Covid Tests: శంషాబాద్‌ విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు

భారత్‌తోపాటు విదేశాల్లో ప్రస్తుతం కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు శంషాబాద్‌ విమానాశ్రయంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించారు.

Updated : 01 Apr 2023 07:22 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: భారత్‌తోపాటు విదేశాల్లో ప్రస్తుతం కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు శంషాబాద్‌ విమానాశ్రయంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల ద్వారా శంషాబాద్‌కు వస్తున్న ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం థర్మల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి వంద మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో అనుమానం ఉన్న ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్న ప్రయాణికులకు ప్రస్తుతం కొవిడ్‌ పరీక్షలు, ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. అయితే, కరోనా లక్షణాలున్న ప్రయాణికులు మాత్రం విధిగా మాస్క్‌ ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని