Strongest Currency: అత్యంత బలమైన కరెన్సీలివే.. మన రూపాయి ర్యాంక్ ఎక్కడంటే..?
Strongest Currency: వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల జాబితాను (Strongest Currency List) ఫోర్బ్స్ విడుదల చేసింది. వాటి ప్రాముఖ్యతకు దోహదం చేసిన కారణాలనూ వివరించింది. కువైటీ దినార్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. ఈ ఒక్క దినార్ విలువ భారత కరెన్సీలో రూ.270.23కు (3.25 డాలర్లు) సమానం. రూ.220.4 (2.65 డాలర్లు)తో బహ్రెయినీ దినార్ రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత కరెన్సీ రూపాయి (ఒక డాలర్=రూ.82.9) 15వ స్థానంలో ఉంది. 2024 జనవరి 10 నాటికి ఉన్న విలువల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేశారు.
తొలి 10 కరెన్సీలివే..
- కువైటీ దినార్ (రూ.270.23; 3.25 డాలర్లు)
- బహ్రెయినీ దినార్ (రూ.220.4; 2.65 డాలర్లు)
- ఒమన్ రియాల్ (రూ.215.84; 2.60 డాలర్లు)
- జోర్డాన్ దినార్ (రూ.117.10; 1.41 డాలర్లు)
- జిబ్రాల్టర్ పౌండ్ (రూ.105.52; 1.27 డాలర్లు)
- బ్రిటిష్ పౌండ్ (రూ.105.54; 1.27 డాలర్లు)
- కేమన్ దీవుల డాలర్ (రూ.99.76; 1.20 డాలర్లు)
- స్విస్ ఫ్రాంక్ (రూ.97.54; 1.17 డాలర్లు)
- యూరో (రూ.90.80; 1.09 డాలర్లు)
- డాలర్ (రూ.82.9)
ఈ జాబితాలో అమెరికా డాలర్ పదో స్థానంలో ఉండడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి విస్తృతంగా వినియోగిస్తున్న కరెన్సీ అమెరికా డాలర్ అని ఫోర్బ్స్ తెలిపింది. ప్రాథమిక కరెన్సీ రిజర్వ్గానూ దీనివైపే మొగ్గుచూపుతున్నట్లు పేర్కొంది. 1960లో ప్రవేశపెట్టినప్పటి నుంచి కువైటీ దినార్ ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీగా కొనసాగుతోంది. చమురు నిక్షేపాలు, పన్ను-రహిత వ్యవస్థతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగడమే దీనికి కారణం. స్విస్ ఫ్రాంక్ ప్రపంచంలో అత్యంత స్థిరమైన కరెన్సీ అని ఫోర్బ్స్ తెలిపింది.
ఒక యూనిట్తో కొనుగోలు చేయగల వస్తువులు, సేవల సంఖ్య; మారకం ద్వారా వచ్చే విదేశీ కరెన్సీ మొత్తాన్ని మూల్యాంకనం చేయడం ద్వారా కరెన్సీ విలువను నిర్ణయించినట్లు ఫోర్బ్స్ వివరించింది. ఒక కరెన్సీ ప్రాముఖ్యతను నిర్ణయించడానికి సరఫరా-గిరాకీ, ద్రవ్యోల్బణం, దేశీయ ఆర్థిక వృద్ధి, కేంద్ర బ్యాంకుల విధానాలు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలన్నీ క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
స్టాక్ మార్కెట్.. ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!