Anantapur: ఇంట్లోనే స్కానింగ్.. ప్రైవేటుగా అబార్షన్
స్కానింగ్ యంత్రాల సర్వీసింగ్ చేసే ఓ ఘనుడు ఏకంగా అద్దె ఇంట్లో అనధికారికంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుబడిన వైనమిది.
అర్హత లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు
అనంతపురంలో వెలుగులోకి వచ్చిన దారుణం
ఈనాడు-అమరావతి, అనంతపురం (వైద్యం), న్యూస్టుడే: స్కానింగ్ యంత్రాల సర్వీసింగ్ చేసే ఓ ఘనుడు ఏకంగా అద్దె ఇంట్లో అనధికారికంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుబడిన వైనమిది. గతంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవంతో సునీల్కుమార్ అనే వ్యక్తి చీరల వ్యాపారం పేరుతో ఇల్లు అద్దెకు తీసుకుని.. అందులో సుమారు రూ.10 లక్షల వ్యయం కలిగిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసి, అర్హతలు లేకున్నా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ దొరికిపోయారు. అనంతపురం రెవెన్యూ కాలనీలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం రేపుతోంది. సునీల్కుమార్ వివిధ ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లతో తనకున్న పూర్వ పరిచయాలతో.. పరీక్షల కోసం అక్కడకు వచ్చే గర్భిణులను మభ్యపెట్టి ఇంటికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయడం మొదలుపెట్టారు. ఏడాదిన్నర నుంచి ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు సమాచారం.
ఈయన దందా వెనుక కొంతమంది ప్రైవేట్ వైద్యులు, ఆసుపత్రుల హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.7 వేలు మొదలు రూ. 50 వేల వరకు వసూలు చేశారు. సునీల్కు కర్నూలుకు చెందిన ఫార్మసిస్టు శ్రావణి సహకరిస్తున్నారు. గత రెండు, మూడు నెలల్లోనే అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన 128 మందికి స్కానింగ్ నిర్వహించినట్లు సునీల్ వద్ద లభించిన పుస్తకం ద్వారా తేలింది. ఎవరికి స్కానింగ్ చేశారో వారి వివరాలు, వారి నుంచి తీసుకున్న మొత్తం గురించి సునీల్ ఆ పుస్తకంలో రాసి పెట్టుకున్నారు. కొంతమంది రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లించినట్లు అందులో ఉంది. అబార్షన్లు చేయించడానికే ఇంత పెద్ద మొత్తం వసూలుచేసి ఉంటారని, దీనివెనుక పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
స్కానింగ్ మిషన్ ఎక్కడిది?
స్కానింగ్ మిషన్లను పంపిణీదారులు అర్హత కలిగిన వైద్యులకే విక్రయించాలి. ప్రతినెలా విక్రయాల వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాలి. నిందితుడి వద్ద లభించిన స్కానింగ్ యంత్రం వివరాలు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయన దానిని ఎక్కడి నుంచి సంపాదించారన్నది తేలాల్సి ఉంది. సంబంధిత సంస్థకు అధికారులు నోటీసు ఇచ్చారు. అవాంఛనీయ అబార్షన్ల దృష్ట్యా లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం ఉంది. వైద్యపరమైన ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే.. అనుమతి ఉన్నవారే వాటిని నిర్వహించాలి. సీనియర్ గైనిక్ వైద్యులే వాటిని చేయగలరు. అర్హతలు లేని నిందితుడు సునీల్ ఎలా చేశారన్నది అంతుచిక్కడంలేదు. ఇక్కడి స్కానింగ్ దృశ్యాలను రేడియాలజిస్టుకు పంపి, అక్కడి నుంచి వచ్చిన సమాచారాన్ని గర్భిణులకు తెలియజేస్తున్నారా.. అనేది తేలాల్సి ఉంది. సునీల్ గతంలో స్కానింగ్ యంత్రాల విక్రయం, సర్వీసింగ్ పనులు చేశారు.
అనంతరం అనంతపురంలో ప్రభుత్వ వైద్యురాలు సొంతంగా నిర్వహించిన ప్రైవేట్ వైద్యశాలలో గైనకాలజిస్టు వద్ద పనిచేశారు. 99 మందికి అబార్షన్లు చేసినట్లు ఫిర్యాదులు రావటంతో ఆమెను అధికారులు సస్పెండ్ చేశారు. తర్వాత సునీల్ స్కానింగ్ రూపంలో కొత్త అవతారమెత్తారు. కొంతమందికి ప్రైవేట్ వైద్యశాలల్లో అబార్షన్లు చేయించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో హిందూపురంలోనూ ఇలాగే ఒక అనధికారిక కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్య రంగానికి సంబంధించి అనైతిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంగవైకల్యం లేకున్నా.. ఉన్నట్లు ధ్రువీకరణపత్రాలు జారీచేయడం, ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయకుండా చేసినట్లు ధ్రువీకరిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. తమిళనాడు, ఏపీ సరిహద్దులోనూ లింగ నిర్ధారణ పరీక్షల విషయంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!