Gautam adani: IANS న్యూస్‌ ఏజెన్సీలో అదానీకి పూర్తి వాటా

Gautam adani - IANS: ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ IANSలో అదానీ గ్రూప్‌ పూర్తి వాటాను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది.

Published : 17 Jan 2024 15:53 IST

దిల్లీ: ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ (Gautam adani) తన మీడియా వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఇటీవల ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్‌ (IANS) ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌.. తాజాగా దాన్ని మరింత పెంచుకుని మీడియా సంస్థపై పూర్తి నియంత్రణ సాధించింది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.

అదానీ గ్రూప్‌నకు చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ ద్వారా ఇటీవల IANSలో 50.50శాతం వాటాను కొనుగోలు చేశారు. ఇప్పుడు దాన్ని ఓటింగ్‌ హక్కులతో 76శాతం, ఓటింగ్‌ హక్కులు లేకుండా 99.26 శాతానికి పెంచుకున్నారు. ఇందుకు రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ తెలిపింది. జనవరి 16న జరిగిన న్యూస్‌ ఏజెన్సీ బోర్డు సమావేశంలో ఈ వాటాల పెంపునకు ఆమోదం లభించింది.

అత్యంత బలమైన కరెన్సీలివే.. మన రూపాయి ర్యాంక్‌ ఎక్కడంటే..?

 IANS ఇకపై ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ అనుబంధ సంస్థగా పనిచేస్తుందని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐఏఎన్‌ఎస్‌ ఆదాయం రూ.11.86 కోట్లుగా ఉంది. గతేడాది మార్చిలో బిజినెస్‌, ఫైనాన్షియల్‌ న్యూస్‌ అందించే క్వింటిలియన్‌ బిజినెస్‌ మీడియా కొనుగోలుతో మీడియా రంగంలోకి అడుగుపెట్టిన అదానీ.. అదే ఏడాది డిసెంబర్‌లో ఎన్డీటీవీలో (NDTV) 65 శాతం వాటాను చేజిక్కించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని