ఓటీఎస్కు డ్వాక్రా అప్పు!
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణం తీసుకుని కట్టిన ఇళ్లకు వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో చేపట్టిన వసూళ్ల కోసం ప్రభుత్వం డ్వాక్రా అస్త్రం ప్రయోగిస్తోంది.క్షేత్రస్థాయిలో లబ్ధిదారులపై అధికారులు
వసూళ్లు సరిగా లేకపోవడంతో ప్రభుత్వ ప్రత్యామ్నాయ మార్గం
లబ్ధిదారుల్లో డ్వాక్రా సభ్యులు భారీగా ఉండటంతో సులువనే అభిప్రాయం
ఈనాడు డిజిటల్ - అమరావతి
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణం తీసుకుని కట్టిన ఇళ్లకు వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో చేపట్టిన వసూళ్ల కోసం ప్రభుత్వం డ్వాక్రా అస్త్రం ప్రయోగిస్తోంది.
క్షేత్రస్థాయిలో లబ్ధిదారులపై అధికారులు ఎంత ఒత్తిడి తెచ్చినా వసూళ్లు ఆశించినంత లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. నిర్దేశించిన మొత్తాన్ని (రూ.10 వేలు, రూ.15 వేలు, రూ.20 వేలు) సేకరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల వద్దకు వెళ్లగా ఇప్పటికిప్పుడు అంత మొత్తం ఎలా కట్టాలని వారు ప్రశ్నిస్తుండటంతో వసూళ్లను పెంచుకునేందుకు డ్వాక్రాను తెరమీదకు తెచ్చింది. ఓటీఎస్ లబ్ధిదారుల్లో డ్వాక్రా సభ్యులు భారీగానే ఉండటంతో సేకరణలో వెలుగు, డీఆర్డీఏలను భాగస్వాములను చేసింది. సభ్యుల ఇళ్ల వద్దకు యానిమేటర్లు, సీసీలను పంపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటీఎస్ లబ్ధిదారులు 46 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించినా 39 లక్షల మంది
వివరాలే లభ్యమయ్యాయి.
ఓటీస్ రుణాన్ని చెల్లించేందుకు డ్వాక్రా సభ్యులతో అప్పు చేయిస్తున్నారు. రుణం చెల్లించేందుకు నగదు లేదంటున్న డ్వాక్రా సభ్యులకు బ్యాంకు లింకేజీ, పొదుపు నుంచి రుణం ఇప్పిస్తున్నారు. బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంటే 9% వడ్డీతో తిరిగి చెల్లించాలి. అదే పొదుపు ద్వారా అయితే రూపాయి వడ్డీ (12%) కట్టాలి. వాస్తవానికి డ్వాక్రా రుణాలను వారి జీవనోపాధికి వినియోగించుకోవాలి. కాని ప్రభుత్వం ఇలా అప్పులకు వినియోగించుకోవడం విమర్శల పాలవుతోంది. ఓటీఎస్ మొత్తాన్ని కట్టేందుకు పొదుపు ద్వారా రూ.10వేలు తీసుకుంటే ఆ రుణాన్ని 10 నెలల్లో నెలకు రూ.1,100 చెల్లించాలని విశాఖ జిల్లా నక్కపల్లిలో వెలుగు అధికారులు లబ్ధిదారులకు చెబుతున్నారు. అంటే 10 నెలల్లో అదనంగా రూ.1000 చెల్లించాలి.
వీటిని క్షేత్రస్థాయికి పంపి పరిశీలిస్తే 23 లక్షల మందినే గుర్తించగలిగారు. వీరి వివరాలను ఆన్లైన్ చేశారు. వీరిలో డ్వాక్రా సభ్యుల్ని గుర్తించేందుకు మండలాల్లోని వెలుగు కార్యాలయాలకు పంపి డ్వాక్రా సభ్యులతో ప్రత్యేక జాబితాను సిద్ధం చేశారు. అధికారులు ఎక్కువగా డ్వాక్రా సభ్యుల నుంచి వసూళ్లు రాబట్టడంపై దృష్టి సారించారు. కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే జిల్లా స్థాయి ఓటీఎస్ మేళాలు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లాలో 1.17 లక్షల మంది ఓటీఎస్ లబ్ధిదారులు ఉంటే అందులో పొదుపు మహిళలు 81 వేలమంది ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకు లింకేజి, పొదుపు నుంచి 1,800 మంది రుణం తీసుకుని కట్టారు. కడప జిల్లా ముద్దనూరు మండలంలో 9 వేల మంది ఓటీఎస్ లబ్ధిదారులు ఉండగా అందులో 6వేల మందిని అధికారులు గుర్తించారు. ఇందులో 700 మంది వరకు డ్వాక్రా సభ్యులు, వారి కుటుంబసభ్యులు ఉంటారని గుర్తించారు. స్థానికంగా ఉన్న సీసీలు, యానిమేటర్లు వారం రోజులుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వసూలుకు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం మండలం నుంచి 50 మందితో ఓటీఎస్ మొత్తాన్ని కట్టిస్తే అందులో అత్యధికులు డ్వాక్రా సభ్యులే. అనంతపురం జిల్లా యాడికి మండలంలో 4,500 మంది వరకు ఓటీఎస్ లబ్ధిదారులు ఉంటే అందులో 500 మంది వరకు డ్వాక్రా సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు వందమంది పైనే రుణం తీసుకుని చెల్లించారు.
మార్కాపురంలో ఒక్కో వీవోఏకి 10 మంది టార్గెట్
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పరిధిలో ఒక్కో యానిమేటర్ (వీవోఏ) 10 మంది లబ్ధిదారులతో ఓటీఎస్ మొత్తాన్ని కట్టించాలని అక్కడి అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. ‘ఒక్కో లబ్ధిదారుని విడివిడిగా కలవండి. పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తే అడ్డుపుల్లలు వేస్తారు. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే కట్టించవచ్చు. ఓటీఎస్ చెల్లింపులు ప్రాధాన్య అంశంగా తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడతారు. మొత్తం ప్రక్రియను సోమవారానికి పూర్తిచేయాలి’ అని ఆదేశించారు. అధికారుల ఒత్తిడితో భూపతిపల్లి, చింతకుంట, తిప్పాయపాలెం, గజ్జలకొండ, రాయవరం గ్రామాల్లోని కొంతమంది ఓటీఎస్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వీవోఏలు ఆదివారం వెళ్లారు. చేతిలో డబ్బుల్లేక పండుగ కూడా చేసుకునే పరిస్థితి లేదని, ఇప్పుడు వచ్చి అప్పు కట్టాలంటే ఎలా కడతామని లబ్ధిదారులు వీవోఏలకు తెగేసి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్ విచారణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?