎలా ఉన్నా మైత్రీబంధానికి కర్ణదుర్యోధనుల స్నేహమూ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
స్నేహసౌధానికి పునాది వేసేది ప్రేమ. సకల ప్రాణికోటి మనుగడకు మూలం ప్రేమే. ప్రేమ అహింసను ఆహ్వానిస్తుంది. స్నేహానికి మొగ్గ తొడు గుతుంది. ప్రశాంత జీవన యాగానికి సమిధ అవు తుంది. ప్రేమ, స్నేహం... ఒకదానికొకటి ఆశ్రయించి ఉంటాయి.
తైలం వేయకపోయినా వెలిగే దీపం స్నేహం. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించేదే స్నేహం. ఏ కోరికా లేకుండా త్యాగానికి సిద్ధపడేదే స్నేహం. ఇవాళ మనిషి స్నేహాన్ని సృష్టి నుంచి, సకల జీవజంతుజాలం నుంచి నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. గాలి మబ్బుతో స్నేహం చేస్తుంది. మబ్బు నీటితో స్నేహం చేస్తుంది. నీరు మొక్కతోను, మొక్క పూవుతోను, పూవు పరిమళంతోను స్నేహం చేస్తాయి. పరిమళం మళ్ళీ గాలితో స్నేహం చేస్తుంది. ఇది ఒక ఆవృత్తం. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మనుషుల్లో ఇలాంటి స్నేహం ఎక్కడో అరుదుగా గాని కనిపించదు.
నిస్సంకోచంగా, నిర్భీతిగా, నిరాపేక్షగా సాయపడేందుకు కావాల్సిన శక్తి, ఉత్సాహం, శౌర్యం, ఆత్మవిశ్వాసం, ఔదార్యం, ఆత్మీయత- ఈ లక్షణాలు సన్మిత్రుడికి ఉంటాయని గుప్తుల కాలంనాటి నీతి గ్రంథం ‘కామందికీ నీతిసారం’లోని శ్లోకం చెబుతోంది. ‘శవం మహాప్రస్థానం చేరినప్పుడు దహనం అయ్యేవరకు నిలిచేవాడే నిజమైన హితుడు, స్నేహితుడు’ అని చాణక్య శతకం చెబుతోంది.
‘నన్ను సర్వభూతాలకు స్నేహితుడిగా గ్రహించేవాడు శాంతి పొందుతాడు’ అన్న వాసుదేవుడి గీతావాక్యం విన్నాక, భగవంతుణ్ని మించిన స్నేహితుడు లేడని నిర్ద్వంద్వంగా సర్వులూ అంగీకరిస్తారు. చిత్తశుద్ధితో భగవన్నామస్మరణ చేసేవాడికి పరమాత్మే గొప్ప స్నేహితుడిగా కనిపిస్తాడు. భగవంతుణ్ని గొప్ప స్నేహితుడిగా భావించేవాడు సృష్టిని ప్రేమిస్తాడు. సమస్త ప్రాణికోటినీ ప్రేమిస్తాడు. తన విధ్యుక్త ధర్మం నిర్వర్తిస్తూనే, ఆధ్యాత్మిక సంపదను సముపార్జించే తపస్సులో నిమగ్నుడై ఉంటాడు. జగత్తునే స్నేహమాధుర్యమయంగా దర్శిస్తాడు.
మనం దేనికి యోగ్యులమో అదే ప్రసాదిస్తాడు భగవంతుడు. అనుభవించే అర్హత లేనప్పుడు ఎంత ప్రార్థించినా అనుగ్రహించడు. ఈ అక్షరసత్యాన్ని ఎరిగినవాడు పరమేశ్వరుడే గొప్ప స్నేహితుడని నమ్ముతాడు. అహంకారం, అజ్ఞానం విడిచి, ఆత్మసమర్పణ భావం పొందినవాడే జ్ఞాని అని, ఆ జ్ఞానికే సర్వ శ్రేష్ఠ మిత్రుడి రూపంలో శ్రీహరి దర్శనమిస్తాడని విజ్ఞులు విశ్వసిస్తారు.
చిమ్మపూడి శ్రీరామమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?