గర్జించిన గురువులు
పీఆర్సీపై ప్రభుత్వ జీవోలను వ్యతిరేకిస్తూ... ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్దఎత్తున రోడ్డెక్కారు. పోలీసులు నోటీసులిచ్చినా, ప్రయాణ సమయంలో ఎక్కడికక్కడ దిగ్బంధించినా, ముళ్ల కంచెలు, బారికేడ్లతో నిలువరించినా... లెక్క చేయకుండా వేలాదిగా కదం తొక్కుతూ గురువారం ఉదయానికే కలెక్టరేట్లకు తరలివచ్చారు. జిల్లాల పాలనా కార్యాలయాలను స్తంభింపజేశారు. మాటతప్పిన, మడమ తిప్పిన సీఎం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రివర్స్ పీఆర్సీని రద్దు చేసే వరకు
ముళ్ల కంచెలను దాటి... నిర్బంధాలను ఛేదించి కలెక్టరేట్ల ముట్టడి
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
పీఆర్సీపై ఆందోళనలో 3.80 లక్షల మంది పాల్గొన్నారన్న ఫ్యాప్టో నేతలు
ఈనాడు, అమరావతి: పీఆర్సీపై ప్రభుత్వ జీవోలను వ్యతిరేకిస్తూ... ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్దఎత్తున రోడ్డెక్కారు. పోలీసులు నోటీసులిచ్చినా, ప్రయాణ సమయంలో ఎక్కడికక్కడ దిగ్బంధించినా, ముళ్ల కంచెలు, బారికేడ్లతో నిలువరించినా... లెక్క చేయకుండా వేలాదిగా కదం తొక్కుతూ గురువారం ఉదయానికే కలెక్టరేట్లకు తరలివచ్చారు. జిల్లాల పాలనా కార్యాలయాలను స్తంభింపజేశారు. మాటతప్పిన, మడమ తిప్పిన సీఎం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రివర్స్ పీఆర్సీని రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించారు. నిరసనల్లో మహిళా ఉపాధ్యాయులు ముందు భాగాన నిలిచి పాటలతో గళమెత్తారు. ఫ్యాప్టో (ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) పిలుపు మేరకు గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లను ఉపాధ్యాయులు ముట్టడించారు. బుధవారం రాత్రి నుంచే పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ సంఘ నేతల ఇళ్లకు వెళ్లి ఆందోళనల్లో పాల్గొనవద్దని నోటీసులిచ్చారు. రైళ్లు, బస్సుల్లో వస్తున్న వారిని తనిఖీ చేసి మధ్యలోనే దించేశారు. అయినా నిర్బంధాలను ఛేదించుకుంటూ భారీ ఎత్తున ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలెక్టరేట్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్లలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుల్ని పోలీసులు అడ్డుకోవడంతో.. తోపులాటలు జరిగాయి. మచిలీపట్నంలో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు లాగి వాహనాల్లో పడేయడంతో ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కడపలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిని పోలీసులు లాక్కెళ్లడంతో స్పృహతప్పి పడిపోయారు. చొక్కా చిరిగిపోయింది. చిత్తూరులో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ రమణ చేతికి గాయమైంది.
గుంటూరు కలెక్టరేట్ దిగ్బంధం
భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు గుంటూరు కలెక్టరేట్ను ముట్టడించి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దిగ్బంధించారు. పోలీసులు ముందే అడ్డుకుంటారనే ఆలోచనతో... ప్రణాళిక ప్రకారం రెవెన్యూ కల్యాణ మండపం, ఎన్జీవో కల్యాణ మండపం, జడ్పీ ప్రాంగణానికి విడివిడిగా చేరుకునేలా వ్యూహం రచించారు. ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్ జోసఫ్ సుధీర్బాబు, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మచిలీపట్నంలో అన్ని దారులు మూసేసినా...
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కలెక్టరేట్కు వచ్చే రహదారులన్నింటినీ బారికేడ్లతో మూసేసినా, ఉపాధ్యాయులు లక్ష్మీటాకీస్ సెంటరు వరకు దూసుకువచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. కొందరు ఉపాధ్యాయులు పోలీసుల నుంచి తప్పించుకుని కలెక్టరేట్ వైపు దూసుకుపోయే ప్రయత్నం చేశారు.
ఉపాధ్యాయ సంద్రంగా ఏలూరు
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులోని కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి ఎదురుగా ఉన్న రోడ్డుతోపాటు సమీపంలోని జడ్పీ కార్యాలయం రహదారి వరకు అన్ని ప్రాంతాలు ఉదయం 9గంటలకే కిక్కిరిశాయి. ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్ హరనాథ్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.గోపిమూర్తి, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణను గృహ నిర్బంధం చేశారు. జిల్లాలోని సగం మంది ఉపాధ్యాయులు గురువారం సెలవులో ఉన్నారు.
ఒంగోలులో కేసులు పెడతామని హెచ్చరికలు
ప్రకాశం జిల్లా ఒంగోలు చర్చిసెంటర్లో ఉపాధ్యాయులు మానవహారం, రాస్తారోకో నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు కొందరు ప్రయత్నించారు. మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు యూటీఎఫ్ నాయకులను కోర్టు సెంటర్లో పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలు సీజ్చేస్తామని, కేసులు పెడతామని హెచ్చరించినా ఎవ్వరూ ఖాతరు చేయలేదు.
కిటకిటలాడిన కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ వేలాది మంది ఉపాధ్యాయులతో కిటకిటలాడింది. ఓ ఉపాధ్యాయుల తల కిందికి కాళ్లు పైకి పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గీతాలు ఆలపిస్తూ.. నినాదాలు చేశారు. ఆందోళనను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు.
నెల్లూరులో డప్పులు కొడుతూ నినాదాలు
నెల్లూరులో ఉపాధ్యాయులను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ప్రభుత్వ తీరును నిరసిసూత డప్పులు కొడుతూ... పాటలు, నృత్యాలతో ప్రదర్శించారు. మధ్యాహ్నం వేళ బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నించారు.
చిత్తూరులో తోపులాట
చిత్తూరులో పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బారికేడ్లను తొలగించి కలెక్టరేట్ లోనికి వెళ్లేద]ుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు దండు అమరనాథ్ తమకు సహకరించాలని చిత్తూరు డీఎస్పీ సుధాకర్రెడ్డి కాళ్లపై పడ్డారు. బుధవారం రాత్రి నుంచే పీలేరు, మదనపల్లె, తిరుపతిలోని ప్రధాన సంఘాల నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాశారు.
కడపలో బారికేడ్లు, ముళ్లకంచెలు
కడపలో వేలాది మంది ఉపాధ్యాయుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుని వెళ్లే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, ఫ్యాప్టో జిల్లా కోఛైర్మన్, ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ కంభం బాలగంగిరెడ్డి గృహనిర్బంధం చేశారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల నుంచి వస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.
అనంతలో హోరెత్తిన నిరసన
అనంతపురం కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఉపాధ్యాయుల్ని పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఎన్జీవో సంఘం నాయకుడు మనోహర్రెడ్డి వేలికి గాయమైంది.
కిక్కిరిసిన కర్నూలు కలెక్టరేట్
ఉపాధ్యాయుల ఆందోళనతో కర్నూలు కలెక్టరేట్ ప్రాంతం కిక్కిరిసింది. కొందరు ప్రధాన ద్వారం ఎక్కి లోపలకు దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం 9గంటలకు 5వాహనాల్లో నంద్యాల నుంచి బయల్దేరిన ఉపాధ్యాయుల్ని పాణ్యం వద్ద పోలీసులు అడ్డగించారు. ఆగ్రహించిన ఉపాధ్యాయులు ఎన్హెచ్-44 జాతీయ రహదారిపై బైఠాయించారు.
విజయనగరంలో తోపులాట
విజయనగరంలో ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉపాధ్యాయుల్ని కలెక్టరేట్ లోపలకు పోలీసులు అనుమతించ లేదు. రెండు ద్వారాల నుంచి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పలువురు ఉపాధ్యాయులు కిందపడిపోయారు.
శ్రీకాకుళంలో బారికేడ్లను ఛేదించి...
శ్రీకాకుళం కలెక్టరేట్ ద్వారాలను పోలీసులు మూసేశారు. అక్కడికి చేరుకునే నాలుగు మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున చొచ్చుకుని రావడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. తర్వాత కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.
విశాఖలో పెనుగులాట
విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎద]ుట పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య పెనుగులాట జరిగి, కొందరు కిందపడ్డారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి విడనాడాలని ఆందోళనకు దిగారు.
తాడోపేడో తేల్చుకుంటాం
-జోసఫ్ సుధీర్బాబు, రాష్ట్ర ఛైర్మన్, ఫ్యాప్టో
ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ తెచ్చింది. తాడోపేడో తేల్చుకోవడానికి సమ్మెకు వెళతాం. రూ.30 వేల కోట్లు లోటు ఉందంటున్న ప్రభుత్వ ప్రధానకార్యదర్శి... ఉద్యోగసంఘాల నేతలను చర్చకు పిలిస్తే వాస్తవాలు చెబుతాం. ఐఆర్ 27%, ఇంటిఅద్దె గతంలో ఉన్నవిధంగానే కొనసాగించాలి. కేంద్ర పీఆర్సీని అమలు చేస్తామన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సీపీఎస్ను వెంటనే రద్దు చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ను ప్రకటించాలి. గురువారం నాటి ఆందోళనలో 3.80 లక్షల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి పట్టించుకోలేదు. -
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు. -
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. -
మోదీజీ.. మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా!
‘‘హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి. -
‘బందోబస్తు’ బహుపరాక్!
సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అనూహ్య వర్షాలతో అతలాకుతలం
వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి
ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
రాజమహేంద్రవరం విలవిల
అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. -
‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. -
పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
‘ఆ చీకటి చట్టం రాకముందే’ ఇన్ని అగచాట్లా?
‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
నడవాలు ‘నాశనం’!
‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు. -
అమరావతి అభివృద్ధితోనే ఏపీ పురోగతి
రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
‘అంబేడ్కర్’ను తొలగించి.. తన పేరు తగిలించి..!
గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు. -
విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి
రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు. -
జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే రూ.500 కోట్లు దొంగిలించింది
జగన్ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
పోలీసు వ్యవస్థపైనే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
దురుద్దేశంతో కేసు నమోదు
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తాజా వార్తలు (Latest News)
-
యూకే ఎయిర్ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!
-
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
-
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు