మధుర భక్తి
పరమాత్ముడిపై చూపే పరమ ప్రేమే భక్తి. అది నిరంతరం సాగిపోయే ప్రవాహంలా ఉండాలి. అలా ఉంటేనే దాన్ని భక్తి అంటారని భగవద్రామానుజులవారి ప్రబోధం. భక్తిలో అనేక మార్గాలున్నాయి.
పరమాత్ముడిపై చూపే పరమ ప్రేమే భక్తి. అది నిరంతరం సాగిపోయే ప్రవాహంలా ఉండాలి. అలా ఉంటేనే దాన్ని భక్తి అంటారని భగవద్రామానుజులవారి ప్రబోధం. భక్తిలో అనేక మార్గాలున్నాయి. ఈ సాధనలో చెప్పుకోదగ్గ మార్గం మధుర భక్తి.
తలపులో, కీర్తనలో, సేవలో, ఆరాధనలో మాధుర్యాన్ని చవిచూడటంలో భక్తుడు మధుర భావనకు లోనవుతాడు. పరమాత్మను తన ప్రాణనాథుడిగా, తనను నాయికగా ఊహించుకుంటాడు. భక్తురాలు ఆ పరంధామనే ప్రాణనాథుడిగా తలచి వారికోసం పరితపిస్తుంది. సకల ఉపచారాలు చేస్తుంది. ఆయన ఎడబాటును ఒక్క క్షణం కూడా సహించలేదు. అనుక్షణం ఆయన్నే కీర్తిస్తుంది. ఆయన సాన్నిధ్యాన్ని తరగని పెన్నిధిగా భావిస్తుంది. ఆ పరమాత్మలోనే ఐక్యం కావాలని మనసారా కోరుకుంటుంది.
మధుర భక్తి అనగానే మొదట మనకు గుర్తొచ్చేది గోపికలు. శ్రీకృష్ణుడి పట్ల వారు చూపించే ప్రేమకు మూలం శ్రీరామావతార సమయంలో ఉంది. పురుషులకు సైతం మోహం కలిగించే రూపం రాముడిది. ఆ రూపాన్ని చూసి మోహితులైన మునులు ఆయన ఆలింగనాన్ని అభ్యర్థించారు. శ్రీకృష్ణావతార సమయంలో వారి కోరిక తీర్చగలనని శ్రీరాముడు అనుగ్రహించాడు. దాన్ని అనుసరించి ఆ మునులంతా దేహ త్యాగం చేసి శ్రీకృష్ణావతారంలో గోపికలుగా ఉద్భవించినట్లు చెబుతారు.
గోపికలను జీవాత్మకు, శ్రీకృష్ణుణ్ని పరమాత్మకు ప్రతీకగా తీసుకుంటే ఆత్మ పరమాత్మల అనుసంధానమే జీవిత చరితార్థమనే సత్యాన్ని రాసక్రీడ ఘట్టం తెలుపుతుంది. అయితే లోక విదితమైన శృంగార ఛాయ ఇందులో కనిపించదు. లౌకికమైన దివ్యభావనకు సోపానమై విరాజిల్లుతుంది. గోపికల భక్తిపారవశ్యం అద్వితీయం. వారికి మరో తలంపు లేదు. ఎల్లప్పుడూ శ్రీకృష్ణ లీలలను స్మరించేవారు. ఆయన రూపాన్ని చూస్తూ తమ ఇల్లు బిడ్డలు బంధువులను సైతం మరచిపోయేవారు. కృష్ణుడి కోసం పరితపిస్తూ ఇంటికి వెళ్ళడానికి కూడా మనస్కరించక యమునా తీరంలో ఇసుక తిన్నెలపై విహరించేవారు.
రేపల్లెలో గోపికలు పూర్వజన్మ తపఃఫలం వల్ల శ్రీకృష్ణుడి పట్ల గాఢానురక్తులై ఆయన ప్రేమపూర్వక ఊరడింపు కోసం నిరీక్షణలో కాలం గడుపుతున్నారు. గోపికల పట్ల కరుణాపూరిత మనస్కుడైన శ్రీకృష్ణుడు వారికి పరతత్వజ్ఞానాన్ని కలిగించి జన్మ కర్మ దోష నివారణ మార్గాలు చూపి ముక్తుల్ని చేశాడు.
మధుర భక్తి సంప్రదాయంలో రాధాకృష్ణ ప్రేమ ప్రత్యేకమైంది. రాధ జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ. పరమాత్మను చేరుకోవడానికి జీవాత్మ చేసే సాధనే వారి ప్రణయ స్వభావం. జయదేవుడు రాధాకృష్ణ ప్రణయాన్ని, విరహాన్ని వర్ణిస్తూ మధురమైన కీర్తనలను రచించాడు. అవే అష్టపదులుగా ప్రసిద్ధి చెందాయి.
మీరాబాయి, సక్కుబాయిల భక్తి సైతం ఈ కోవకే చెందుతుంది. వల్లభాచార్యులు మధురాష్టకంలో శ్రీకృష్ణుని స్తుతించిన తీరు చాలా మధురంగా ఉంటుంది. అధరం మధురం అంటూ సాగుతుంది. పెదవి, ముఖం, నేత్రాలు, చిరునవ్వు, హృదయం, నడక... ఒకటేమిటి- ఆయన సర్వస్వం మధురమే అన్నారు. అంత మధురమైన ఆయన ప్రేమ సైతం మధురం.
భాగవతంలోని గోపికల శృంగారం లౌకికమైంది కాదు. అది వారి ప్రేమకు పరాకాష్ఠ. శ్రీకృష్ణుడి రూపంలో పరమాత్మలో తాదాత్మ్యం చెందడానికి చేసే ప్రయత్నాల్లో భాగమే వారి ఆ భావవ్యక్తీకరణ.
వి.ఎస్.రాజమౌళి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
-
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
-
భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!