Andhra news: కౌన్సెలింగ్ పేరిట లాకప్లో విద్యార్థులు!
విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అవసరమైతే తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలో హెచ్చరించాలి.
తరగతి గదిలో ఫ్యాన్ రెక్కలు వంచారని ఉపాధ్యాయుల నిర్వాకం
అత్యుత్సాహం చూపిన పోలీసులు
ఏలూరు జిల్లాలో ఘటన
జంగారెడ్డిగూడెం, జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్టుడే: విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అవసరమైతే తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలో హెచ్చరించాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇవేవీ పట్టించుకోకుండా.. పిల్లలను ఏకంగా పోలీసు స్టేషన్లో పెట్టించారు. అక్కడ పోలీసులూ అత్యుత్సాహం చూపి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుల వివరాల మేరకు... తొమ్మిదో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు గురువారం తరగతి గదిలోని ఫ్యాను రెక్కలు, ట్యూబ్లైట్లు పాడుచేశారని ఉపాధ్యాయులు విజయ్ ప్రకాశ్, సుధాకరరెడ్డి వారిని కొట్టారు. కౌన్సెలింగ్ ఇప్పించాలని పోలీసు స్టేషన్లో అప్పగించారు. అక్కడ పోలీసులు విద్యార్థులను భయపెట్టేందుకు ఇతర నిందితులతో కలిపి కొన్ని గంటలపాటు లాకప్లో ఉంచారు. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ వారిని కొట్టారు. స్టేషన్ ఆవరణలో కూర్చోమనడంతో సాయంత్రం వరకు అక్కడే ఉన్నా భోజనం ఇవ్వలేదు. తల్లిదండ్రులకూ చెప్పలేదు. బాధిత విద్యార్థుల్లో ఒకరి సోదరుడు తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే వెళ్లగా.. స్టేషన్ మెట్లపై పిల్లలు ఏడుస్తూ కనిపించారు. పోలీసులు కొట్టారని ఓ విద్యార్థి దెబ్బలూ చూపారు. ఎస్ఐ వద్దకు వెళ్తే ‘సంతకాలు పెట్టి తీసుకెళ్లి, మళ్లీ రేపు రావాలి’ అంటూ ఆదేశించారు. శుక్రవారం ఉదయం పిల్లలను స్టేషన్కు తీసుకెళ్లగా.. ఉపాధ్యాయుల ఫిర్యాదుతోనే స్టేషన్లో పెట్టామని పోలీసులు వెల్లడించారు. లాకప్లో వేయాల్సినంత నేరం పిల్లలేం చేశారని.. తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడు జగ్గారావు, ఎంఈవో రాముడు, ఉపాధ్యాయులను నిలదీశారు. ఓ పిల్లాడి దెబ్బలకు ఆసుపత్రిలో వైద్యం చేయించాల్సి వచ్చిందన్నారు. స్టేషన్కు తీసుకెళ్లడం తప్పేనని ఉపాధ్యాయులు రాత పూర్వకంగా ఒప్పుకొన్నట్లు బాధిత విద్యార్థుల బంధువొకరు పేర్కొన్నారు.
బాత్రూమ్ కడగమన్నారు...
ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం తహసీల్దారు స్లీవ జోజి శుక్రవారం బాధిత విద్యార్థులను విచారించారు. ‘ఉపాధ్యాయులు మమ్మల్ని కొట్టి స్టేషన్కు తీసుకెళ్లారు. లాకప్లో వేసి కొట్టారు. బాత్రూమ్ కడగాలన్నారు. నీళ్లు రాకపోవడంతో కడిగించలేదు’ అని విద్యార్థులు తెలిపారు. పాడైపోయిన ఫ్యాన్ రెక్కలను సరిచేశామని వివరించారు. ‘దీనిపై నాకు ఎటువంటి సమాచారం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేశా. కౌన్సెలింగ్ పాఠశాలలోనే చేస్తే బాగుండేది’ అని ఎంఈవో రాముడు తెలిపారు.
డీఎస్పీ సమక్షంలో మాట మార్చిన విద్యార్థులు..
ఈ ఘటనపై శుక్రవారం రాత్రి డీఎస్పీ కేవీ సత్యనారాయణ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులను లాకప్లో పెట్టి, పోలీసులు కొట్టారనడం అవాస్తవం అన్నారు. ‘ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ నిమిత్తం వారిని స్టేషన్కు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఎస్ఐ, సీఐ అందుబాటులో లేరు. కొద్దిసేపు స్టేషన్ ఆవరణలో విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపాం’ అని వివరించారు. ఇదే సమావేశంలో విద్యార్థులతో మాట్లాడించారు. ‘తమను పోలీసులు కొట్టలేదు. ఉపాధ్యాయులు తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే భయంతో అలా చెప్పాం’ అని మాట మార్చారు. మరి దెబ్బలు ఎలా తగిలాయని విలేకర్లు అడగ్గా.. విద్యార్థుల నుంచి సమాధానం రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.