స్కిల్లో అవినీతి.. సీఎంకు తెలియదని ఎలా అంటారు?
‘‘ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో ఎంత లేదనుకున్నా రూ.250 కోట్ల అవినీతి జరిగింది. సీమెన్స్ కంపెనీ పేరు చెప్పి ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నా, ఆ కంపెనీ తమకు సంబంధమే లేదంటోంది.
సీమెన్స్ కంపెనీ తనకు సంబంధమే లేదంటోంది
డొల్ల కంపెనీలకు నిధులు తరలించారు
విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది అయిదు రోజులే
శాసనసభ చర్చలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి
ఈనాడు, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో ఎంత లేదనుకున్నా రూ.250 కోట్ల అవినీతి జరిగింది. సీమెన్స్ కంపెనీ పేరు చెప్పి ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నా, ఆ కంపెనీ తమకు సంబంధమే లేదంటోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అనేకమంది అరెస్టయ్యారు. మంత్రివర్గం అనుమతి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు, జీవోలో ఉన్న అంశాలు లేకుండా ఒప్పందం కుదుర్చుకోవడం, ఏ రోజు, ఎక్కడ ఆ నిర్ణయాలు తీసుకున్నారో నమోదుచేయకుండా సంతకాలు చేయడం... ఇదంతా అప్పటి ముఖ్యమంత్రికి తెలియకుండానే జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? అప్పట్లో సీఎస్ సైతం ముఖ్యమంత్రితో సమావేశమయ్యాం. ముందు నిధులు ఇవ్వండి, తర్వాత ర్యాటిఫై చేసుకోండి అన్నారని నోట్ఫైలులో రాశారు. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రికి సంబంధం లేదని ఎలా అంటారు’’ అని మంత్రి బుగ్గన ప్రశ్నించారు. రాష్ట్ర శాసనసభలో శుక్రవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటులో అవినీతి గురించి లఘుచర్చ చేపట్టారు. ఈ చర్చకు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సమాధానం ఇచ్చారు. ఒప్పందాలు, నోట్ ఫైళ్లు, అందులో ఎవరెవరు ఏం రాశారు? జీవోలో ఏం ఉంది? ఎంవోయూలో ఏం ఉంది? తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్లో చూపిస్తూ మంత్రి ప్రసంగించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే...
డొల్ల కంపెనీలతోనే ఒప్పందం
ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ఏర్పాటైన కార్పొరేషన్ సీమెన్స్, డిజైన్టెక్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 90% సీమెన్స్ గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇస్తుంది. రాష్ట్రప్రభుత్వం 10% నిధులిస్తుంది. సీమెన్స్ కంపెనీ తర్వాత తమకు ఈ ఒప్పందంతో సంబంధమే లేదని తేల్చిచెప్పింది. తమ ఎండీ తప్పులు చేశారని ఆయనను తొలగించినట్లు పేర్కొంది. ఆయన ఒప్పందం చేసుకున్నా అది చెల్లుబాటు కాదని కూడా కంపెనీ తెలియజేసింది. అసలు ఇలా 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చే ప్రాజెక్టేదీ తమ కంపెనీలో లేదని సీమెన్స్ తేల్చిచెప్పింది. 2017లో సెబి కొన్ని డొల్ల కంపెనీలను గుర్తించింది. ఆ విషయంపై పుణెలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీకి వర్తమానం ఇచ్చింది. వారు పరిశోధన చేసి డిజైన్టెక్, స్కిల్లార్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్లను డొల్ల కంపెనీలుగా గుర్తించి నోటీసులు ఇచ్చారు. అప్పటికే చంద్రబాబు ఆధ్వర్యంలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ డిజైన్టెక్తో ఒప్పందం చేసుకుంది’’ అని రాజేంద్రనాథరెడ్డి అన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం అవసరమని అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి అజేయకల్లం పేర్కొన్నా, పైన నోట్ రాసి ఉన్నా, కింద ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జీవోలో పేర్కొన్న విషయాలకు, ఒప్పందంలో పేర్కొన్న అంశాలకు పొంతన లేదు. 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్, 10% రాష్ట్రప్రభుత్వ వాటా అన్న అంశం ఎంవోయూలో ఎందుకు రాయలేదు?’’ అని మంత్రి ప్రశ్నించారు.
గుజరాత్ ప్రాజెక్టుతో సంబంధం లేదు
సీమెన్స్ కంపెనీ గుజరాత్లో ఇలాంటి ప్రాజెక్టు అమలు చేసిందని చెబుతున్నారు. అక్కడి విధానానికి, ఏపీలో విధానానికి సంబంధమే లేదు. గుజరాత్లో సౌమ్యేంద్రబోస్ అన్న పేరుతో సీమెన్స్ ఎండీగా ఒప్పందంపై సంతకం చేశారు. ఇక్కడ సుమన్బోస్ పేరుతో సంతకం చేశారు. సీమెన్స్ కంపెనీ తరఫునే ఒప్పందం చేసుకుంటే ఇన్ని తేడాలు ఎందుకు ఉంటాయి? గుజరాత్లో సీమెన్స్ కంపెనీ సీఎస్ఆర్ కింద ఉచితంగా రూ.17 కోట్లు ఇచ్చింది. ఏపీలో జరిగిన ఒప్పందంలో రెండోపేజీలో తేదీ లేదు, పేజీ 6లో డి పాయింటులో ఈ నిధులు మంజూరుచేస్తున్నాం అని పేర్కొన్నా... అందులో లెటర్ నెంబరు లేదు, తేదీ లేదు. ఆఖరి పేజీలో కూడా తేదీ లేదు, ఎక్కడో లేదు... దీనికి సాక్షులు ఎవరో కూడా ఖాళీలు వదిలేశారు. మరి తెదేపా నాయకులు అనవసరంగా కేసులు పెట్టామంటారు. ఈడీ, సెబి, జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ కేసులు పెట్టారు. ఆ కేసులు... అదీ 2018లో మన ప్రభుత్వం పెట్టించిందా? డిజైన్టెక్కు చెందిన కన్విల్కర్ను ఈడీ అరెస్టుచేసింది. ఒకవైపు ఒప్పందంలో సీమెన్స్ కంపెనీదే బాధ్యత అని ఉంది. అది పోయి డిజైన్టెక్ వచ్చింది. మళ్లీ ఆ కంపెనీ బదులు స్కిల్లార్ ఎంటర్ప్రైజెస్ వచ్చింది. ఇవి డొల్ల కంపెనీలని తేల్చింది సెబి, ఈడీలే కదా... మా ప్రభుత్వం కాదు కదా?’’ అని బుగ్గన ప్రశ్నించారు.
క్లస్టర్లు ఏర్పాటు చేయకుండానే నిధుల చెల్లింపు
ఈ కార్యక్రమంలో మొత్తం రూ.371.21 కోట్లు 2015 నుంచి 2016 లోపు చెల్లించారు. యూనిట్లను 2018 మార్చి నాటికి ఏర్పాటుచేశారు. డిజైన్టెక్ స్థానంలో వచ్చిన స్కిల్లార్ కంపెనీ ఈ ఎంవోయూ కుదిరిన నెల తర్వాత ఏర్పాటైంది. అంటే ఇదంతా ప్రణాళిక ప్రకారమే చేసినట్లు కాదా. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఫోరెన్సిక్ ఆడిట్ చేయించింది. రూ.58.90 కోట్లే సీమెన్స్ కంపెనీకి వెళ్లింది. సీమెన్స్కు పోను మిగిలిన నిధులన్నీ అనేక డొల్ల కంపెనీలకు మళ్లించేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబుకు వివిధ మార్గాల్లో రూ.118.98 కోట్లు చేరినట్లు ఆదాయపు పన్ను విభాగం గుర్తించి నోటీసులు ఇచ్చింది. ఆ వ్యవహారంలో చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్, ఆయన సహాయకుడు కిలారు రాజేష్ పేర్లు బయటకు వచ్చాయి. ఏయే మార్గాల్లో ఆ నిధులు చంద్రబాబుకు చేరాయని ఐటీ పేర్కొంటూ నోటీసులిచ్చిందో.. అందులో ఉన్న డొల్లకంపెనీలే ఈ వ్యవహారంలోనూ ఉండటం, అవే పేర్లు ఇక్కడా బయటపడటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నైపుణ్య శిక్షణలో ఎలాంటి పని చేయకుండానే రూ.241.78 కోట్లు సబ్కాంట్రాక్టర్ల పేరుతో డొల్ల కంపెనీలకు చెల్లింపులు చేశారని తేలింది. ఈ ప్రాజెక్టు కింద ఏ శిక్షణ ఎవరికి ఇచ్చారో కూడా అధ్యయనం చేయించాం. ఏ విద్యార్థికీ అయిదు రోజులకు మించి శిక్షణ ఇవ్వలేదు. నిజానికి ఇది డెమో మాత్రమే. సాఫ్ట్వేర్ శిక్షణ అంటే ఒకో కోర్సులో మూడు నుంచి ఆరు వారాల పాటు ఇవ్వాలి. 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చామంటున్నారు.. వీరు ఇచ్చిన శిక్షణ ఇదేనా? తెలుగుదేశం సభ్యులను ఈ విషయంలో చర్చకు రమ్మన్నా, రాలేదు. కేటాయించాల్సిన సమయం కన్నా ఎక్కువే ఇస్తాం.. ఏం చెప్పినా వింటామని తెలియజేసినా వాళ్లంతట వాళ్లే సభ నుంచి వెళ్లిపోయారు’’ అని బుగ్గన అన్నారు.
పదే పదే సీఎం జగన్ మార్గనిర్దేశం!
ఈ చర్చలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి మాట్లాడుతుండగా సీఎం జగన్ మధ్యలో పదే పదే ఆపి ఆయనకు సూచనలు ఇవ్వడం కనిపించింది. దీంతో అనేకసార్లు బుగ్గన తన ప్రసంగాన్ని ఆపాల్సి వచ్చింది. సభలో అధికారస్థానాల్లో ఉన్నవారు కూడా కాగితాలపై ఏవో నోట్ చేసి మంత్రి బుగ్గనకు పంపించారు. ఒకానొక దశలో మంత్రి ఆ కాగితాలు పట్టుకువచ్చిన సహాయకుడిపై చిరాకుపడ్డారు. మాట్లాడుతుండగా ఇలా అడ్డుపడితే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ కాగితం చూస్తూ ‘ఈ విషయం చెప్పాను కదా’ అని కూడా వ్యాఖ్యానించారు. ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
భూమ్భూమ్, ఆంధ్రాగోల్డ్ వంటి పేర్లతో ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యాన్ని రంగు నీళ్లతో కల్తీ చేసి విక్రయిస్తున్నాడో వ్యక్తి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ ఘటన వెలుగు చూసింది. -
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
జేఈఈ మెయిన్స్ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సవరించిన కాలపట్టికను వెల్లడించింది. -
ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
వచ్చే ఏడాది (2024) సాధారణ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పండగలు, జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 20 సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులుగా నోటిఫికేషన్లో పేర్కొంది. -
ప్రధాని మోదీతో మాట్లాడిన పాకల మహిళ
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో గురువారం నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. -
నాగార్జున సాగర్పై ఘర్షణ
ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ 13 గేట్ల స్వాధీనం పేరుతో జగన్ ప్రభుత్వం పెద్ద హైడ్రామాకు దిగింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు సినిమా కథను మరిపించేలా ఉత్కంఠగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. -
Visakhapatnam: ‘రౌడీ’ రాజు
ఆయన అధికార పార్టీలో కీలక నేత. నామినేటెడ్ పదవిలో ఉన్నారు. విశాఖపట్నంలో రౌడీ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, దాన్ని ‘రాజు’లా నడిపిస్తున్నారు. -
Chandrababu: తిరుపతిలో బాబుకు జన నీరాజనం
తెదేపా అధినేత చంద్రబాబుకు తిరుపతిలో ప్రజలు నీరాజనాలు పలికారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు తెలుగుదేశం, జనసేన శ్రేణులు, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. -
YS Jagan: ఇప్పుడే ఎందుకీ దండయాత్ర?
ఉలుకూ, పలుకూ లేకుండా.. ముందస్తుగా ఎలాంటి చర్చలు లేకుండా జగన్ ప్రభుత్వం నాగార్జునసాగర్పైకి దండయాత్రకు వెళ్లింది. -
IT Jobs in AP: కంపెనీలు రావడం లేదేంటి బ్రో!
రాష్ట్రంలో ప్రభుత్వం నైపుణ్య శిక్షణల్ని నిలిపేసిన ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాంగణ నియామకాలు భారీగా పడిపోయాయి. -
ఉద్యోగులకు డీఏ, జీపీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు చెల్లించాల్సిన డీఏ, ఆర్జిత సెలవులు, జీపీఎఫ్ బకాయిలు, పదవీ విరమణ చేసిన వారికి ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర్ డిమాండ్ చేశారు. -
అగ్ర దేశాల్ని అధిగమించడమే లక్ష్యం
ప్రపంచంలోని అగ్ర దేశాల్ని అధిగమిస్తూ... 2047 కల్లా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా ముందు వరుసలో నిలపాలన్నది ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. -
మొక్కుబడి పర్యటన.. తూతూమంత్రం పరిశీలన
ఎన్నడూ లేనన్ని అక్రమాలు, అవకతవకలు, లోపాలు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాల్లో వెలుగుచూస్తున్నాయి. -
తెలంగాణ ప్రాజెక్టులతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ష్ణా, గోదావరి నదులపై అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్ -
‘రీ-సర్వేతో భూములపై’ హక్కులు పోతున్నాయ్
జగనన్న శాశ్వత భూ హక్కు కార్యక్రమంతో రైతులకు సొంత భూములపై హక్కు లేకుండా పోతోంది. వారసత్వంగా వచ్చిన భూమిలో పది సెంట్ల నుంచి ఎకరా వరకు రీ-సర్వేలో తగ్గిపోతుండటంతో కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
సమస్యలు పరిష్కరిస్తేనే సహకరిస్తాం
వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం తుమ్మలపల్లెలోని యురేనియం పరిశ్రమ ప్రభావిత గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తేనే ప్రజాభిప్రాయ సేకరణకు సహకరిస్తామని ఆయా గ్రామాల నాయకులు పేర్కొన్నారు. -
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడమే పొన్నవోలు లక్ష్యం
తెదేపా అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, వ్యక్తిగతంగా ఆయన్ను పలచన చేయడమే లక్ష్యంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి పని చేస్తున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
కోర్టు చెప్పినా బేఖాతరు..!
రాజమహేంద్రవరం గ్రామీణంలోని కాటన్ బ్యారేజీ సమీపంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు బుధవారం స్టే ఇచ్చినా గురువారం యథేచ్ఛగా తవ్వకాలు సాగిపోయాయి. -
హామీల కోతలు
తన చేతికి ఎముకలేదన్నట్లు ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి జగన్కు రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకిచ్చే పెట్టుబడి రాయితీని పెంచేందుకు మాత్రం 54 నెలలుగా చేతులు రావడం లేదు. -
మేం నిరాధార ఆరోపణలు చేయలేదు!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది. -
ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రచారాన్ని సద్వినియోగం చేసుకోండి
కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్కుమార్ పిలుపునిచ్చారు. -
ఏఆర్ఆర్ ప్రతిపాదనల సమర్పణ
ఏపీ ట్రాన్స్కో, విద్యుత్తు రంగ సంస్థలు ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ల 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 వరకు వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లతోపాటు ఏపీ డిస్కంలు 2024-25కు రిటైల్ సరఫరా కార్యకలాపాల ఏఆర్ఆర్ను గురువారం దాఖలు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి
-
Jigarthanda Double X: ఓటీటీలోకి ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!