Punjab Assembly Elections: ఆప్దే ‘పంజా’బ్!
పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ప్రభంజనం సృష్టించింది. అధికార కాంగ్రెస్ పార్టీనీ, హేమాహేమీలనూ మట్టి కరిపించింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ కొనసాగిన సంప్రదాయ రాజకీయాలను తన ‘చీపురు గుర్తు’తో ఊడ్చి పారేసింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకుగానూ
సంప్రదాయ పార్టీలను ఊడ్చేసిన ‘చీపురు’
92 స్థానాలతో ప్రభంజనం
మట్టికరిచిన హేమాహేమీలు
అమరీందర్, చన్నీ, సిద్ధూల అడ్రస్ గల్లంతు
బాదల్లకూ తప్పని పరాజయం
చండీగఢ్: పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ప్రభంజనం సృష్టించింది. అధికార కాంగ్రెస్ పార్టీనీ, హేమాహేమీలనూ మట్టి కరిపించింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ కొనసాగిన సంప్రదాయ రాజకీయాలను తన ‘చీపురు గుర్తు’తో ఊడ్చి పారేసింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకుగానూ ఆప్ ఏకంగా 92 స్థానాలను కొల్లగొట్టింది. కాంగ్రెస్-18, అకాలీదళ్-3, భాజపా-2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దళిత సామాజికవర్గం ఓట్లతో ప్రభావం చూపుతుందనుకున్న బీఎస్పీ... కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది! పోలైన మొత్తం ఓట్లలో ఆప్ 42.01%, కాంగ్రెస్ 22.98%, అకాలీదళ్ 18.38%, భాజపా 6.60%, బీఎస్పీ 1.77% ఓట్లు సాధించాయి. నోటాకు 0.71% ఓట్లు పోలయ్యాయి. పంజాబ్లో విజయంతో భాజపా, కాంగ్రెస్ల తర్వాత దేశంలో రెండు చోట్ల అధికారంలో ఉన్న మూడో పార్టీగా ఆప్ అవతరించింది. ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ధురీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 58,206 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్సింగ్ గోల్డీపై విజయం సాధించారు.
ఓటమి తప్పని ప్రముఖులు...
ఆప్ ధాటికి ముఖ్యమంత్రి చరణ్జీత్సింగ్ చన్నీ సహా పలువురు ప్రముఖులకు ఓటమి తప్పలేదు. చన్నీ రెండు చోట్ల పోటీచేసినా విజయం మాత్రం కరుణించలేదు! బదౌర్ స్థానంలో ఆప్ అభ్యర్థి లబ్సింగ్ ఉగోక్ చేతిలో 37,558 ఓట్ల తేడాతో; చమ్కౌర్ సాహిబ్లో అదే పార్టీకి చెందిన చరణ్జీత్సింగ్ చేతిలో 7,942 ఓట్ల తేడాతో ఆయన ఓటమిపాలయ్యారు.
* శిరోమణి అకాలీదళ్ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్సింగ్ బాదల్ (94).. ముక్త్సర్ జిల్లాలోని తన సంప్రదాయ లంబి స్థానం నుంచి బరిలో దిగి, ఆప్ అభ్యర్థి గుర్మీత్సింగ్ ఖుదియాన్ చేతిలో 11,396 ఓట్ల తేడాతో అపజయం పాలయ్యారు.
* అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్సింగ్ బాదల్ కూడా జలాలాబాద్ నియోజకవర్గంలో చీపురు పార్టీ అభ్యర్థి జగ్దీప్ కంబోజ్పై 30,930 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
* మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్సింగ్ను కూడా ఆప్ అభ్యర్థే ఓడించారు. పటియాలా (అర్బన్) స్థానంలో అజిత్పాల్సింగ్ చేతిలో ఆయన 19,873 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
* పీసీసీ అధ్యక్షుడు నవ్జోత్సింగ్ సిద్ధూ అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి, ఆప్ అభ్యర్థి జీవన్జోత్ కౌర్ చేతిలో 6,591 ఓట్ల తేడాతో అపజయం పాలయ్యారు. డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పలువురు మంత్రులు, అకాలీదళ్ సీనియర్ నేత బిక్రమ్సింగ్ మజీఠియా తదితరులు కూడా ఓటమి చవిచూశారు.
భగత్సింగ్ పూర్వీకుల గ్రామంలో ప్రమాణ స్వీకారం...
పంజాబ్ సీఎంగా భగవంత్మాన్.. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ స్వగ్రామమైన ఘట్కర్కలన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మాన్ గురువారం వెల్లడించారు. తాను రాజ్భవన్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని తెలిపారు. ఆ తేదీని త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలు ఎక్కడా ఉండవని.. ఆ స్థానంలో భగత్సింగ్, అంబేడ్కర్ చిత్రాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇది విప్లవం: కేజ్రీవాల్
పంజాబ్లో తమ పార్టీ ఘన విజయాన్ని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ‘విప్లవం’గా అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం అభ్యర్థి భగవంత్ మాన్తో తాను కలిసి ఉన్న చిత్రాన్ని ఆయన ట్విటర్లో పంచుకున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు తమ పార్టీ ప్రత్యామ్నాయం కానుందని ఆప్ నేత రాఘవ్చద్దా వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు