Peddireddy Ramachandra Reddy: నాకు చెప్పకుండా సమ్మె చేస్తారా?

తమ డిమాండ్ల సాధన కోసం 50 రోజులపాటు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టామని.. ఈ సమ్మె కాలంలో తమకు జీతాలను అందించాలని ద్రవిడ వర్సిటీ పొరుగు సేవల ఉద్యోగులు శుక్రవారం కుప్పం పర్యటనకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విజ్ఞప్తి చేశారు. 

Updated : 24 Jun 2023 08:09 IST

మా ప్రభుత్వ హయాంలో సమ్మె చేస్తే జీతాలు ఎలా ఇస్తాం?
ద్రవిడ వర్సిటీ పొరుగుసేవల ఉద్యోగులపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: తమ డిమాండ్ల సాధన కోసం 50 రోజులపాటు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టామని.. ఈ సమ్మె కాలంలో తమకు జీతాలను అందించాలని ద్రవిడ వర్సిటీ పొరుగు సేవల ఉద్యోగులు శుక్రవారం కుప్పం పర్యటనకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విజ్ఞప్తి చేశారు.  నాకు చెప్పకుండా సమ్మె చేస్తారా? మా ప్రభుత్వ హయాంలో సమ్మె చేస్తే జీతాలు ఎలా ఇస్తామంటూ.. సమ్మె కాలానికి ఎట్టి పరిస్థితుల్లో జీతాలు ఇచ్చేది లేదని మంత్రి తేల్చిచెప్పినట్లు పొరుగు సేవల ఉద్యోగులు వాపోయారు. ఈ విషయంలో  రెక్టార్‌తోపాటు రిజిస్ట్రార్‌పై కూడా మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని