Margadarsi: మార్గదర్శి మేనేజర్లపై కఠిన చర్యలొద్దు
మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్పై నమోదు చేసిన కేసుల దర్యాప్తులో భాగంగా నోటీసులు జారీచేసిన మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకోరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం
దర్యాప్తు కక్షసాధింపు ధోరణితో సాగుతోంది
సహకరిస్తున్నా అరెస్టు చేస్తున్నారు
దర్యాప్తు సమాచారం మీడియాకు లీక్
దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయండి
మార్గదర్శి ఛైర్మన్, ఎండీల మధ్యంతర పిటిషన్లు
ఈనాడు, హైదరాబాద్: మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్పై నమోదు చేసిన కేసుల దర్యాప్తులో భాగంగా నోటీసులు జారీచేసిన మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకోరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కౌంటర్లు దాఖలుచేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. మార్గదర్శిపై నమోదు చేసిన కేసుల దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ వెలుపల స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని కోరుతూ మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, ఎండీ సీహెచ్.శైలజ మంగళవారం ఉదయం అత్యవసరంగా మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, న్యాయవాది విమల్ వాసిరెడ్డి వాదనలు వినిపిస్తూ ‘‘ఈ కేసులో దర్యాప్తు కక్షసాధింపు చర్యతో కొనసాగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి పిటిషనర్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. చిట్ఫండ్ సంస్థను మూసేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. దర్యాప్తు సమాచారాన్ని వారి అనుకూల మీడియాకు లీక్ చేస్తున్నారు. సోమవారం విచారణకు వెళ్లిన దర్యాప్తు అధికారులు ఛైర్మన్ ఫొటోను తీసి సాక్షి మీడియాకు పంపారు. 6న ఎండీ విచారణ ఉందంటూ ఫొటోతో పత్రికల్లో వేస్తున్నారు. విచారణలో వేసిన ప్రశ్నలు, చెప్పిన సమాధానాలు పత్రికలో వస్తున్నాయి. సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీయాలన్న లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు వివరాలను అధికారులు విడుదల చేస్తున్నారు. ఓ వైపు విచారణకు సహకరిస్తున్నా 30 మంది మేనేజర్లకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు పేరుతో పిలిచి అరెస్టు చేస్తారని ఆందోళన ఉంది. దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలి. సమాచారం అందించడానికి వెళ్లిన ఆడిటర్ శ్రావణ్ను నిర్బంధించి, అనంతరం అరెస్టు చేశారు. ఆయన గొంతు, మెడపై గాయాలున్నాయి. శ్రావణ్ రిమాండ్ రిపోర్టులో బాత్రూంకు వెళ్లి తానే గాజుతో గాయపరచుకున్నారని, కింద పడిన ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. పొద్దుపోయాక ఇంటికి వెళ్లాలని చెప్పినా శ్రావణ్ వెళ్లలేదంటూ చెబుతున్నారు. కానీ ఎవరూ పోలీసుస్టేషన్లో ఉండాలని కోరుకోరు’’ అని తెలిపారు. తమ తరఫు వాదనలు వినిపించడానికి ఏజీ వస్తారని, వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది పి.గోవిందరెడ్డి కోరారు. చట్ట నిబంధనలకు అనుగుణంగానే దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఛైర్మన్, ఎండీలకు ఉన్న రక్షణను వారి ఉద్యోగులకు ఎందుకు కల్పించకూడదని ప్రశ్నించారు. దర్యాప్తును నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇవ్వట్లేదని, కేవలం కఠిన చర్యలు తీసుకోరాదనే ఇస్తున్నామని చెప్పారు. 30 మందిని అరెస్టు చేయబోతున్నారా అని ప్రశ్నించగా తన వద్ద సమాచారం లేదని ఏపీ న్యాయవాది తెలిపారు. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఉత్తర్వులు జారీచేసే పరిధి హైకోర్టులకు లేదని, సుప్రీంకోర్టుకే ఉందని తెలిపారు. ఇదో పెద్ద కుంభకోణం అని, దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో ఏమీ తేలకపోతే అదే విషయాన్ని తుది నివేదికలో పేర్కొంటామని జీపీ పేర్కొన్నారు.
కుంభకోణం కాదు... అప్రతిష్ఠపాలు చేయడమే
ఈ దశలో పిటిషనర్ల తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ ‘‘మార్గదర్శి వ్యవహారంలో కుంభకోణం ఏమీ లేదు. అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా దర్యాప్తు సాగుతోంది. ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దర్యాప్తును బదిలీ చేయడానికి బలమైన కారణం ఉందని హైకోర్టు గత ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దర్యాప్తునకు సహకరిస్తామంటున్నా బెదిరిస్తున్నారు. విచారణకు వచ్చిన ఆడిటర్ను అరెస్టు చేశారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా బ్రాంచ్ మేనేజర్లను వేధిస్తూ, అరెస్టు చేస్తున్నారు. అడిగిన సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా బ్రాంచ్ మేనేజర్లపై కఠినచర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలి’’ అని కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఏపీలోని బ్రాంచ్ మేనేజర్లకు సంబంధించి ఉత్తర్వులిచ్చే పరిధి ఈ కోర్టుకు ఏమిటని ప్రశ్నించగా పిటిషనర్ తరఫు న్యాయవాది సమాధానమిస్తూ అన్ని బ్రాంచ్ల నుంచి నగదు ఇక్కడికి బదిలీ అవుతోందన్నదే ప్రధాన ఆరోపణ అని.. ఛైర్మన్, ఎండీల నివాసం కూడా ఇక్కడేనని తెలిపారు. ఛైర్మన్, ఎండీలకు రక్షణ కల్పిస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చినా, ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నారు. బ్రాంచ్ మేనేజర్లందరికీ నోటీసులు జారీచేశారని, అందుకే కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి... నోటీసులు అందుకున్న బ్రాంచ్ మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ తమకు వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా ఉత్తర్వులు ఇవ్వరాదనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ జారీచేసిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చని, బుధవారం ఇంటివద్ద అయినా దాన్ని విచారించడానికి సిద్ధంగా ఉన్నానంటూ తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత