డబ్బులిస్తామని తీసుకొచ్చారు..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గుట్టురట్టయింది. ఈ యాత్రకు దారి పొడవునా జన స్పందన కరవైంది.
‘మేమంతా సిద్ధం’ యాత్ర గుట్టు రట్టు
గుడివాడలో యువకుడి రాయి కలకలం
‘జగన్ సభకు వస్తే..నాకు రూ.350 ఇస్తామన్నారు. అందుకే వచ్చా. డబ్బులడిగితే ఇవ్వలేదు. జెండా కర్రలతో కొట్టారు. అందుకే నేను రాయితో కొట్టేందుకు జేబులో పెట్టుకుని తిరుగుతున్నా’
కంకిపాడు మండలంలో ఓ గ్రామానికి చెందిన యువకుడు పోలీసులకు ఇచ్చిన సమాధానమిది.
సీఎం సభకు రాయితో వచ్చాడన్న కారణంతో పోలీసులు అతడిని పట్టుకుని స్టేషన్కు తరలించి, విచారించినప్పుడు ఈ విషయం బయటపడింది.
‘ఏమైంది నానీ.. ఏం చేస్తున్నారు? ఇదేం సభ నిర్వహణ. మీ ఒక్క నియోజకవర్గం నుంచే 10 వేల నుంచి 20 వేల మందిని తరలించవచ్చు కదా..! ఏమైంది ? సీఎం అసంతృప్తితో ఉన్నారు..!’
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని మందలించిన వైకాపా సమన్వయకర్త బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ నేత.
ఈనాడు, అమరావతి: ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గుట్టురట్టయింది. ఈ యాత్రకు దారి పొడవునా జన స్పందన కరవైంది. గుడివాడలో నిర్వహించిన బహిరంగసభ జనం లేక వెలవెలబోయింది. జనాన్ని తరలించడంలో నిర్లక్ష్యం చేశారని గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నానిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. జిల్లా అభ్యర్థులపై కస్సుబుస్సులాడారని సమాచారం. కృష్ణా జిల్లాలో నేతల తీరుపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
వెలంపల్లి గుట్టు రట్టు..!
సీఎం జగన్ ఎన్టీఆర్ జిల్లాలో కనీసం సభ కూడా నిర్వహించలేదు. ఈ నెల 13న జిల్లాలోకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశించినప్పుడు.. వారధి వద్ద భారీగా జనం వచ్చారని చూపించేందుకు కృష్ణలంక వద్ద చాలాసేపు ట్రాఫిక్ నిలిపేశారు. ఆ తర్వాత రోడ్డు షోకు జనం నుంచి స్పందనే లేదు. ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గంలో అసలు స్పందనే కానరాలేదు. ఇలాంటి సమయంలో సింగ్నగర్ సమీపంలో రాయి సంఘటన జరగడం గమనార్హం. అప్పటికే జనం లేక కనీసం బస్సు దిగకుండా సీఎం జగన్ చేయి ఊపుతూ వచ్చారు. కానీ జన స్పందన అనూహ్యం అంటూ నేతలు గొప్పలు చెప్పుకొచ్చారు. తాజాగా సింగ్నగర్ వాసులు అసలు విషయాన్ని బయట పెట్టారు. తమకు రూ.200, రూ.300 ఇస్తామంటే వచ్చామని ఇప్పుడు తమపైనే కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
14 నియోజకవర్గాల నుంచి ఇంతేనా..?
గుడివాడ సభకు మూడు జిల్లాలు.. 14 నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించేందుకు అన్ని గ్రామాలకు వైకాపా నేతలు బస్సులు పంపారు. రూ. 300, మద్యం సీసా, బిర్యానీ ప్యాకెట్తోపాటు చేతికి జెండా ఇచ్చారు. అయినా జనం నామమాత్రంగానే స్పందించారు. వచ్చిన వారు సైతం కొడాలి నాని ప్రసంగిస్తుండగానే వెనుదిరిగారు. గ్యాలరీల్లో జనం లేక కుర్చీలు ఖాళీగా కనిపించాయి. సీఎం జగన్ ప్రసంగించిన సమయంలో వేదిక సమీపంలో తప్ప జనం లేరు. ‘ఇల ఇలా’ అంటూ చెప్పాలని ఆయన పదేపదే కోరినా స్పందన లేదు. జనం తక్కువగా వచ్చారని నిఘా వర్గాలిచ్చిన సమాచారంతో వైకాపా నాయకుల నోట్లో పచ్చివెలక్కాయ పడింది.
ఎంపీ అభ్యర్థిపై రుసరుస..!
గుడివాడ నియోజకవర్గంలో తనను కాదని ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ సొంతంగా లాబీయింగు చేస్తున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని రుసరుసలాడినట్లు తెలిసింది. డాక్టర్గా మంచి పేరున్న చంద్రశేఖర్ గతంలో రాజకీయాలకు దూరంగా ఉండేవారు. అలాగని రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి కాదు. ఆయన తండ్రి సింహాద్రి సత్యనారాయణ తెదేపా ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. సింహాద్రి తన సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని గుడివాడలో రాజకీయాలు చేస్తున్నారనే సమాచారంతో కొడాలి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు సీఎం అక్షింతలు వేయడంతో అసహనానికి గురయ్యారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి