ఏపీతో నైపుణ్యాభివృద్ధి ఒప్పందం ఉంది: సీమెన్స్
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్న మాట నిజమేనని సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ (ఇండియా) ప్రస్తుత ఎండీ మాథ్యూ థామస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన వాంగ్మూలంలోనే స్పష్టం చేశారు.
2011 నుంచి డిజైన్టెక్ మా వ్యాపార భాగస్వామే
ఇన్ కైండ్ గ్రాంట్ రూపంలోనే మా వాటా.. అది ద్రవ్యేతర డిస్కౌంటే
ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో సీమెన్స్ ప్రస్తుత ఎండీ మాథ్యూ
అయినా బురద చల్లేందుకు పోటీపడుతున్న వైకాపా నేతలు
వివిధ రాష్ట్రాలు, కేంద్ర సంస్థలవీ.. ఇదే తరహా ఒప్పందాలు
ఈనాడు - అమరావతి
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్న మాట నిజమేనని సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ (ఇండియా) ప్రస్తుత ఎండీ మాథ్యూ థామస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన వాంగ్మూలంలోనే స్పష్టం చేశారు. డిజైన్టెక్ సిస్టమ్స్ సంస్థ 2011 నుంచి తమ వ్యాపార భాగస్వామేనని, సీఐడీ కేసు తర్వాతే సస్పెన్షన్లో ఉంచామనీ చెప్పారు. సీమెన్స్ సంస్థ ఎలాంటి ద్రవ్యసహాయం అందించదని.. వివిధ ఐఐటీ, ఎన్ఐటీ, రాష్ట్రప్రభుత్వ నైపుణ్య కార్యక్రమాల ప్రాజెక్టులకు కంపెనీ విధానాల ప్రకారం ‘ఇన్ కైండ్ గ్రాంట్’ రూపంలో డిస్కౌంట్ అందిస్తుందనీ పేర్కొన్నారు. అయినా అధికార వైకాపా నేతలు, కొందరు అధికారులు మాత్రం బురద చల్లడానికి పోటీపడుతున్నారు. నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదని సీమెన్స్ చెబుతోంది అంటారొకరు.. ‘ఇన్ కైండ్ గ్రాంట్’ అంటే ఏంటి? అదెక్కడా వినలేదే! అంటూ సాఫ్ట్వేర్ నిపుణుడిలా చెబుతారు ఇంకొకరు. లక్షల మంది విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించే సీమెన్స్ ప్రాజెక్టుపై.. తాము పీహెచ్డీ చేశామన్నట్లుగా అధికారపార్టీ నేతలు, కొందరు అధికారులు తమకు తెలిసిన పరిజ్ఞానాన్ని వల్లెవేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో, పేరున్న విద్యాసంస్థల్లో సీమెన్స్ ప్రాజెక్టు ఎలా అమలైందని తెలుసుకునే ఆలోచనా లేదు. ఇదే తరహా ఒప్పందాలు, ఇన్కైండ్ గ్రాంట్ విధానాలపైనే.. సీమెన్స్తో గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్రం కూడా సాగరమాల కార్యక్రమంలో భాగంగా మారిటైమ్, నౌకా నిర్మాణాలకు సీమెన్స్తో ప్రపంచస్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. అక్కడ కేంద్రవాటాను వన్టైమ్ గ్రాంట్గానే ఇచ్చేందుకు నిర్ణయించింది. అక్కడెక్కడా కనిపించని అవినీతి.. వైకాపా నేతలు, కొందరు అధికారులకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందంలోనే కనిపిస్తోంది.
సీమెన్స్తో త్రైపాక్షిక ఒప్పందం.. వ్యాపార భాగస్వామిగా డిజైన్టెక్
‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు, సాంకేతిక శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిజైన్టెక్, సీమెన్స్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం 2015 జూన్లో కుదిరింది. నిర్దేశిత కేంద్రాల్లో అవసరమైన సాప్ట్వేర్ సరఫరా, హార్డ్వేర్ టెస్ట్ పనులను సీమెన్స్ చూస్తుంది’ అని మాథ్యూ థామస్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. ‘సీమెన్స్ దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం.. ఆటోమొబైల్, అగ్రిటెక్, ఇండస్ట్రియల్ మెషినరీ తదితర రంగాల్లో సాంకేతిక శిక్షణ అందించేందుకు కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రాజెక్టులో భాగంగా అవసరమైన సాఫ్ట్వేర్ సరఫరా, ఐపీ అడ్రస్ ఇవ్వడంతో పాటు.. ప్రాజెక్టు అమలు, నిర్వహణ, శిక్షణ, ధ్రువీకరణ, పర్యవేక్షణ, శిక్షణకు సంబంధించిన నాణ్యత సహా మొత్తం కేంద్రాల్లో పరిపాలనా వ్యవహారాలను టెక్నాలజీ భాగస్వామి, కార్యక్రమాల సలహాదారుగా సీమెన్స్ చూస్తుంది. కేంద్రాల ఏర్పాటు, కార్యకలాపాల నిర్వహణ, సిస్టమ్ ఇంటిగ్రేటర్, కేంద్రాల్లో సాఫ్ట్వేర్-హార్డ్వేర్ అనుసంధానం, కోర్సులు, అవసరమైన ఇతర పరికరాల సరఫరా, ఫ్యాకల్టీ, విద్యార్థుల బాధ్యతల్ని సీమెన్స్ తరఫున డిజైన్టెక్ చూస్తుంది. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వాటాను డిజైన్టెక్ ఖాతాకు చెల్లించాలి’ అని పేర్కొన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుకు.. సీమెన్స్ దగ్గరున్న సమాచారం ఆధారంగా డిజైన్టెక్కు సరఫరా చేసిన సాఫ్ట్వేర్ విలువ రూ.1,289 కోట్లుగా తేల్చారు. ఎల్ఎంఎస్ ఇండియా ద్వారా సరఫరా చేసిన టెస్ట్ సాఫ్ట్వేర్ విలువను రూ.10.25 కోట్లుగా పేర్కొన్నారు. ‘సీమెన్స్ సాఫ్ట్వేర్ విక్రయం, అమలు, శిక్షణ అందించడానికి డిజైన్టెక్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2011 నుంచి సీమెన్స్కు ఛానెల్ భాగస్వామిగా ఉంది. అయితే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుపై ఏపీసీఐడీ కేసు పెట్టాక.. ఈ సంస్థతో ఒప్పందాన్ని సస్పెన్షన్లో ఉంచాం’ అని మాథ్యూ వివరించారు.
ఆలోచన నుంచి ఆవిష్కరణ
ఇదొక అత్యాధునిక పారిశ్రామిక కర్మాగారమే. ఉదాహరణకు త్రీడీ ల్యాబ్లో వైద్యరంగంలో రోగుల శరీరంలో అమర్చే పరికరాల (మెడికల్ ఇంప్లాట్స్) నుంచి.. అంతరిక్షంలో వ్యోమగాములు వినియోగించే తేలికపాటి వస్తువులనూ రూపొందిస్తున్నారు. మానవరహిత కార్ల సాంకేతికతను విద్యార్థుల కళ్లకు కట్టేలా చూపేందుకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్లో రోబోలను వినియోగించి బోధిస్తున్నారు. ఎలాంటి పారిశ్రామిక అవసరాలకైనా తగ్గట్టు కంప్యూటర్లో ప్రోగ్రాం రాయగానే యంత్రంపై అది తయారవడం, అన్ని రకాల లోహాలతో రూపొందడం ఈ కేంద్రం ప్రత్యేకత. ఒక వ్యక్తి వేరేచోట ఉండి కంప్యూటర్పై డిజైన్ చేసి పంపితే ఆ నమూనా ఈ ల్యాబ్లో మానవరహితంగా తయారయ్యేలా ఉన్న డిజిటల్ ఇండస్ట్రీగా అవతరిస్తుందని కేంద్రం సమన్వయకర్త, సహ సమన్వయకర్తలు ఆచార్య కృష్ణానంద్, ఎస్.శ్రీనివాసరావు వివరించారు. రోబోటిక్ ప్రయోగశాల కోసం రోబోలను జర్మనీ నుంచి తెప్పించారు.
కర్ణాటకలో లేని ఉల్లంఘనలు.. ఏపీలో ఎలా?
సీమెన్స్, డిజైన్టెక్ సంస్థలతో కర్ణాటక ప్రభుత్వం 2017 జూన్ 9న ఒప్పందం చేసుకుంది. అప్పటి సీఎం సిద్ధరామయ్య ఆధ్వర్యంలోనే ఈ ఒప్పందం జరిగింది. ప్రాజెక్టు వ్యయం రూ.2,041.80 కోట్లుగా నిర్ణయించగా.. అందులో సీమెన్స్ వాటాగా రూ.1,822.48 కోట్లు (89%), కర్ణాటక ప్రభుత్వం రూ.219.32 కోట్లు (11%) చెల్లించేలా అంగీకారం కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రప్రభుత్వ వాటా 10%. కానీ, అక్కడ లేని నిబంధనల ఉల్లంఘన, ఏపీలోనే జరిగినట్లు రాష్ట్రప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోంది. ఏపీలో ఒప్పందం విధానాన్నే కర్ణాటక సైతం అనుసరించింది. సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్, డిజైన్టెక్ సిస్టమ్స్ లిమిటెడ్, కర్ణాటక ప్రభుత్వ టూల్రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సంస్థలు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏపీలో ఆరు ఎక్స్లెన్స్ సెంటర్లు, 36 సాంకేతిక నైపుణ్యశిక్షణ కేంద్రాల్ని ఏర్పాటుచేయగా.. కర్ణాటక నాలుగు సెంటర్లను ఏర్పాటుచేసింది. కర్ణాటక ఒప్పందంలో మొదటి రెండేళ్లు నాలుగు కేంద్రాలను డిజైన్టెక్ నిర్వహిస్తుందని, మూడో ఏడాది నిర్వహణకు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఏపీలో నాలుగో ఏడాది సైతం డిజైన్టెక్ ద్వారానే కేంద్రాలను నిర్వహించారు. అటోమోటివ్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఇండస్ట్రియల్ మిషనరీ, పునరుత్పాదక ఇంధన విభాగాల్లో శిక్షణకు సీమెన్స్తో అప్పటి కర్ణాటక ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.
సీమెన్స్తోనే కేంద్రం ఒప్పందం
కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ రూ.765 కోట్లతో ప్రపంచస్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది. ఇందులో సీమెన్స్ వాటా రూ.665 కోట్లు (87%). నౌకాయాన మంత్రిత్వశాఖ వన్టైమ్ గ్రాంట్ కింద రూ.100 కోట్లు (13%) అందించింది. అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, సాఫ్ట్వేర్ డిజైన్, రోబోటిక్స్, మెకట్రానిక్స్, స్కాడా కంట్రోల్స్, ప్రొడక్ట్ లైఫ్సైకిల్ మేనేజ్మెంట్, పీఎల్సీ ప్రోగ్రామింగ్, ట్రాన్స్మిషన్ కంట్రోల్స్, వర్చువల్ రియాలిటీ, రాడార్ టెక్నాలజీ, డైమెన్షనల్ యాక్యురసీ, నెస్టింగ్ తదితర ఎన్నో రంగాలకు సంబంధించి శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
వరంగల్ నిట్లోనూ.. సీమెన్స్
సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు సీమెన్స్ సంస్థతో వరంగల్ నిట్ రూ.170 కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఇందులో రూ.150 కోట్లను (88.24%) సీమెన్స్, రూ.20 కోట్లను (11.76%) నిట్ భరిస్తాయి. మూడేళ్లలో 30వేల మంది విద్యార్థులకు నైపుణ్యాల పెంపులో శిక్షణ ఇచ్చే లక్ష్యంతో నిట్తో అనుసంధానమైంది. రూ.150 కోట్ల విలువచేసే పరికరాలు, సాఫ్ట్వేర్ను సీమెన్స్, వ్యాపార భాగస్వామ్య సంస్థలు అందిస్తాయి. డిజైన్ అండ్ వాలిడేషన్, ఐవోటీ, రోబోటిక్స్ ల్యాబ్లు.. ఇలా 13 ప్రయోగశాలలు ఏర్పాటుచేస్తున్నారు.
గ్రాంట్ ఇన్ ఎయిడ్.. ఇన్ కైండ్ గ్రాంట్.. ద్రవ్యేతర డిస్కౌంట్
ప్రభుత్వ ఉత్తర్వుల్లో సీమెన్స్ తన 90% వాటాను గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇస్తుందని పేర్కొన్నారు. అయితే సీమెన్స్ కంపెనీ తమ విధానాల ప్రకారం ఇన్ కైండ్ గ్రాంట్ రూపంలోనే అందిస్తుంది. ఒప్పందంలోనూ ఇలాగే ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విద్యాసంస్థలతోపాటు.. అమెరికాలోని పలు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలతో సీమెన్స్ ఒప్పందాల్ని పరిశీలిస్తే.. అవన్నీ ‘ఇన్ కైండ్ గ్రాంట్’ రూపంలోనే ఉన్నాయి. కంపెనీ సాధారణంగా ఇన్కైండ్ గ్రాంట్ అనే పదాన్ని ఉపయోగిస్తుంది. అంటే కంపెనీ విధానాల మేరకు.. డిస్కౌంట్ అందిస్తుంది. ఇది సాధారణంగా ద్రవ్యేతర డిస్కౌంట్’ అని కూడా సంస్థ చెబుతోంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నా.. ఇన్ కైండ్ గ్రాంట్ అన్నా.. అది డిస్కౌంట్ రూపంలో అందించే సాఫ్ట్వేర్ విలువకు సంబంధించినదే. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా.. ఒక్కో క్లస్టర్ పరిధిలోని ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, 6 సాంకేతిక శిక్షణ కేంద్రాలకు ప్రాజెక్టు వ్యయంలో 90% చొప్పున.. సీమెన్స్, డిజైన్టెక్ వాటా ఉంటుంది. మిగిలిన 10% మాత్రమే రాష్ట్రప్రభుత్వ వాటా. సీమెన్స్ దస్త్రాల ప్రకారం.. ఈ ప్రాజెక్టుకు సీమెన్స్ నగదు రూపంలో సహకారం అందించాల్సిన పనిలేదు. కంపెనీ విధానాలకు అనుగుణంగా.. సీమెన్స్ సాఫ్ట్వేర్ను డిస్కౌంట్ ధరపై అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నాయకులు వేధిస్తున్నారని.. అయిదుగురు వాలంటీర్ల రాజీనామా
‘వైకాపా నాయకుల వేధింపులు భరించలేకున్నాం. పని కూడా చేయలేకపోతున్నాం’ అని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సచివాలయానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు రాజీనామా చేశారు. -
ఇక్కడ ఓటుంటేనే గుంతలు పూడుస్తాం
ఓటరు కార్డులను ప్రామాణికంగా తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టాలనే విచిత్ర ఆలోచన చంద్రగిరి నియోజకవర్గ అధికార పార్టీ నేతలకు వచ్చింది. -
వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం
రాష్ట్రంలో కరవు మండలాలను ప్రకటించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం భాజపా కిసాన్ మోర్చా చేపట్టిన వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. -
అంగట్లో బోగస్ సర్టిఫికెట్లు
సచివాలయ పశుసంవర్ధక శాఖ సహాయకులుగా విధులు నిర్వర్తించేందుకు అవసరమైన నకిలీ ధ్రువపత్రాలు బహిరంగ మార్కెట్లో పెద్దఎత్తున లభ్యమవుతుండటం కలకలం రేపుతోంది. -
మేమే ఉద్యోగాలిచ్చాం... చెప్పినట్టు చేయాల్సిందే
ఎన్నికల సంఘం తరఫున క్షేత్రస్థాయిలో పనిచేసే తొలి ప్రతినిధి బూత్ స్థాయి అధికారే (బీఎల్వో). ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియ వీరివద్దే మొదలవుతుంది. -
గ్యారంటీ ఇచ్చినా.. ధర తగ్గలేదు
ట్యాబ్లను సరఫరా చేసే గుత్తేదార్లకు బ్యాంకు గ్యారంటీ ఇస్తే ధర తగ్గిస్తారంటూ ప్రభుత్వం చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని రుజువైంది. -
ఎస్ఆర్బీసీ ఆయకట్టు ఎండిపోకుండా చర్యలు
గోరకల్లులో ఉన్న నీటిని ప్రణాళికబద్ధంగా విడుదల చేస్తూ పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. -
వాలంటీర్లను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలన్న కేసు విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పించాలని కోరుతూ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ నేతృత్వంలోని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ సంస్థ దాఖలు చేసిన కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. -
ఇంటర్ విద్యార్థుల ఘర్షణ
నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఘర్షణ జరిగి సోమవారం రాత్రి సీనియర్, జూనియర్ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. -
వైద్య ఖర్చుల పేరుతో ప్రభుత్వ ఖజానాకు టోకరా
నిబంధనలను తోసిరాజని రాష్ట్రంలో మెడికల్ బిల్లులను డ్రా చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మెడికల్ రీయింబర్సుమెంటు పొందవచ్చు. -
మా ప్లాంట్ను శ్రీసిటీకి తరలించేందుకు అనుమతివ్వండి
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఈపీసీ ప్లాంట్ను (ఇంజినీరింగ్ ప్లాస్టిక్ కాంపౌండింగ్ ప్లాంట్) తిరుపతి జిల్లాల్లోని శ్రీసిటీలోకి మార్చుకునేందుకు అనుమతివ్వాలంటూ ఆ సంస్థ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. -
శాప్ నుంచి వేరుపడిన యువజన సర్వీసుల శాఖ
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయడం ప్రస్తుత ప్రభుత్వానికి అలవాటుగా మారింది. జిల్లా స్థాయిలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్), రాష్ట్ర యువజన సర్వీసుల శాఖలను విలీనం చేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. -
విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుంచి తప్పిస్తాం
ఆందోళన బాటలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓలు) విధులకు హాజరుకాకుంటే ఒప్పంద నియామక మార్గదర్శకాల ప్రకారం.. ఉద్యోగం నుంచి తప్పించేందుకు వెనకాడబోమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. -
30న ఏపీ హెచ్ఆర్సీకి ప్రత్యేక సెలవు
తెలంగాణ ఎన్నికలు జరగనున్న గురువారం (30వ తేదీ) నాడు ఏపీ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కు ప్రత్యేక సెలవు ప్రకటించినట్లు సెక్షన్ అధికారి తారక నరసింహకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉంది. -
అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పా?
కృష్ణా జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఓ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా రమారమి మూడు వేల మందికి జీవనోపాధిగా ఉన్న ఉప్పు పరిశ్రమకు చెందిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిలో పోర్టు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అన్ని అంశాలూ పరిశీలించాం.. కుట్ర కోణం లేదు..
కోడికత్తి దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హత లేదని ఎన్ఐఏ పేర్కొంది. ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ మాత్రమే విచారణ జరపాలని స్పష్టం చేసింది. -
చదువూ లేదు.. కొలువూ రాదు!
పేదల పక్షపాతిని అని పదేపదే చెప్పుకొనే సీఎం జగన్... బీద బిడ్డలు ఎక్కువగా చదివే పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)ను గాలికొదిలేశారు. చాలా ఐటీఐల్లో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. -
అడిగేదెవరని.. అడ్డే లేదని!
ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఉపకులపతి(వీసీ)గా ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తన పదవీకాలంలో ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పలు నియామకాలు చేపట్టారని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలుమ్ని అసోసియేషన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. -
ప్రతి గ్రామానికీ నాణ్యమైన విద్యుత్
ప్రతి గ్రామానికి, రైతుకు నాణ్యమైన విద్యుత్ను అందించేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి తెలిపారు. -
లుక్ఔట్ సర్క్యులర్ కోర్టు ధిక్కరణ కాదా?
ఎలాంటి కఠిన చర్యలూ చేపట్టరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా.. మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ)ను ఎలా జారీ చేశారని ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు నిలదీసింది.


తాజా వార్తలు (Latest News)
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
-
యూపీలో అపహరణ.. హైదరాబాద్లో అత్యాచారం
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్పై ప్రశాంత్ నీల్ క్లారిటీ