అర్ధరాత్రి గోడదూకి.. గడియ పగలగొట్టి
పల్నాడు జిల్లాలో సీఐడీ పోలీసుల చర్యలు గురువారం కలకలం రేపాయి. ఇద్దరు తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు అర్ధరాత్రి గోడలుదూకి
తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు సీఐడీ సిబ్బంది చర్యలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ విచారణ
ఈనాడు-అమరావతి, అమరావతి గ్రామీణం-న్యూస్టుడే: పల్నాడు జిల్లాలో సీఐడీ పోలీసుల చర్యలు గురువారం కలకలం రేపాయి. ఇద్దరు తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు అర్ధరాత్రి గోడలుదూకి రావడం, గడ్డపారలతో తలుపులు పగలకొట్టడం, నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్లడంతో ఆయా కుటుంబాల వారు ఆందోళన చెందారు. నిరసన తెలిపిన తెదేపా నాయకులపైనా కేసులు నమోదు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారాన్ని సృష్టస్తోంది. తెదేపా కార్యకర్తలు గార్లపాటి వెంకటేష్, సాంబశివరావులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గురువారం రాత్రి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వెంకటేష్ న్యూస్-25 పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల వేళ ఐదుగురు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి సీఐడీ పోలీసులమని, వెంకటేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వ్యాప్తి చేస్తున్నందున అరెస్టు చేయడానికి వచ్చామంటూ తమ ఇంట్లోకి ప్రవేశించారని అతని తల్లిదండ్రులు బ్రహ్మయ్య, వెంకాయమ్మ వాపోయారు. ‘నోటీసు ఇవ్వాలని కోరగా, ఇవ్వలేదు. తలుపు గడియ, తాళాలు గడ్డపలుగుతో పగలగొట్టారు. ఇంట్లోకి చొరబడి, మా అబ్బాయిని లాక్కెళ్లారు. కంప్యూటర్ హార్డు డిస్క్లు, సెల్ఫోన్లు పట్టుకెళ్లారు. మా కుమారుడిని విడిచిపెట్టాలని ప్రాధేయపడితే మమ్మల్ని పక్కకు నెట్టివేశారు. ఏం పోస్టులు పెట్టారు? ఎందుకింత అర్ధరాత్రి పట్టుకెళ్తున్నారు అని అడిగితే సమాధానమివ్వలేదు. ఇదేనా అరెస్టు చేసే విధానం?’ అని వారు ప్రశ్నించారు. వెంకటేష్కు ఏదైనా జరిగితే తాము ఉరివేసుకొని ఆత్మహత్య చేసకుంటామని, ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. స్థానిక పోలీసుల సహకారంతో తొలుత వెంకటేష్ను అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు తర్వాత మంగళగిరిలో ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా సోషల్ మీడియా కార్యకర్త మోకరాల సాంబశివరావును అదుపులోకి తీసుకున్నారు. వీరిని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించి, ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ వేర్వేరుగా విచారిస్తూనే ఉన్నారు. సీఐడీ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక సైబర్ నేరాల బృందం, గుంటూరు సీఐడీ పోలీసులు కలిసి వెంకటేష్పై ప్రశ్నలు సంధించారు. అనంతరం వెంకటేష్ను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. సాంబశివరావును సెక్షన్ 41 కింద నోటీసులిచ్చి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. అయితే, విచారణలో పోలీసులు తనను కొట్టారని వెంకటేష్ కోర్టు వద్దకు వచ్చిన తెదేపా నేతలకు చూపించారు.
ఆందోళన చేసిన నేతల అరెస్టు
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి ఇద్దరిని అదుపులోకి తీసుకోవటాన్ని నిరసిస్తూ తెదేపా నేతలు గుంటూరులోని సీఐడీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సోషల్ మీడియాలో పోస్టింగ్లపై అరెస్టు చేయరాదని గతంలో కోర్టు ఆదేశించినా వెంకటేష్ను దౌర్జన్యంగా పట్టుకెళ్లారంటూ తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వం పోలీసులతో ప్రశ్నించేవారి గొంతు నొక్కుతోందని విమర్శించారు. ఇద్దరు కార్యకర్తలను చూపించాలంటూ సీఐడీ కార్యాలయం వెలుపల రహదారిపై కనపర్తి శ్రీనివాసరావుతో పాటు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, యల్లావుల అశోక్యాదవ్, రాయపాటి అమృతరావు, వేల్చూరి కిరణ్ బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి నగరంపాలెం స్టేషన్కు తరలించారు. బాధితుల కుటుంబీకులు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు.
పోలీసులా? దోపిడీ దొంగలా?: చంద్రబాబు
ఈనాడు, అమరావతి: ‘అర్ధరాత్రి గోడలు దూకి ఇళ్లల్లోకి వెళ్లడం, గునపాలతో గొళ్లెం పగలగొట్టి చొరబడటం, ఇంట్లోని మనుషుల్ని ఎత్తుకెళ్లడం వంటి దోపిడీ దొంగల సంస్కృతిలోకి పోలీసులు వెళ్లడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. తెదేపా కార్యకర్త, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు గార్లపాటి వెంకటేష్, సామాజిక మాధ్యమ కార్యకర్త సాంబశివరావును సీఐడీ పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు