Andhra News: రుణ భారం 7.76 లక్షల కోట్లు?
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం పెండింగ్ బిల్లులతో కలిపి రాష్ట్ర రుణభారం రూ.7.76 లక్షల కోట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు, ఈ ఏడాది ఎలా గడవాలన్న కోణంలోనే ప్రభుత్వాలు ఆలోచిస్తుండటంతో ఆర్థిక పరిస్థితులు గతి తప్పుతున్నాయి.
జీఎస్డీపీ పరిమితులు, అర్హతలకు మించి అప్పులు
ఆర్థిక సంఘం నిబంధనల ఉల్లంఘన
తిరిగి చెల్లింపులకు సుదీర్ఘ గడువులు
నేడు మరో రూ.943 కోట్ల రుణం
ఈనాడు - అమరావతి
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం పెండింగ్ బిల్లులతో కలిపి రాష్ట్ర రుణభారం రూ.7.76 లక్షల కోట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు, ఈ ఏడాది ఎలా గడవాలన్న కోణంలోనే ప్రభుత్వాలు ఆలోచిస్తుండటంతో ఆర్థిక పరిస్థితులు గతి తప్పుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిమితికి మించి అప్పులు చేస్తోందని, వాటిని తీర్చేందుకు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలంటూ కాగ్ ఇప్పటికే సూచించింది. అప్పు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేసే పరిస్థితులు ఏర్పడటం ప్రమాదకరమంటూ హెచ్చరించింది. ఆదాయ పరిధికి లోబడి రుణాలు సేకరిస్తే, అది శ్రేయస్కరమని ప్రపంచబ్యాంకు సూచిస్తోంది. రాష్ట్ర జీఎస్డీపీలో ఏటా రుణాలు 4 శాతానికి మించకూడదని ఆర్థిక సంఘం చెబుతోంది. ఈ ఆర్థిక సూత్రాలను తోసిరాజని రాష్ట్రం అప్పుల వేటలో కొనసాగడం ఆర్థికవేత్తలను విస్మయ పరుస్తోంది.
పరిమితులంటే లెక్కలేదు
రాష్ట్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరంలో ప్రజాపద్దు, బహిరంగ మార్కెట్ రుణం కలిపి రూ.67,723 కోట్ల అప్పు చేసినట్లు నిపుణులు లెక్కకట్టారు. ఇందులో కార్పొరేషన్ల రుణాలను పరిగణించలేదు. తుది లెక్కలు తేలేసరికి ఇది ఇంకా
పెరగనుంది.
కేంద్ర వ్యయ నియంత్రణ విభాగం 2021-22 ప్రారంభంలో రాష్ట్ర జీఎస్డీపీ అంచనాల మేరకు నిర్దేశించిన పరిమితి దాటిపోయిందని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది బహిరంగ రుణం పరిమితికి మించి రూ.14,086 కోట్లు తీసుకున్నట్లు అంచనా. 2015-16 నుంచి ఇప్పటివరకు ఇలా రూ.51,930.83 కోట్లు సమీకరించినట్లు నిపుణులు లెక్కించారు. 2015-16 నుంచి 2018-19 వరకు పరిమితికి మించి చేసిన అప్పు రూ.18,455.27 కోట్లు కాగా, గత మూడేళ్లలో అది దాదాపు రెట్టింపైంది. 2019-20 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల మధ్య పరిమితికి మించి రూ.33,475.56 కోట్లు సేకరించారు. ఇవి కాకుండా కార్పొరేషన్ల రుణాలు, పెండింగ్ బిల్లులు కూడా రాష్ట్రంపై రుణభారంగానే లెక్కించాలని నిపుణులు పేర్కొంటున్నారు.
పరిమితిని ఎలా నిర్దేశిస్తారంటే?
ఏటా జీఎస్డీపీలో 4శాతానికి రుణాలు పరిమితం చేయాలని ఆర్థిక సంఘం సూచించింది. దీన్ని బట్టి జీఎస్డీపీ అంచనాల ఆధారంగా రాష్ట్ర రుణ పరిమితిని కేంద్రం లెక్కించి అనుమతిస్తుంది. విదేశీ, నెగోషియేటెడ్ రుణాలు, పీఎఫ్, ఇతర ప్రజాపద్దు రూపంలో పొందే మొత్తం ఈ పరిమితి నుంచి మినహాయించారు. పాత అప్పుల చెల్లింపుల మొత్తాన్ని దీనికి కలిపి స్థూల రుణ పరిమితిగా లెక్కించారు. అందులో నుంచి అంతకుముందు సంవత్సరాల్లో అదనంగా చేసిన అప్పుల మొత్తాన్ని తగ్గించి నికర రుణ పరిమితిని తేల్చారు. అందులోనూ 0.5శాతం మూలధన వ్యయంతో అనుసంధానించి కోత పెడుతున్నారు. నిర్దిష్ట పరిమితి మేరకు మూలధన వ్యయం చేస్తేనే ఆ 0.5శాతం రుణం పొందేందుకు అర్హత కల్పిస్తారు. మరో 0.5శాతాన్ని విద్యుత్తు సంస్కరణల అమలు తదితరాలతో ముడిపెడుతున్నారు. 2021-22లో ఇలాంటి అనేక నిబంధనలు పెట్టి రుణ పరిమితిని తగ్గించినా వాస్తవంలో అప్పులు భారీగానే పెరిగాయి. కొన్నింటిలో అంచనాలు తక్కువ చూపి రుణ అర్హత పెంచుకోవడం, జీఎస్డీపీ అంచనాలు ఎక్కువ చూపడం వల్ల పరిమితికి మించి రుణాలు తీసుకునే సౌలభ్యాన్ని సృష్టించారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికితోడు విదేశీ రుణాలు, పీఎఫ్, డిపాజిట్లు, ఇతర నిల్వల రూపంలో వినియోగించే నిధులు, నాబార్డు సాయాన్ని తక్కువగా చూపుతున్నట్లు చెబుతున్నారు. అంచనాలు, వాస్తవాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతోంది.
* 2021-22 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్, ఇతర ప్రజాపద్దు రూపంలో కేవలం రూ.1,500.21 కోట్లు మాత్రమే రుణం తీసుకోవచ్చని తొలుత ప్రభుత్వం అంచనా వేసింది. కాగ్ వెలువరించే నెలవారీ నివేదికలు పరిశీలిస్తే సవరించిన లెక్కలకు, అంచనాలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. తాజా లెక్కల ప్రకారం ప్రజాపద్దు రూపంలో వినియోగించుకున్నది రూ.12 వేల కోట్లు ఉంది. విదేశీ ఆర్థిక సంస్థల రుణాలను రూ.2,000 కోట్లుగా అంచనా వేసి, చివరకు రూ.3,976 కోట్లు తీసుకున్నారు.
* 2020-21లో పీఎఫ్, ప్రజాపద్దు నికర మొత్తం రూ.1972.84 కోట్లుగా అంచనా వేశారు. సవరించిన అంచనాల ప్రకారం ఆ మొత్తం రూ.10,916.77 కోట్లకు చేరింది. విదేశీ రుణాల అంచనా రూ.1,756.66 కోట్లు కాగా, వాస్తవ లెక్కల్లో రూ.4,562.74 కోట్లుగా తేలింది.
చెల్లింపుల గడువులోనూ వెసులుబాటు
గతంలో బహిరంగ మార్కెట్ రుణాలను ఐదేళ్లలోపు చెల్లించాల్సి ఉండేదని, ఒక ప్రభుత్వం చేసిన అప్పును తదుపరి ప్రభుత్వ హయాంలో తీర్చేవారని ఆర్థికశాఖ విశ్రాంత అధికారులు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట ఈ గడువులో వెసులుబాటు కల్పించడంతో అప్పుల భారం పెరిగిపోతోందని విశ్లేషిస్తున్నారు. ఇటీవల 20 ఏళ్ల కాలపరిమితితోనూ బహిరంగ మార్కెట్లో రుణసమీకరణ చేస్తున్నారు
ఇవి కాకుండా మూడేళ్లుగా సరఫరాదారులకు, గుత్తేదారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇతరత్రా బకాయిలు రూ.1,50,000 కోట్లు చెల్లించాల్సి ఉందని అంచనా. సీఎఫ్ఎంఎస్ వెబ్సైట్ సమాచారం ప్రకారమే ఇవి రూ.60 వేల కోట్లకు మించిపోయాయి. ఈ రూపేణా రాష్ట్రంపై మొత్తం రుణ భారం రూ.7.76 లక్షల కోట్లకు చేరుతోందని అంచనా. జీఎస్డీపీలో రుణభారం వాటా పెరిగిపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
నేడు చివరి విడత రుణం
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి విడతగా మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలోరూ.943 కోట్ల మేర రుణ సమీకరణకు ప్రతిపాదనలు పంపింది. 20 ఏళ్ల కాలపరిమితితో ఈ మొత్తం తీసుకునేందుకు సెక్యూరిటీల వేలంలో పాల్గొంటోంది. వడ్డీరేటు ఎంతన్నది మంగళవారం ఖరారవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి పట్టించుకోలేదు. -
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు. -
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. -
మోదీజీ.. మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా!
‘‘హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి. -
‘బందోబస్తు’ బహుపరాక్!
సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అనూహ్య వర్షాలతో అతలాకుతలం
వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి
ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
రాజమహేంద్రవరం విలవిల
అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. -
‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. -
పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
‘ఆ చీకటి చట్టం రాకముందే’ ఇన్ని అగచాట్లా?
‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
నడవాలు ‘నాశనం’!
‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు. -
అమరావతి అభివృద్ధితోనే ఏపీ పురోగతి
రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
‘అంబేడ్కర్’ను తొలగించి.. తన పేరు తగిలించి..!
గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు. -
విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి
రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు. -
జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే రూ.500 కోట్లు దొంగిలించింది
జగన్ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
పోలీసు వ్యవస్థపైనే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
దురుద్దేశంతో కేసు నమోదు
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
-
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి