Peddireddy: మాట తప్పిన మంత్రి పెద్దిరెడ్డి.. 13 ఏళ్లుగా రైతుల అవస్థలు
అదో సామ్రాజ్యం.. అక్కడంతా ‘పెద్దాయన’దే రాజ్యం. ప్రభుత్వం పరిహారం చెల్లించకుండానే నిర్వాసిత రైతుల భూముల్లో ఆ పెద్దాయన కుటుంబీకులకు చెందిన నిర్మాణ సంస్థ ప్రాజెక్టు కట్టేస్తుంది.
నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండానే చల్లంపల్లె ప్రాజెక్టు నిర్మాణం
పెద్దాయన రాజ్యంలో సామాన్యులే సమిధలు
ప్రాజెక్టు గుత్తేదారు ఆయన కుటుంబ సంస్థే
ఈనాడు డిజిటల్, చిత్తూరు - ఈనాడు, అమరావతి: అదో సామ్రాజ్యం.. అక్కడంతా ‘పెద్దాయన’దే రాజ్యం. ప్రభుత్వం పరిహారం చెల్లించకుండానే నిర్వాసిత రైతుల భూముల్లో ఆ పెద్దాయన కుటుంబీకులకు చెందిన నిర్మాణ సంస్థ ప్రాజెక్టు కట్టేస్తుంది. ప్రభుత్వం నుంచి బిల్లులూ తీసేసుకుంటుంది. సంవత్సరాలు గడిచిపోతుంటాయి. భూములిచ్చిన రైతులకు మాత్రం ఒక్క రూపాయీ పరిహారం అందదు. అయినా జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డునపడ్డ వారు తమ బతుకెలా అని అడగకూడదు. ‘గిల్లితే గిల్లించుకోవాలి.. అరవకూడదు’ అని పోకిరి సినిమాలో ప్రకాశ్రాజ్ అన్నట్టుగా.. ఈ పెద్దాయన సామ్రాజ్యంలో ‘మీ భూములు ఇచ్చేయండి.. పరిహారం తర్వాత ఇప్పిస్తా అంటే ఇచ్చేయాలి. అంతే తప్ప పరిహారం ఎంతిస్తారు? ఎప్పుడిస్తారు? అని ప్రశ్నించకూడదు. పరిహారం చెల్లించాకే పనులు మొదలుపెట్టండి అని అభ్యంతర పెట్టకూడదు. ఎదురు తిరిగి మాట్లాడితే.. తర్వాత ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు. అందుకే వారెవరూ కిక్కురుమనరు. ఆ సామ్రాజ్యం చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం. ఆ ‘పెద్దాయన’ వైకాపా ప్రభుత్వంలో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి!
పరిహారం ఇప్పిస్తామని మాటిచ్చి..
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల, ఎర్రావారిపాలెం మండలాల సరిహద్దులో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో 2009 కంటే ముందు చల్లంపల్లె ప్రాజెక్టు మంజూరైంది. అప్పట్లో పీలేరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆ ప్రాంతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే ఎమ్మెల్యే. ఆయన కుటుంబీకులకు చెందిన పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్సే ఆ ప్రాజెక్టు పనులు దక్కించుకుంది. ఆ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 60 మంది రైతుల నుంచి 100 ఎకరాల భూమి సేకరించింది. కానీ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. పరిహారం ఇవ్వకుండా పనులెలా మొదలుపెడతారని అడ్డుకోగా.. ‘ముందు పనులు పూర్తి చేయనివ్వండి. పరిహారం ఇప్పించే బాధ్యత నాది’ అని అప్పట్లో పెద్దిరెడ్డి హామీ ఇచ్చినట్లు రైతులు చెబుతున్నారు. తర్వాత పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టు కట్టేసింది. వాటికి బిల్లులూ తీసేసుకుంది. అది జరిగి పదమూడేళ్లవుతున్నా రైతులకు నేటికీ పైసా పరిహారం అందలేదు. వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు అవతలి వైపునా పొలాలున్నాయి. అక్కడికి వెళ్లి సాగు చేసే దారి, వీలులేక రైతులు వాటిని బీడుగా వదిలేశారు. అటు వైపు వెళ్లేందుకు ఒక కల్వర్టయినా నిర్మించాలని కోరుతున్నా పట్టించుకునేవారే లేరు. 2011లో పరిహారం కోసం రూ. 3.36 కోట్లు మంజూరయ్యాయని, అవి ఏమయ్యాయో తెలియడం లేదని కొందరు రైతులు వాపోతున్నారు.
ఆయన ఒక్క ఫోన్ చేస్తే చాలు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2009 నుంచి కొన్నాళ్లు వైఎస్, రోశయ్య మంత్రివర్గాల్లో పనిచేశారు. అయినా చల్లంపల్లె నిర్వాసితులకు పరిహారం ఇప్పిస్తానన్న హామీని నెరవేర్చలేదు. 2019లో వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో పెద్దిరెడ్డే నంబరు-2. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారని పేరు. ఆయన తలచుకుంటే ఒక్క ఫోన్కాల్తో చల్లంపల్లె నిర్వాసితులకు పరిహారం మంజూరు చేయించొచ్చు. వారికి చెల్లించాల్సిన మొత్తం కూడా వడ్డీతో కలిపినా రూ.8 కోట్లలోపే ఉంటుందని అంచనా. అయినా నిర్వాసితులకు న్యాయం చేయట్లేదు.
మా పిల్లలు చెప్పుల దుకాణాల్లో పనిచేస్తున్నారు
- నాగేశ్వరనాయుడు, నిర్వాసిత రైతు
చల్లంపల్లె ప్రాజెక్టు నిర్మాణంలో 2.13 ఎకరాల భూమి కోల్పోయా. పెద్దిరెడ్డి మా ఎమ్మెల్యేనే కదా.. డబ్బులు ఇప్పించేస్తారని నమ్మి భూములిచ్చేశాం. ఇప్పటికీ పరిహారం రాలేదు. జీవనాధారం పోయింది. పిల్లల్ని చదివించుకోలేకపోయాను. వారిప్పుడు చెప్పుల దుకాణాల్లో పనిచేసుకుని బతుకుతున్నారు.
జీవితం తలకిందులైపోయింది
- వెంకటరమణ నాయుడు, నిర్వాసిత రైతు
నా భూమిలోనే చల్లంపల్లె ప్రాజెక్టుకు పునాది వేశారు. నా 13 ఎకరాల భూమి, 300 మామిడి చెట్లు, 10 కొబ్బరి చెట్లు ప్రాజెక్టులో మునిగిపోయాయి. పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టు పనులు చేపట్టొద్దని అప్పుడే మేం గట్టిగా చెప్పుంటే మా జీవితం ఇలా తలకిందులైపోయేది కాదు. ఇప్పటికైనా పరిహారం ఇప్పించాలి.
అంతా వలసెళ్లిపోయారు..
- నాగయ్య నాయుడు, నిర్వాసిత రైతు, గానుగచింత
మా భూముల్లో ప్రాజెక్టు కట్టొద్దన్నాం. పరిహారం ఇప్పిస్తానని, భయపడొద్దని అప్పటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. ఇప్పటికీ ఒక్క రూపాయి అందలేదు. భూములు కోల్పోయిన వారంతా బతుకుదెరువు కోసం వలస పోయారు. ఏ దిక్కూలేనివాళ్లమే ఇక్కడ బతుకుతున్నాం.
పరిహారం అందాల్సిన రైతులు కొందరే
- విజయకుమార్రెడ్డి, జలవనరుల శాఖ, ఎస్ఈ
చల్లంపల్లె ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కొందరు రైతులకు మాత్రమే పరిహారం అందాల్సి ఉంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వచ్చిన వెంటనే అందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!