ChatGPT: 3 సంవత్సరాలు, 17 మంది వైద్యులు కనిపెట్టలేకపోయారు.. చాట్జీపీటీ చేసేసింది
ChatGPT: తన బిడ్డను వచ్చిన జబ్బును తెలుసుకోవటం కోసం ఓ తల్లి పడిన అన్వేషణకు చాట్జీపీటీ సమాధానం చెప్పింది.
ఇంటర్నెట్డెస్క్: కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేసే చాట్జీపీటీ (ChatGPT) చేసే అద్భుతాల్ని వింటూనే ఉంటాం. దీని వినియోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రంగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీని సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. అనేక పరిశ్రమలు పునరావృతమయ్యే పనులను మరింత సులభంగా, తక్కువ సమయంలో చేయటానికి దీని సాయం తీసుకుంటున్నాయి. ఈ చాట్జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో ఎంత క్లిష్ట ప్రశ్నకైనా అవలీలగా సమాధానం చెప్పేస్తోంది. తన బిడ్డను వచ్చిన జబ్బును తెలుసుకోవటంలో ఓ తల్లికి చాట్జీపీటీ సాయం అందించింది. మూడేళ్లుగా ఏ డాక్టరు కనుగొనలేని విషయాన్ని ఈ ఏఐ చేసి చూపించింది.
మూడు సంవత్సరాలు, 17 మంది డాక్టర్లు ఎంత శ్రమించినా 4 సంవత్సరాల బాబుకు వచ్చిన జబ్బును గుర్తించలేకపోయారు. కానీ, చాట్జీపీటీ సులువుగా ఆ పని చేసి పెట్టింది. అసలు ఏం జరిగిందంటే.. కోర్ట్నీ అనే మహిళ తన కొడుకు అలెక్సాకు వచ్చిన జబ్బును తెలుసుకోవాలని చాలా ప్రయత్నించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో తన బిడ్డకు ఓ జబ్బు వచ్చింది. ఏం తిన్నా పంటి నొప్పి రావటం, ఎత్తు పెరగకపోవటం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమె జబ్బును గుర్తించి చికిత్స అందించాలని చాలా ప్రయత్నించింది. దాదాపు మూడేళ్లు ఎంతో మంది డాక్టర్లను సంప్రదించింది. ఎవరూ తన బిడ్డ జబ్బును కనిపెట్టలేకపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక ఒక రోజు మొత్తం కంప్యూటర్ ముందే కూర్చొని చాట్జీపీటీ సాయం కోరింది.
కాస్త ఊరట! ఆగస్టులో స్వల్పంగా దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం
ఎంఆర్ఐ రిపోర్డులో ఉన్న ప్రతి అంశం గురించి చాట్జీపీటీని వివరంగా అడిగింది. అలాగే తన బిడ్డకున్న లక్షణాలు పంచుకుంది. చివరకు, ‘టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ (tethered cord syndrome)’ అనే అరుదైన న్యూరోలాజికల్ కండిషన్తో తన కొడుకు బాధపడుతున్నట్లు గుర్తించింది. వెంటనే న్యూరోసర్జన్ను సంప్రదించింది తన తనయుడికి టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్తో బాధ పడుతున్నాడనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇక ఆ డాక్టర్ అలెక్స్ జబ్బుని నిర్థారించి శస్త్రచికిత్స చేశారు. దీంతో తన కొడుకు జబ్బు నుంచి బయటపడినట్లు, కొంచెం ఎత్తు పెరిగాడంటూ ఆమె తన ఆనందాన్ని పంచుకుంది. అయితే రోగనిర్ధారణను కనుక్కోవటంలో చాట్జీపీటీ సహాయపడటం ఇది మొదటి సారి కాదు. ఈ ఏడాది మార్చిలో ఇలాంటి విషయాన్నే ఓ వ్యక్తి ‘ఎక్స్’వేదికగా పంచుకున్నాడు. తన పెంపుడు కుక్కకు ఉన్న జబ్బును వైద్యులు కూడా కనిపెట్టలేకపోయారు. కానీ, ఏఐ కనిపెట్టిందంటూ రాసుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్