Sajjala: అవినాష్ ఎన్నాళ్లు తప్పించుకు తిరగ్గలరు?: సజ్జల రామకృష్ణారెడ్డి
‘అరెస్టు నుంచి తప్పించుకునేందుకే అవినాష్ తన తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపించారంటూ ప్రచారం చేస్తున్నారు... సీబీఐ పట్టుదలగా ఉంటే ఇలాంటి కారణాలతో ఆయన ఎన్నాళ్లు తప్పించుకు తిరగ్గలరు?’ అని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
సునీత తెదేపాతో కలిసి కుట్రల్లో భాగస్వామి కావడం దురదృష్టకరం
అవినాష్ వెనుక వెళ్లిన మీడియాపై దాడిని ఖండిస్తున్నాం
ఈనాడు, అమరావతి: ‘అరెస్టు నుంచి తప్పించుకునేందుకే అవినాష్ తన తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపించారంటూ ప్రచారం చేస్తున్నారు... సీబీఐ పట్టుదలగా ఉంటే ఇలాంటి కారణాలతో ఆయన ఎన్నాళ్లు తప్పించుకు తిరగ్గలరు?’ అని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘అవినాష్రెడ్డిని సీబీఐ అరెస్టు చేయాలనుకుంటే పిలిపించుకుని కూర్చోబెట్టే చేయాలా? అన్యాయంగా అరెస్టు చేస్తే మాత్రం, అలా ఎలా చేస్తారని మేం అడుగుతాం’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. బెయిల్ వచ్చేవరకూ సీబీఐ ముందుకు వెళ్లకుండా ఉండేందుకే అవినాష్ తన తల్లి ఆరోగ్యం గురించి చెబుతున్నారా అని విలేకరులు అడగ్గా.. సజ్జల స్పందిస్తూ.. ‘అలాంటి ఉద్దేశంతో తల్లికి అనారోగ్యమని క్రియేట్ చేసేంత చండాలమైన పరిస్థితిలో ఎంపీ లేరు. పైరవీలు చేసుకుని, లేనివి ఏవో సృష్టించుకుని తప్పించుకోవాలనే మనస్తత్వం ఉన్న కుటుంబాలు కావు వారివి. అవినాష్ కూడా అలాంటి వ్యక్తి కాదు. సీబీఐ ముందుకు వెళ్లేందుకే శుక్రవారం హైదరాబాద్ వెళ్లారు. అనుకోకుండా వాళ్ల అమ్మకు సీరియస్గా ఉందని తెలిసి.. తిరిగి వెళ్లిపోయారు. ఇప్పటికి 5 సార్లు సీబీఐ ముందుకు అవినాష్ వెళ్లారు. మళ్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కాకపోతే రేపైనా వెళతారు. వాళ్లేమైనా తీవ్ర చర్యలకు దిగితే దాన్ని ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉన్నారు. సీబీఐ తన అఫిడవిట్లలో అవినాష్ నిందితుడని విపరీత ఆరోపణలు చేస్తోంది. అందువల్లే సహేతుక కారణాలతోనే అవినాష్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు’ అని పేర్కొన్నారు.
నరికానంటున్నోడు బయట సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు: ‘నేను వివేకాను నరికాను అంటున్న వ్యక్తి బయట తిరుగుతూ ప్రెస్మీట్లు పెడుతున్నాడు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఆటో నడుపుకొనే అతను కార్లలో తిరుగుతున్నాడు, అప్రూవర్గా మారాడంటూ అతనికి ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు. మరోవైపు బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి, పైగా విచారణకు పూర్తిగా సహకరిస్తున్న అవినాష్ను మాత్రం వేధిస్తున్నారు. వివేకా హత్యకేసులో అవినాష్ పాత్ర ఉంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వదిలిపెట్టేవారా? సంబంధం లేనివాటిని తీసుకువచ్చి అభూత కల్పనలతో తెదేపా లాంటి శక్తులు ప్రచారం చేస్తున్నాయి. వైఎస్ కుటుంబసభ్యురాలైన సునీత వారితోనే కలిసి ఈ మంత్రాంగం నడపడం, కుట్రల్లో భాగస్వామి కావడం మా దురదృష్టం’ అన్నారు. మీడియాపై దాడికి మద్దతిస్తారా అని విలేకరులు అడగ్గా సజ్జల సమాధానమిస్తూ.. ‘ఎలా మద్దతిస్తాం? అది అత్యంత దురదృష్టకరం. అది అవినాష్కు తెలిసి ఉంటుందని అనుకోను. పూర్తిగా ఖండిస్తున్నాం. కానీ, పదేళ్ల నుంచి కనిపించకుండా పోయి ఇప్పుడు హఠాత్తుగా బయటకు వచ్చాడన్నట్లుగా అవినాష్ వెనుక మీడియా వెళ్లి హడావుడి చేయడమెందుకు? నాయకుడు అన్నాక అభిమానులు ఉంటారు, వారంతా సంయమనంతో ఉండలేరు కదా? అలాంటి పరిస్థితిని తీసుకురావడం సరికాదు కదా’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
-
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
మా కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలుజేయాలని చూస్తున్నారు: పవన్పై మండిపడ్డ ముద్రగడ
-
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
-
రహదారిపై గుంతలు మాయం!
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్