Nagaland Firing: పౌరులపై కాల్పులు విచారకరం
నాగాలాండ్ కాల్పుల ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నెల రోజుల్లోనే దర్యాప్తును ముగిస్తుందని తెలిపింది. సాధారణ పౌరులపై కాల్పులు పునరావృతం కాకుండా సాయుధ
నాగాలాండ్ ఘటనలపై లోక్సభలో అమిత్ షా వివరణ
దిల్లీ: నాగాలాండ్ కాల్పుల ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నెల రోజుల్లోనే దర్యాప్తును ముగిస్తుందని తెలిపింది. సాధారణ పౌరులపై కాల్పులు పునరావృతం కాకుండా సాయుధ బలగాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికింది. నాగాలాండ్లో తాజా పరిణామాలపై తాము కన్నేసి ఉంచామని పేర్కొంది. అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. నాగాలాండ్ కాల్పుల వ్యవహారంపై ప్రతిపక్షాల డిమాండ్ల నేపథ్యంలో లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఈ మేరకు వివరణ ఇచ్చారు. సైన్యం కాల్పుల్లో మృతిచెందినవారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. కాల్పులు చోటుచేసుకున్న పరిణామక్రమాన్ని ఆయన సభకు నివేదించారు.
‘‘నాగాలాండ్లోని మోన్ జిల్లాలో తిరుగుబాటుదారుల కదలికలపై సైన్యానికి శనివారం సమాచారం అందింది. వెంటనే మెరుపుదాడి జరిపేందుకు 21 పారా కమాండో బలగాలు రంగంలోకి దిగాయి. తిరు, ఓటింగ్ గ్రామాల మధ్య రోడ్డుపై వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించాయి. బలగాల సిగ్నల్ను పట్టించుకోకుండా వాహనం మరింత వేగంగా ముందుకెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో- అందులో తిరుగుబాటుదారులు ఉన్నారని అనుమానించి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. వాహనంలో ఉన్న 8 మందిలో ఆరుగురు కాల్పుల్లో మృత్యువాతపడ్డారు. వారు తిరుగుబాటుదారులు కాదని, బలగాల పొరపాటు కారణంగా కాల్పులు చోటుచేసుకున్నాయని తర్వాత నిర్ధారణ అయింది. గాయపడ్డ ఇద్దరిని సైనిక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. కాల్పుల సంగతి తెలియగానే స్థానికులు బలగాలను చుట్టుముట్టి దాడి చేశారు. ఈ ఘర్షణలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో ఆత్మరక్షణ కోసం భద్రతా బలగాలు మళ్లీ కాల్పులు జరిపాయి. ఫలితంగా మరో ఏడుగురు పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఆందోళనకారులు ఆదివారం సాయంత్రం అస్సాం రైఫిల్స్ శిబిరంపై దాడి చేయగా.. అక్కడ సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ పౌరుడు మృత్యువాతపడ్డాడు’’ అని షా వివరించారు. అమిత్ షా ప్రకటనపై సంతృప్తి చెందని కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ సహా పలు ప్రతిపక్ష పార్టీల సభ్యులు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. తృణమూల్ ఎంపీలు వాకౌట్ చేయలేదు.
ఓటింగ్ వద్ద జరిగిన కాల్పుల్లో మృతులకు నివాళులర్పిస్తున్న కుటుంబసభ్యులు, స్థానికులు
దద్దరిల్లిన పార్లమెంటు
అంతకుముందు, నాగాలాండ్ కాల్పుల వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. పౌరుల హత్యలను కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, వైకాపా, డీఎంకే, బీఎస్పీ సహా పలు పార్టీల ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని, నాగాలాండ్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ఉపసంహరించుకోవాలని, కాల్పులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఏఎఫ్ఎస్పీఏను ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పాలంటూ కేంద్రాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిలదీశారు.
తీవ్ర దురదృష్టకరం: ఎం.వెంకయ్యనాయుడు
పౌరులపై కాల్పుల వ్యవహారం రాజ్యసభనూ తాకింది. తొలుత ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (కాంగ్రెస్) డిమాండ్ చేశారు. ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. తాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాలతో మాట్లాడానని తెలిపారు. సోమవారం మధ్యాహ్నమే ప్రకటన చేస్తానంటూ షా తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత అప్పటికే ఆ అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో ఇతర ఎంపీలు దానిపై మాట్లాడేందుకు ఛైర్మన్ వెంకయ్య నాయుడు అనుమతి ఇవ్వలేదు. షా ప్రకటన చేశాక మళ్లీ ఆ అంశంపై మాట్లాడేందుకు అనుమతిస్తానని హామీ ఇచ్చారు. కాల్పుల ఘటన తీవ్ర దురదృష్టకరమని వెంకయ్యనాయుడు అన్నారు. దాని సున్నితత్వం, తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని ఎంపీలకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!