CM Jagan: సర్వేల్లో బాగుంటేనే టికెట్లు
‘వచ్చే రెండేళ్లూ పరీక్షా సమయం.. ఎవరి పనితీరు బాగా లేకపోయినా ఏ మాత్రం ఉపేక్షించబోను’ అని వైకాపా ఎమ్మెల్యేలకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ‘ఇంటింటికీ తిరగాలి. మీ పని తీరును కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం.
ఇంటింటికీ వెళ్లాలి.. లేకపోతే గెలవడం కష్టమే
వచ్చే రెండేళ్లూ అందరికీ పరీక్షా సమయం
వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: ‘వచ్చే రెండేళ్లూ పరీక్షా సమయం.. ఎవరి పనితీరు బాగా లేకపోయినా ఏ మాత్రం ఉపేక్షించబోను’ అని వైకాపా ఎమ్మెల్యేలకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ‘ఇంటింటికీ తిరగాలి. మీ పని తీరును కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం. పార్టీ మళ్లీ గెలవడమే అత్యంత ప్రధానం. జుట్టు ఉంటే ఎలాగైనా ముడివేసుకోవచ్చు. జుట్టే లేకపోతే ముడి ఎలా వేసుకునేది? పని తీరు బాగా లేదని సర్వేల్లో తేలిన వారికి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదు. అధికారంలోకొచ్చే మూడేళ్లయింది. ఇక వచ్చే రెండేళ్లలో మీ పనితీరును బట్టే పార్టీ మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తుందా.. లేదా అనేది ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో నిర్వహించిన వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలు రావడం కాదు.. మనమే వెళ్లాలి
‘‘ఇక నుంచి పార్టీపరంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలి. నా అనుభవంతో చెబుతున్నా, గడప-గడపకూ కార్యక్రమం కంటే గొప్పది మరోటి ఉండదు. ఎమ్మెల్యేగా గెలవాలంటే మూడుసార్లయినా గడప-గడపకూ వెళ్లాలి. లేకపోతే ఎంత మంచి ఎమ్మెల్యే అయినా గెలవడం ప్రశ్నార్థకమే. ప్రజలు మన ఇళ్లకు వచ్చి మనల్ని కలవడం కాదు.. మనమే గ్రామాల్లోకి వెళ్లాలి. ఉగాది నుంచి నెల రోజులపాటు వాలంటీర్ల సన్మాన కార్యక్రమం చేపడుతున్నాం. ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికీ వెళ్లి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రతి ఇంటికీ వెళ్లి ఆ ఇంట్లో వారికి ప్రభుత్వం నుంచి ఏమేం మేలు అందిందనే వివరాలతో నేను రాసిన లేఖను స్వయంగా ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి. అదే సమయంలో పార్టీ సంస్థాగతంగా బూత్, గ్రామ కమిటీలను వేయాలి.
ఏప్రిల్ 10లోగా బిల్లుల చెల్లింపు
ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లేలోపు పెండింగు బకాయిలను చెల్లిస్తాం. గ్రామ స్థాయిల్లో ఉపాధి హామీ పథకం సహా అన్ని పనుల బిల్లులనూ ఏప్రిల్ 10లోగా చెల్లిస్తాం. పట్టణాలు, నగరాల్లోని పనుల బిల్లులనూ చెల్లిస్తాం. మీరు వెళ్లినప్పుడు ఆ బిల్లుల గురించి అడిగే పరిస్థితి రాదు.
మే నెలలో గడప-గడపకూ..
మే నెలలో గడప-గడపకూ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఆలోగా బూత్, గ్రామ కమిటీల నుంచి మండల, జిల్లాస్థాయి కమిటీల వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాలి. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు మూడు-నాలుగు జిల్లాలకు ఒక ప్రాంతీయ బాధ్యుడిని నియమిస్తాం. ఎమ్మెల్యేల పనితీరునూ వారు పరిశీలిస్తారు. మే నుంచి నెలలో 10కి తగ్గకుండా సచివాలయాలను సందర్శించాలి. జులై 8న పార్టీ ప్లీనరీ నిర్వహిస్తాం’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
వెనక కూర్చోవడం అలవాటు చేసుకుంటున్నాం
సమావేశ హాలులోకి ముఖ్యమంత్రి ప్రవేశించే సమయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చుని ఉన్నారు. మంత్రులు వెలంపల్లి, పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, సురేష్, అనిల్, బుగ్గన తదితరులు వెనుక వరుసల్లో కూర్చోవడం చూసి ‘ఏం.. మంత్రులు వెనుక కూర్చున్నారు’ అని సీఎం అడగ్గా.. ‘వెనక కూర్చోవడం అలవాటు చేసుకుంటున్నాం’ అని ఒక మంత్రి సమాధానమిచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొన్నారు.
త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత మారుస్తామని మొదటి శాసనసభాపక్ష సమావేశంలోనే చెప్పాం. అతి త్వరలోనే ఇది చేయబోతున్నాం. ఒకటి రెండు చోట్ల మినహాయింపులు ఉంటాయిగానీ, మిగతా వారంతా మారతారు. మంత్రులను పక్కన పెడుతున్నామని అర్థం కాదు. వారిని జిల్లా పార్టీ అధ్యక్షులుగా, ప్రాంతీయ సమన్వయ కర్తలుగా తగిన బాధ్యతలు అప్పగిస్తాం. రాష్ట్రంలో 26 జిల్లాలు కాబోతున్నాయి.. వీటిలో 3-4 జిల్లాలకు ఒకరి చొప్పున 8 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను నియమిస్తాం.
- సీఎం జగన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!