హృదయ కురుక్షేత్రం
యుద్ధానికి సర్వం సిద్ధం అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంగ్రామం ముందుకు వచ్చింది. పలు సంఘర్షణలు, ఆరోపణలు, రాజనీతి, రాయబారాలు, వాదాలు, వివాదాలు... చివరకు యుద్ధానికి దారితీశాయి. కురు, పాండవ సైన్యాలు పరస్పరం ఎదురెదురుగా పోరాటానికి నిలిచాయి.
యుద్ధానికి సర్వం సిద్ధం అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంగ్రామం ముందుకు వచ్చింది. పలు సంఘర్షణలు, ఆరోపణలు, రాజనీతి, రాయబారాలు, వాదాలు, వివాదాలు... చివరకు యుద్ధానికి దారితీశాయి. కురు, పాండవ సైన్యాలు పరస్పరం ఎదురెదురుగా పోరాటానికి నిలిచాయి. ధర్మం వైపు ఏడు, అధర్మం వైపు పదకొండు అక్షౌహిణుల సైన్యం మోహరించింది. ఇదీ మంచి చెడుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామ దృశ్యం. ఆనాటి కురుక్షేత్రం ఈనాటికీ ఏదో పేరు మీద జరుగుతున్న పోరాటమే. పేర్లు ప్రదేశాలు వేరు కావచ్చు కానీ పోరాటం మాత్రం యథాతథం. అడుగడుగునా విశ్వవ్యాప్తంగా జరిగే సంఘర్షణకు అది ప్రతీకగా నిలుస్తుంది. కురుక్షేత్రం ఒక ప్రదేశం. అన్ని విధాలా యుద్ధానికి తగిన ప్రదేశమని ఇరుపక్షాలు నిర్ణయించాయి. అటువంటి యుద్ధభూమి ఎక్కడో లేదు. అది మనలోనే ఉంది. మనిషి శరీరంలోని హృదయక్షేత్రం అటువంటిదే. అక్కడే మంచి, చెడులు మోహరించి ఉంటాయి. ప్రతిక్షణం జరిగే అంతర్మథనం ఒక సంగ్రామం. పాండవుల పక్షాన నిలిచిన వారికన్నా కౌరవసైన్యం ఎక్కువ. అంతరంగంలో మంచికన్నా చెడుగుణాలు ఎక్కువగా ఉంటాయని, వాటి ప్రభావంతోనే మనిషి పతనం అవుతున్నాడని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. సత్వగుణం ఒకవైపు అణిగి ఉంటే, రజో తమో గుణాలు కలిసి విజృంభిస్తాయని భగవద్గీత పదిహేడో అధ్యాయం చెబుతోంది.
సామాజిక రంగంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. మంచి తక్కువగా, చెడు గుణాలు ఎక్కువగా కనిపించడం ప్రస్తుతం సాధారణమైంది. మంచికన్నా చెడు త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఆకర్షణలు, ప్రయోజనాలు మనిషిని ఆకర్షిస్తాయి. ఏదో ఒక బలహీనతకు మనిషి లొంగిపోయి తప్పు అని తెలిసినా ఆవైపు చేరతాడు. ధర్మం ఉన్నవైపు విజయం తప్పదని భగవద్గీత చెబుతుంది. మంచి బోధించే కృష్ణుడు, ఆచరించే అర్జునుడు ఉంటే- గెలుపు తథ్యం. అంతరంగాన్ని పవిత్రం చేసుకుని సత్వ గుణాన్ని పెంచుకుంటే మనిషి ధర్మం వైపు ప్రయాణం చేసి గమ్యం చేరతాడు. సమాజంలో జరుగుతున్న పోరాటం మంచి చెడుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామం వంటిది. అధర్మ పక్షాన నిలిచి అసుర గుణాలు కలిగిన అఖండ సైన్యాన్ని చూసి అర్జునుడు నిరాశ చెందాడు. బంధువులు, స్నేహితులు, సోదరులు అధర్మానికి కొమ్ము కాస్తున్నారు. తన తోటివారిని సంహరించడానికి వెనకడుగు వేశాడు. ధర్మం పక్షాన నిలిచిన శ్రీకృష్ణుడు ధైర్యం చెప్పాడు- నీవు చేసే యుద్ధం రాక్షసత్వం మీదే తప్ప మనుషుల మీద కాదు. సంస్కరించే విధానం కొంత కఠినంగానే ఉంటుంది. నేను చేస్తున్నాను అనే అహంకారం విడిచి కర్తవ్యాన్ని నిర్వహించమని బోధించాడు. మనిషి జీవితంలో అడుగడుగునా పోరాటం చేయడం తప్పదు. చదువు, వృత్తిలో నిలకడ, పనిలో నైపుణ్యత, అనారోగ్యం... ఎన్నో పోరాటాలు, ఆరాటాలు. జీవితమే ఒక కదనరంగం. పోరాడితేనే గెలుపు. మంచితనం కొంత మేరకు బలహీనంగా అసమర్థతతో కనిపిస్తుంది. అది సమయం కోసం వేచి ఉండే ధోరణి మాత్రమే. పదమూడు సంవత్సరాలు వేచి ఉన్న పాండవులు కురుక్షేత్రంలో తమ శక్తి చూపించి అద్భుతమైన విజయాన్ని సాధించారు.
మనకెందుకు అనే నిరాశ, ఉదాసీనత, ఉపేక్ష, దుర్మార్గానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఆయుధం పట్టి యుద్ధం చేయలేదు. ధర్మ పక్షాన నిలిచినవారికి కొండంత నైతిక, మానసిక బలాన్ని అందించాడు. సమాజంలో మన వంతు కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాలి. అదే స్వధర్మం. అయిదు వేళ్లు బిగిస్తే పిడికిలి. అది మన బలాన్ని చూపించే ఆయుధం, విజయానికి చిహ్నం. హృదయ క్షేత్రాన్ని అశాంతి నుంచి ప్రశాంత క్షేత్రంగా మార్చడమే పవిత్ర కర్తవ్యం.
రావులపాటి వెంకట రామారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్