Viveka Murder Case: కొత్త థియరీలతో అవినాష్ మైండ్గేమ్
మాజీ మంత్రి వివేకా హత్య గురించి ఏపీ ముఖ్యమంత్రికి ముందే తెలుసని సీబీఐ వెల్లడించిందని, అది ఎలా అన్నది కూడా సీబీఐ చెప్పాల్సి ఉందని సునీత తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలిపారు.
అనుచరులతో అరెస్టును అడ్డుకున్నారు
జగన్కు సమాచారంపై సీబీఐ తేల్చాలి
సునీత తరఫు న్యాయవాది వాదన
మూడేళ్లుగా లేని హడావుడి ఇప్పుడెందుకన్న అవినాష్ తరఫు న్యాయవాది
అవినాష్ ముందస్తు బెయిలుపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు
విచారణ నేటికి వాయిదా
ఈనాడు, హైదరాబాద్: మాజీ మంత్రి వివేకా హత్య గురించి ఏపీ ముఖ్యమంత్రికి ముందే తెలుసని సీబీఐ వెల్లడించిందని, అది ఎలా అన్నది కూడా సీబీఐ చెప్పాల్సి ఉందని సునీత తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి దర్యాప్తునకు సహకరించకుండా కొత్త థియరీలతో మైండ్గేమ్ ఆడుతున్నారని వెల్లడించారు. ఆయనేమీ నోరులేని వాడు కాదని శక్తిమంతమైన రాజకీయ నేత అని, ఇదే విషయాన్ని రెండు రోజులుగా కర్నూలులో జరిగిన ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. అవినాష్రెడ్డి అరెస్ట్ను అడ్డుకోడానికి ఆయన అనుచరులు కార్పెట్లతో రోడ్డుకు అడ్డంగా కూర్చుని నిరసన వ్యక్తం చేయడాన్నిబట్టి తెలుసుకోవచ్చన్నారు. రోగులు వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా ఇబ్బందులకు గురి చేశారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్పై శుక్రవారం జస్టిస్ ఎం.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.శుక్రవారం ఉదయం 10.50గంటలకు ప్రారంభమైన వాదనలు సాయంత్రం 6గంటల వరకూ సాగాయి. సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ వివేకా హత్యకు సంబంధించి ఇప్పుడు కొత్త థియరీలు చెబుతున్నారన్నారు.
వివేకా హత్యకు వజ్రాల వ్యాపారం, కక్షలు, శృంగారం లాంటి కారణాలున్నాయన్న థియరీలు చెబుతున్నారన్నారు. నోటీసులు ఇస్తే పలు కారణాలు చెబుతూ విచారణకు సహకరించకుండా ఇప్పుడు ఇంత కాలం ఎందుకు అరెస్టు చేయలేదని ఎదురు ప్రశ్నిస్తున్నారన్నారు. ఎప్పుడు అరెస్టు చేయాలన్నది దర్యాప్తు సంస్థ విచక్షణాధికారం పై ఆధారపడి ఉంటుందన్నారు. గతంలో అవినాష్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై రికార్డులను పరిశీలించిన హైకోర్టు కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిందని తెలిపారు. వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు అవినాష్రెడ్డి ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారని వివరించారు. అవినాష్రెడ్డి, శంకర్రెడ్డి, మనోహర్రెడ్డి తదితరులు సంఘటనా స్థలంలో ఉన్నారని సాక్షులు వెల్లడించారన్నారు. అనుమానాలను అనుసంధానిస్తూ సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోందన్నారు. వివేకా హత్య గురించి 2019 మార్చి 15న తెల్లవారు జామున 1.53 గంటలకే అవినాష్రెడ్డికి తెలుసన్నారు. ఉదయం 4.11 గంటల ప్రాంతంలో కూడా వాట్సప్లో ఉన్నారని, అయితే జమ్మలమడుగు వెళుతూ చిన్నాన్న హత్య గురించి తెలుసుకుని వెనక్కి తిరిగి వచ్చినట్లు మొసలి కన్నీరు కారుస్తున్నారని అందువల్ల ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు.
దర్యాప్తు లోపభూయిష్టం
- అవినాష్ తరఫు న్యాయవాది
అంతకుముందు ఉదయం నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు అవినాష్రెడ్డి తరఫు న్యాయవాది ఇ.ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ సీబీఐ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందంటూ పలు అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హత్య అనంతరం పోలీసులు, సిట్ దర్యాప్తు అంశాలకు చెందిన కేసు డైరీని మూడేళ్లయినా కోర్టుకు సమర్పించలేదన్నారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా కేవలం కౌంటరులోని అంశాల ఆధారంగా నిందితుడని ముద్ర వేస్తున్నారన్నారు. హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి లభించిన రక్షణ గత నెల 26న సుప్రీంకోర్టు ఉత్తర్వులతో రద్దయిపోయిందని, అప్పటి నుంచి ఈ నెల 15 వరకు (21 రోజులు) విచారణకు పిలవలేదన్నారు. ప్రస్తుతం ఆయన తల్లి అనారోగ్యంతో ఉన్నపుడే ఈ హడావుడి ఎందుకన్నారు. సాక్ష్యాధారాలను చెరిపేశారన్న ఆరోపణలపై పిటిషనర్ తండ్రి వై.ఎస్.భాస్కరరెడ్డిని అరెస్ట్ చేశారని, అవే ఆరోపణలతో అవినాష్రెడ్డిని నిందితుడిగా చేస్తున్నారన్నారు. రక్తపు మరకలను శుభ్రం చేస్తున్న సమయంలో అవినాష్రెడ్డి పడక గదిలో లేరని, బయట వరండాలో తిరుగుతున్నట్లు సీబీఐ స్వయంగా తన కౌంటరులోనే పేర్కొందన్నారు.
రక్తపు మరకలను శుభ్రం చేసిన పనిమనుషులు కూడా అవినాష్రెడ్డి పేరు వెల్లడించలేదన్నారు. గుండెపోటు కారణంగా వివేకా చనిపోయినట్లు అవినాష్ చెప్పారని ఏ ఒక్కరూ వాంగ్మూలం ఇవ్వలేదన్నారు. ఈ కేసులో హత్యలో పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేసిందని, అయితే దస్తగిరిని మాత్రం అదుపులోకి తీసుకోకపోగా ముందస్తు బెయిలునూ వ్యతిరేకించకుండా.. క్షమాభిక్ష ప్రసాదించాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. నిందితుడిగా ఉన్న వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించకముందే సాక్షిగా పేర్కొంటూ అభియోగ పత్రం దాఖలు చేసిందన్నారు. అలాగే ప్రస్తుతం అవినాష్రెడ్డిని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని పేర్కొందని, కస్టడీకి ఇవ్వాలో వద్దో కోర్టు నిర్ణయించకుండానే సీబీఐ అన్నీ చెబుతోందన్నారు. హత్యలో పాల్గొన్న వ్యక్తి గురించి తెలిసిన వెంటనే అదుపులోకి తీసుకోకపోగా విచారణ పేరుతో అనుకూలంగా వ్యవహరించారన్నారు.
సీబీఐ పెంపుడు జంతువు (పెట్) అయిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం తప్ప అవినాష్రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. హత్యలో పాల్గొన్న నలుగురికీ ఒక్కో కారణం ఉందని, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్కు సంబంధించిన రూ.8 కోట్లలో వాటా ఇవ్వలేదని గంగిరెడ్డి, సునీల్యాదవ్ తల్లి, గజ్జల ఉమాశంకర్రెడ్డి భార్యతో సంబంధాలు, దస్తగిరిని ఉద్యోగం నుంచి తొలగించినందుకు కక్షలు ఉన్నాయని తెలిపారు. వివేకా హత్య నిమిత్తం గంగిరెడ్డి రూ.కోటి ఇచ్చారంటూ సునీల్ యాదవ్ అందులో రూ.25 లక్షలు తీసుకుని రూ.75 లక్షలు దస్తగిరికి ఇచ్చారన్నారు. రూ.75 లక్షల్లో కొంత మొత్తాన్ని మున్నా అనే వ్యక్తి వద్ద దాచినట్లు తేలిందని, మిగిలిన మొత్తం ఎక్కడ ఉందన్న విషయాన్ని సీబీఐ పట్టించుకోలేదన్నారు. సాక్షులను బెదిరించినట్లు చెబుతోందని, ఎవరిని బెదిరించారో చెప్పడంలేదన్నారు. సీబీఐ వాదనలు వినేందుకు కోర్టు విచారణను శనివారానికి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!