స్కిల్లో అవినీతి.. సీఎంకు తెలియదని ఎలా అంటారు?
‘‘ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో ఎంత లేదనుకున్నా రూ.250 కోట్ల అవినీతి జరిగింది. సీమెన్స్ కంపెనీ పేరు చెప్పి ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నా, ఆ కంపెనీ తమకు సంబంధమే లేదంటోంది.
సీమెన్స్ కంపెనీ తనకు సంబంధమే లేదంటోంది
డొల్ల కంపెనీలకు నిధులు తరలించారు
విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది అయిదు రోజులే
శాసనసభ చర్చలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి
ఈనాడు, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో ఎంత లేదనుకున్నా రూ.250 కోట్ల అవినీతి జరిగింది. సీమెన్స్ కంపెనీ పేరు చెప్పి ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నా, ఆ కంపెనీ తమకు సంబంధమే లేదంటోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అనేకమంది అరెస్టయ్యారు. మంత్రివర్గం అనుమతి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు, జీవోలో ఉన్న అంశాలు లేకుండా ఒప్పందం కుదుర్చుకోవడం, ఏ రోజు, ఎక్కడ ఆ నిర్ణయాలు తీసుకున్నారో నమోదుచేయకుండా సంతకాలు చేయడం... ఇదంతా అప్పటి ముఖ్యమంత్రికి తెలియకుండానే జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? అప్పట్లో సీఎస్ సైతం ముఖ్యమంత్రితో సమావేశమయ్యాం. ముందు నిధులు ఇవ్వండి, తర్వాత ర్యాటిఫై చేసుకోండి అన్నారని నోట్ఫైలులో రాశారు. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రికి సంబంధం లేదని ఎలా అంటారు’’ అని మంత్రి బుగ్గన ప్రశ్నించారు. రాష్ట్ర శాసనసభలో శుక్రవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటులో అవినీతి గురించి లఘుచర్చ చేపట్టారు. ఈ చర్చకు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సమాధానం ఇచ్చారు. ఒప్పందాలు, నోట్ ఫైళ్లు, అందులో ఎవరెవరు ఏం రాశారు? జీవోలో ఏం ఉంది? ఎంవోయూలో ఏం ఉంది? తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్లో చూపిస్తూ మంత్రి ప్రసంగించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే...
డొల్ల కంపెనీలతోనే ఒప్పందం
ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ఏర్పాటైన కార్పొరేషన్ సీమెన్స్, డిజైన్టెక్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 90% సీమెన్స్ గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇస్తుంది. రాష్ట్రప్రభుత్వం 10% నిధులిస్తుంది. సీమెన్స్ కంపెనీ తర్వాత తమకు ఈ ఒప్పందంతో సంబంధమే లేదని తేల్చిచెప్పింది. తమ ఎండీ తప్పులు చేశారని ఆయనను తొలగించినట్లు పేర్కొంది. ఆయన ఒప్పందం చేసుకున్నా అది చెల్లుబాటు కాదని కూడా కంపెనీ తెలియజేసింది. అసలు ఇలా 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చే ప్రాజెక్టేదీ తమ కంపెనీలో లేదని సీమెన్స్ తేల్చిచెప్పింది. 2017లో సెబి కొన్ని డొల్ల కంపెనీలను గుర్తించింది. ఆ విషయంపై పుణెలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీకి వర్తమానం ఇచ్చింది. వారు పరిశోధన చేసి డిజైన్టెక్, స్కిల్లార్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్లను డొల్ల కంపెనీలుగా గుర్తించి నోటీసులు ఇచ్చారు. అప్పటికే చంద్రబాబు ఆధ్వర్యంలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ డిజైన్టెక్తో ఒప్పందం చేసుకుంది’’ అని రాజేంద్రనాథరెడ్డి అన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం అవసరమని అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి అజేయకల్లం పేర్కొన్నా, పైన నోట్ రాసి ఉన్నా, కింద ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జీవోలో పేర్కొన్న విషయాలకు, ఒప్పందంలో పేర్కొన్న అంశాలకు పొంతన లేదు. 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్, 10% రాష్ట్రప్రభుత్వ వాటా అన్న అంశం ఎంవోయూలో ఎందుకు రాయలేదు?’’ అని మంత్రి ప్రశ్నించారు.
గుజరాత్ ప్రాజెక్టుతో సంబంధం లేదు
సీమెన్స్ కంపెనీ గుజరాత్లో ఇలాంటి ప్రాజెక్టు అమలు చేసిందని చెబుతున్నారు. అక్కడి విధానానికి, ఏపీలో విధానానికి సంబంధమే లేదు. గుజరాత్లో సౌమ్యేంద్రబోస్ అన్న పేరుతో సీమెన్స్ ఎండీగా ఒప్పందంపై సంతకం చేశారు. ఇక్కడ సుమన్బోస్ పేరుతో సంతకం చేశారు. సీమెన్స్ కంపెనీ తరఫునే ఒప్పందం చేసుకుంటే ఇన్ని తేడాలు ఎందుకు ఉంటాయి? గుజరాత్లో సీమెన్స్ కంపెనీ సీఎస్ఆర్ కింద ఉచితంగా రూ.17 కోట్లు ఇచ్చింది. ఏపీలో జరిగిన ఒప్పందంలో రెండోపేజీలో తేదీ లేదు, పేజీ 6లో డి పాయింటులో ఈ నిధులు మంజూరుచేస్తున్నాం అని పేర్కొన్నా... అందులో లెటర్ నెంబరు లేదు, తేదీ లేదు. ఆఖరి పేజీలో కూడా తేదీ లేదు, ఎక్కడో లేదు... దీనికి సాక్షులు ఎవరో కూడా ఖాళీలు వదిలేశారు. మరి తెదేపా నాయకులు అనవసరంగా కేసులు పెట్టామంటారు. ఈడీ, సెబి, జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ కేసులు పెట్టారు. ఆ కేసులు... అదీ 2018లో మన ప్రభుత్వం పెట్టించిందా? డిజైన్టెక్కు చెందిన కన్విల్కర్ను ఈడీ అరెస్టుచేసింది. ఒకవైపు ఒప్పందంలో సీమెన్స్ కంపెనీదే బాధ్యత అని ఉంది. అది పోయి డిజైన్టెక్ వచ్చింది. మళ్లీ ఆ కంపెనీ బదులు స్కిల్లార్ ఎంటర్ప్రైజెస్ వచ్చింది. ఇవి డొల్ల కంపెనీలని తేల్చింది సెబి, ఈడీలే కదా... మా ప్రభుత్వం కాదు కదా?’’ అని బుగ్గన ప్రశ్నించారు.
క్లస్టర్లు ఏర్పాటు చేయకుండానే నిధుల చెల్లింపు
ఈ కార్యక్రమంలో మొత్తం రూ.371.21 కోట్లు 2015 నుంచి 2016 లోపు చెల్లించారు. యూనిట్లను 2018 మార్చి నాటికి ఏర్పాటుచేశారు. డిజైన్టెక్ స్థానంలో వచ్చిన స్కిల్లార్ కంపెనీ ఈ ఎంవోయూ కుదిరిన నెల తర్వాత ఏర్పాటైంది. అంటే ఇదంతా ప్రణాళిక ప్రకారమే చేసినట్లు కాదా. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఫోరెన్సిక్ ఆడిట్ చేయించింది. రూ.58.90 కోట్లే సీమెన్స్ కంపెనీకి వెళ్లింది. సీమెన్స్కు పోను మిగిలిన నిధులన్నీ అనేక డొల్ల కంపెనీలకు మళ్లించేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబుకు వివిధ మార్గాల్లో రూ.118.98 కోట్లు చేరినట్లు ఆదాయపు పన్ను విభాగం గుర్తించి నోటీసులు ఇచ్చింది. ఆ వ్యవహారంలో చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్, ఆయన సహాయకుడు కిలారు రాజేష్ పేర్లు బయటకు వచ్చాయి. ఏయే మార్గాల్లో ఆ నిధులు చంద్రబాబుకు చేరాయని ఐటీ పేర్కొంటూ నోటీసులిచ్చిందో.. అందులో ఉన్న డొల్లకంపెనీలే ఈ వ్యవహారంలోనూ ఉండటం, అవే పేర్లు ఇక్కడా బయటపడటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నైపుణ్య శిక్షణలో ఎలాంటి పని చేయకుండానే రూ.241.78 కోట్లు సబ్కాంట్రాక్టర్ల పేరుతో డొల్ల కంపెనీలకు చెల్లింపులు చేశారని తేలింది. ఈ ప్రాజెక్టు కింద ఏ శిక్షణ ఎవరికి ఇచ్చారో కూడా అధ్యయనం చేయించాం. ఏ విద్యార్థికీ అయిదు రోజులకు మించి శిక్షణ ఇవ్వలేదు. నిజానికి ఇది డెమో మాత్రమే. సాఫ్ట్వేర్ శిక్షణ అంటే ఒకో కోర్సులో మూడు నుంచి ఆరు వారాల పాటు ఇవ్వాలి. 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చామంటున్నారు.. వీరు ఇచ్చిన శిక్షణ ఇదేనా? తెలుగుదేశం సభ్యులను ఈ విషయంలో చర్చకు రమ్మన్నా, రాలేదు. కేటాయించాల్సిన సమయం కన్నా ఎక్కువే ఇస్తాం.. ఏం చెప్పినా వింటామని తెలియజేసినా వాళ్లంతట వాళ్లే సభ నుంచి వెళ్లిపోయారు’’ అని బుగ్గన అన్నారు.
పదే పదే సీఎం జగన్ మార్గనిర్దేశం!
ఈ చర్చలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి మాట్లాడుతుండగా సీఎం జగన్ మధ్యలో పదే పదే ఆపి ఆయనకు సూచనలు ఇవ్వడం కనిపించింది. దీంతో అనేకసార్లు బుగ్గన తన ప్రసంగాన్ని ఆపాల్సి వచ్చింది. సభలో అధికారస్థానాల్లో ఉన్నవారు కూడా కాగితాలపై ఏవో నోట్ చేసి మంత్రి బుగ్గనకు పంపించారు. ఒకానొక దశలో మంత్రి ఆ కాగితాలు పట్టుకువచ్చిన సహాయకుడిపై చిరాకుపడ్డారు. మాట్లాడుతుండగా ఇలా అడ్డుపడితే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ కాగితం చూస్తూ ‘ఈ విషయం చెప్పాను కదా’ అని కూడా వ్యాఖ్యానించారు. ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు