ఏపీతో నైపుణ్యాభివృద్ధి ఒప్పందం ఉంది: సీమెన్స్
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్న మాట నిజమేనని సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ (ఇండియా) ప్రస్తుత ఎండీ మాథ్యూ థామస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన వాంగ్మూలంలోనే స్పష్టం చేశారు.
2011 నుంచి డిజైన్టెక్ మా వ్యాపార భాగస్వామే
ఇన్ కైండ్ గ్రాంట్ రూపంలోనే మా వాటా.. అది ద్రవ్యేతర డిస్కౌంటే
ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో సీమెన్స్ ప్రస్తుత ఎండీ మాథ్యూ
అయినా బురద చల్లేందుకు పోటీపడుతున్న వైకాపా నేతలు
వివిధ రాష్ట్రాలు, కేంద్ర సంస్థలవీ.. ఇదే తరహా ఒప్పందాలు
ఈనాడు - అమరావతి
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్న మాట నిజమేనని సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ (ఇండియా) ప్రస్తుత ఎండీ మాథ్యూ థామస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన వాంగ్మూలంలోనే స్పష్టం చేశారు. డిజైన్టెక్ సిస్టమ్స్ సంస్థ 2011 నుంచి తమ వ్యాపార భాగస్వామేనని, సీఐడీ కేసు తర్వాతే సస్పెన్షన్లో ఉంచామనీ చెప్పారు. సీమెన్స్ సంస్థ ఎలాంటి ద్రవ్యసహాయం అందించదని.. వివిధ ఐఐటీ, ఎన్ఐటీ, రాష్ట్రప్రభుత్వ నైపుణ్య కార్యక్రమాల ప్రాజెక్టులకు కంపెనీ విధానాల ప్రకారం ‘ఇన్ కైండ్ గ్రాంట్’ రూపంలో డిస్కౌంట్ అందిస్తుందనీ పేర్కొన్నారు. అయినా అధికార వైకాపా నేతలు, కొందరు అధికారులు మాత్రం బురద చల్లడానికి పోటీపడుతున్నారు. నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదని సీమెన్స్ చెబుతోంది అంటారొకరు.. ‘ఇన్ కైండ్ గ్రాంట్’ అంటే ఏంటి? అదెక్కడా వినలేదే! అంటూ సాఫ్ట్వేర్ నిపుణుడిలా చెబుతారు ఇంకొకరు. లక్షల మంది విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించే సీమెన్స్ ప్రాజెక్టుపై.. తాము పీహెచ్డీ చేశామన్నట్లుగా అధికారపార్టీ నేతలు, కొందరు అధికారులు తమకు తెలిసిన పరిజ్ఞానాన్ని వల్లెవేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో, పేరున్న విద్యాసంస్థల్లో సీమెన్స్ ప్రాజెక్టు ఎలా అమలైందని తెలుసుకునే ఆలోచనా లేదు. ఇదే తరహా ఒప్పందాలు, ఇన్కైండ్ గ్రాంట్ విధానాలపైనే.. సీమెన్స్తో గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్రం కూడా సాగరమాల కార్యక్రమంలో భాగంగా మారిటైమ్, నౌకా నిర్మాణాలకు సీమెన్స్తో ప్రపంచస్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. అక్కడ కేంద్రవాటాను వన్టైమ్ గ్రాంట్గానే ఇచ్చేందుకు నిర్ణయించింది. అక్కడెక్కడా కనిపించని అవినీతి.. వైకాపా నేతలు, కొందరు అధికారులకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందంలోనే కనిపిస్తోంది.
సీమెన్స్తో త్రైపాక్షిక ఒప్పందం.. వ్యాపార భాగస్వామిగా డిజైన్టెక్
‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు, సాంకేతిక శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిజైన్టెక్, సీమెన్స్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం 2015 జూన్లో కుదిరింది. నిర్దేశిత కేంద్రాల్లో అవసరమైన సాప్ట్వేర్ సరఫరా, హార్డ్వేర్ టెస్ట్ పనులను సీమెన్స్ చూస్తుంది’ అని మాథ్యూ థామస్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. ‘సీమెన్స్ దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం.. ఆటోమొబైల్, అగ్రిటెక్, ఇండస్ట్రియల్ మెషినరీ తదితర రంగాల్లో సాంకేతిక శిక్షణ అందించేందుకు కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రాజెక్టులో భాగంగా అవసరమైన సాఫ్ట్వేర్ సరఫరా, ఐపీ అడ్రస్ ఇవ్వడంతో పాటు.. ప్రాజెక్టు అమలు, నిర్వహణ, శిక్షణ, ధ్రువీకరణ, పర్యవేక్షణ, శిక్షణకు సంబంధించిన నాణ్యత సహా మొత్తం కేంద్రాల్లో పరిపాలనా వ్యవహారాలను టెక్నాలజీ భాగస్వామి, కార్యక్రమాల సలహాదారుగా సీమెన్స్ చూస్తుంది. కేంద్రాల ఏర్పాటు, కార్యకలాపాల నిర్వహణ, సిస్టమ్ ఇంటిగ్రేటర్, కేంద్రాల్లో సాఫ్ట్వేర్-హార్డ్వేర్ అనుసంధానం, కోర్సులు, అవసరమైన ఇతర పరికరాల సరఫరా, ఫ్యాకల్టీ, విద్యార్థుల బాధ్యతల్ని సీమెన్స్ తరఫున డిజైన్టెక్ చూస్తుంది. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వాటాను డిజైన్టెక్ ఖాతాకు చెల్లించాలి’ అని పేర్కొన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుకు.. సీమెన్స్ దగ్గరున్న సమాచారం ఆధారంగా డిజైన్టెక్కు సరఫరా చేసిన సాఫ్ట్వేర్ విలువ రూ.1,289 కోట్లుగా తేల్చారు. ఎల్ఎంఎస్ ఇండియా ద్వారా సరఫరా చేసిన టెస్ట్ సాఫ్ట్వేర్ విలువను రూ.10.25 కోట్లుగా పేర్కొన్నారు. ‘సీమెన్స్ సాఫ్ట్వేర్ విక్రయం, అమలు, శిక్షణ అందించడానికి డిజైన్టెక్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2011 నుంచి సీమెన్స్కు ఛానెల్ భాగస్వామిగా ఉంది. అయితే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుపై ఏపీసీఐడీ కేసు పెట్టాక.. ఈ సంస్థతో ఒప్పందాన్ని సస్పెన్షన్లో ఉంచాం’ అని మాథ్యూ వివరించారు.
ఆలోచన నుంచి ఆవిష్కరణ
ఇదొక అత్యాధునిక పారిశ్రామిక కర్మాగారమే. ఉదాహరణకు త్రీడీ ల్యాబ్లో వైద్యరంగంలో రోగుల శరీరంలో అమర్చే పరికరాల (మెడికల్ ఇంప్లాట్స్) నుంచి.. అంతరిక్షంలో వ్యోమగాములు వినియోగించే తేలికపాటి వస్తువులనూ రూపొందిస్తున్నారు. మానవరహిత కార్ల సాంకేతికతను విద్యార్థుల కళ్లకు కట్టేలా చూపేందుకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్లో రోబోలను వినియోగించి బోధిస్తున్నారు. ఎలాంటి పారిశ్రామిక అవసరాలకైనా తగ్గట్టు కంప్యూటర్లో ప్రోగ్రాం రాయగానే యంత్రంపై అది తయారవడం, అన్ని రకాల లోహాలతో రూపొందడం ఈ కేంద్రం ప్రత్యేకత. ఒక వ్యక్తి వేరేచోట ఉండి కంప్యూటర్పై డిజైన్ చేసి పంపితే ఆ నమూనా ఈ ల్యాబ్లో మానవరహితంగా తయారయ్యేలా ఉన్న డిజిటల్ ఇండస్ట్రీగా అవతరిస్తుందని కేంద్రం సమన్వయకర్త, సహ సమన్వయకర్తలు ఆచార్య కృష్ణానంద్, ఎస్.శ్రీనివాసరావు వివరించారు. రోబోటిక్ ప్రయోగశాల కోసం రోబోలను జర్మనీ నుంచి తెప్పించారు.
కర్ణాటకలో లేని ఉల్లంఘనలు.. ఏపీలో ఎలా?
సీమెన్స్, డిజైన్టెక్ సంస్థలతో కర్ణాటక ప్రభుత్వం 2017 జూన్ 9న ఒప్పందం చేసుకుంది. అప్పటి సీఎం సిద్ధరామయ్య ఆధ్వర్యంలోనే ఈ ఒప్పందం జరిగింది. ప్రాజెక్టు వ్యయం రూ.2,041.80 కోట్లుగా నిర్ణయించగా.. అందులో సీమెన్స్ వాటాగా రూ.1,822.48 కోట్లు (89%), కర్ణాటక ప్రభుత్వం రూ.219.32 కోట్లు (11%) చెల్లించేలా అంగీకారం కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రప్రభుత్వ వాటా 10%. కానీ, అక్కడ లేని నిబంధనల ఉల్లంఘన, ఏపీలోనే జరిగినట్లు రాష్ట్రప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోంది. ఏపీలో ఒప్పందం విధానాన్నే కర్ణాటక సైతం అనుసరించింది. సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్, డిజైన్టెక్ సిస్టమ్స్ లిమిటెడ్, కర్ణాటక ప్రభుత్వ టూల్రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సంస్థలు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏపీలో ఆరు ఎక్స్లెన్స్ సెంటర్లు, 36 సాంకేతిక నైపుణ్యశిక్షణ కేంద్రాల్ని ఏర్పాటుచేయగా.. కర్ణాటక నాలుగు సెంటర్లను ఏర్పాటుచేసింది. కర్ణాటక ఒప్పందంలో మొదటి రెండేళ్లు నాలుగు కేంద్రాలను డిజైన్టెక్ నిర్వహిస్తుందని, మూడో ఏడాది నిర్వహణకు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఏపీలో నాలుగో ఏడాది సైతం డిజైన్టెక్ ద్వారానే కేంద్రాలను నిర్వహించారు. అటోమోటివ్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఇండస్ట్రియల్ మిషనరీ, పునరుత్పాదక ఇంధన విభాగాల్లో శిక్షణకు సీమెన్స్తో అప్పటి కర్ణాటక ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.
సీమెన్స్తోనే కేంద్రం ఒప్పందం
కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ రూ.765 కోట్లతో ప్రపంచస్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది. ఇందులో సీమెన్స్ వాటా రూ.665 కోట్లు (87%). నౌకాయాన మంత్రిత్వశాఖ వన్టైమ్ గ్రాంట్ కింద రూ.100 కోట్లు (13%) అందించింది. అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, సాఫ్ట్వేర్ డిజైన్, రోబోటిక్స్, మెకట్రానిక్స్, స్కాడా కంట్రోల్స్, ప్రొడక్ట్ లైఫ్సైకిల్ మేనేజ్మెంట్, పీఎల్సీ ప్రోగ్రామింగ్, ట్రాన్స్మిషన్ కంట్రోల్స్, వర్చువల్ రియాలిటీ, రాడార్ టెక్నాలజీ, డైమెన్షనల్ యాక్యురసీ, నెస్టింగ్ తదితర ఎన్నో రంగాలకు సంబంధించి శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
వరంగల్ నిట్లోనూ.. సీమెన్స్
సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు సీమెన్స్ సంస్థతో వరంగల్ నిట్ రూ.170 కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఇందులో రూ.150 కోట్లను (88.24%) సీమెన్స్, రూ.20 కోట్లను (11.76%) నిట్ భరిస్తాయి. మూడేళ్లలో 30వేల మంది విద్యార్థులకు నైపుణ్యాల పెంపులో శిక్షణ ఇచ్చే లక్ష్యంతో నిట్తో అనుసంధానమైంది. రూ.150 కోట్ల విలువచేసే పరికరాలు, సాఫ్ట్వేర్ను సీమెన్స్, వ్యాపార భాగస్వామ్య సంస్థలు అందిస్తాయి. డిజైన్ అండ్ వాలిడేషన్, ఐవోటీ, రోబోటిక్స్ ల్యాబ్లు.. ఇలా 13 ప్రయోగశాలలు ఏర్పాటుచేస్తున్నారు.
గ్రాంట్ ఇన్ ఎయిడ్.. ఇన్ కైండ్ గ్రాంట్.. ద్రవ్యేతర డిస్కౌంట్
ప్రభుత్వ ఉత్తర్వుల్లో సీమెన్స్ తన 90% వాటాను గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇస్తుందని పేర్కొన్నారు. అయితే సీమెన్స్ కంపెనీ తమ విధానాల ప్రకారం ఇన్ కైండ్ గ్రాంట్ రూపంలోనే అందిస్తుంది. ఒప్పందంలోనూ ఇలాగే ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విద్యాసంస్థలతోపాటు.. అమెరికాలోని పలు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలతో సీమెన్స్ ఒప్పందాల్ని పరిశీలిస్తే.. అవన్నీ ‘ఇన్ కైండ్ గ్రాంట్’ రూపంలోనే ఉన్నాయి. కంపెనీ సాధారణంగా ఇన్కైండ్ గ్రాంట్ అనే పదాన్ని ఉపయోగిస్తుంది. అంటే కంపెనీ విధానాల మేరకు.. డిస్కౌంట్ అందిస్తుంది. ఇది సాధారణంగా ద్రవ్యేతర డిస్కౌంట్’ అని కూడా సంస్థ చెబుతోంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నా.. ఇన్ కైండ్ గ్రాంట్ అన్నా.. అది డిస్కౌంట్ రూపంలో అందించే సాఫ్ట్వేర్ విలువకు సంబంధించినదే. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా.. ఒక్కో క్లస్టర్ పరిధిలోని ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, 6 సాంకేతిక శిక్షణ కేంద్రాలకు ప్రాజెక్టు వ్యయంలో 90% చొప్పున.. సీమెన్స్, డిజైన్టెక్ వాటా ఉంటుంది. మిగిలిన 10% మాత్రమే రాష్ట్రప్రభుత్వ వాటా. సీమెన్స్ దస్త్రాల ప్రకారం.. ఈ ప్రాజెక్టుకు సీమెన్స్ నగదు రూపంలో సహకారం అందించాల్సిన పనిలేదు. కంపెనీ విధానాలకు అనుగుణంగా.. సీమెన్స్ సాఫ్ట్వేర్ను డిస్కౌంట్ ధరపై అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!