Polavaram Project: బాధ్యులు ఎవరో తేల్చండి
పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే రక్షణలో భాగంగా నిర్మించిన గైడ్బండ్ కుంగడానికి బాధ్యులెవరో తేల్చాలని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్ర జల్శక్తి శాఖ స్పష్టం చేసింది. జరిగిన వైఫల్యాలపై సీరియస్ అయ్యింది.
పోలవరం గైడ్బండ్ కుంగడంపై కేంద్ర జల్శక్తి శాఖ సీరియస్
వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టీకరణ
ముందే ఎందుకు జాగ్రత్త పడలేదని ప్రశ్నలు
ఇంకా సిద్ధం కాని నిపుణుల కమిటీ నివేదిక
ఈనాడు - అమరావతి
పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే రక్షణలో భాగంగా నిర్మించిన గైడ్బండ్ కుంగడానికి బాధ్యులెవరో తేల్చాలని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్ర జల్శక్తి శాఖ స్పష్టం చేసింది. జరిగిన వైఫల్యాలపై సీరియస్ అయ్యింది. ఈ విషయంలో నిజనిర్ధారణ కమిటీ తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా నివేదిక సిద్ధం చేసే పనిలోనే ఉన్నారని, కొంత సమయం పడుతుందని జల్శక్తి శాఖలోని కీలకవర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం రాత్రి వరకూ ఈ నివేదిక ఉన్నతాధికారులకు చేరలేదు. కొన్ని పరీక్షల నివేదికలు రావాలని, వాటి ఆధారంగా నివేదిక సమర్పిస్తామని నిపుణుల కమిటీ ఛైర్మన్ పాండ్యా కేంద్ర జల్శక్తి శాఖ ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. గైడ్బండ్ ధ్వంసానికి కారణమేంటో నిర్ధారించి, బాధ్యులెవరో తేల్చాల్సిందేనని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధికారులకు నిర్దేశించారు. ఈ క్రమంలోనే ఆ శాఖ కార్యదర్శి వద్ద సమావేశం జరిగింది. ఇందులో గైడ్బండ్ వైఫల్యంపైనా కీలక చర్చ జరిగింది. ఎక్కడ లోపం జరిగిందన్న అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరులశాఖ నిర్మిస్తోంది. ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగు సంస్థ నిర్మిస్తోంది. డిజైన్లు ప్రతిపాదించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్ర జలసంఘానికి, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్కు వాటిని పంపి అనుమతులు తీసుకుంటారు. జలవనరులశాఖ ఆధ్వర్యంలోనే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వ్యాప్కోస్ పర్యవేక్షణ కూడా ఉంది. ఈ క్రమంలో పోలవరం లాంటి కీలక ప్రాజెక్టులో ఈ వైఫల్యానికి బాధ్యులను తేల్చి చర్యలు తీసుకోపోతే.. ప్రధాన డ్యాం నిర్మాణంలోనూ బాధ్యతాయుతంగా ఉండకపోతే ప్రమాదమని కేంద్రపెద్దలు కొందరు భావించి ఈ మార్గనిర్దేశం చేశారని తెలిసింది.
డిజైన్, నిర్మాణ లోపాలు రెండూ..
నిజనిర్ధారణ కమిటీ ప్రాథమికంగా కొన్ని అంశాలు గుర్తించింది. సీఎం జగన్ వద్ద తాజాగా జరిగిన సమీక్ష సమావేశంలోనూ అధికారులు ఆ విషయాలు తెలిపారు. అందులో పైన పేర్కొన్న గైడ్బండ్ నిర్మాణ సమయంలోనే వరదలు రావడం, దానివల్ల మట్టి నమూనాలు మారిపోవడం అన్న అంశమూ ప్రస్తావించారు. ఈ ఆలస్యం వల్ల డిజైన్ పరంగా, నిర్మాణపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మేఘా ఇంజినీరింగ్ సంస్థకూ ఉంటుంది, స్థానికంగా పనులు పర్యవేక్షించే పోలవరం అధికారులకూ ఉంటుంది.
- ఇక్కడ ఉన్న మట్టిలో పోర్ నీరు చేరడం కూడా ఒక కారణంగా పేర్కొంటున్నారు. డిజైన్ సమయంలో ఈ అంశాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదనే ప్రశ్న వినిపిస్తోంది.
- రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ప్యానెల్ జాయింట్లు విఫలమయ్యాయని ఒక కారణంగా పేర్కొన్నారు. అది నిర్మాణ వైఫల్యమే కదా అన్న ప్రశ్నకు సమాధానం ఏదీ?
- సహజంగా ఏర్పడే డ్రైనేజి పోర్ నీటిని పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణం చేపట్టడమూ మరో కారణంగా గుర్తించారు.
- అది ఏ కారణమైనా ఇక్కడ డిజైన్పరంగా, నిర్మాణపరంగా వైఫల్యం స్పష్టంగా కనిపించడం విశేషం.
- నిర్మాణంలో ఆలస్యం వల్లే మట్టి లక్షణాలు మారాయని, అందుకే గైడ్బండ్ కుంగిందని నిపుణులు పేర్కొన్నట్లు తెలిసింది. ఇలా జరిగే అవకాశం ఉందని ముందే గుర్తించినప్పుడు తదనుగుణంగా ఆకృతులు మార్చుకోవచ్చు కదా అని కేంద్ర అధికారి ప్రశ్నించినట్లు సమాచారం. ఆ విషయం వారు తమకు తెలియజేయలేదని, లేకుంటే డిజైన్లు మార్చేవారిమని కేంద్రసంస్థ సభ్యుడు ఒకరు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటే ఎలా అని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ఇందులో బాధ్యులు ఎవరో కచ్చితంగా తేల్చాలని నిర్దేశించినట్లు సమాచారం.
నాలుగు నెలల్లో నిర్మించాల్సింది ఇన్ని నెలలా?
పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే రక్షణలో భాగంగా నిర్మించాల్సిన గైడ్బండ్ను 4నెలల్లోనే పూర్తి చేయాలనేది తొలి ప్రణాళిక. అలాంటిది ఏడాదికి పైగా పట్టింది. ఇలా ఆలస్యం కావడం వల్లే నిర్మాణ ప్రదేశంలో మార్పులు జరిగి గైడ్బండ్, రిటైనింగ్ వాల్ దెబ్బతిన్నాయనే అభిప్రాయాన్ని నిపుణులు ప్రాథమికంగా వ్యక్తం చేశారని తెలిసింది. కేంద్రజల్శక్తిశాఖ కార్యదర్శి వద్ద ఈ అంశం చర్చకు వచ్చింది.
- తొలుత స్టోన్కాలమ్స్ నిర్మాణంలో ఆలస్యమయింది. మధ్యలో గోదావరికి భారీ వరద వచ్చింది. దాంతో స్టోన్ కాలమ్స్తో అంతకుముందు ఉన్న మట్టి నమూనాల రకాలకు, ఆ తర్వాత వరదల వల్ల మట్టిలక్షణాలు మారిపోయి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే అక్కడి మట్టిని మళ్లీ పరీక్షించి, అంతకుముందు చేసిన పరీక్షల ఫలితాలతో పోల్చిచూడాలని నిర్ణయించారు. ఈ పరీక్షల ఫలితాలు వస్తే దాని ఆధారంగా నివేదిక సమర్పించేందుకు వేచి చూస్తున్నారని తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.