Adani group: యూఎస్ ఏజెన్సీ నివేదిక.. అదానీ స్టాక్స్ జూమ్
Adani stocks zoom: అదానీ గ్రూప్ షేర్లు మంగళవారం కూడా దూసుకెళ్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ సంస్థ ఇచ్చిన నివేదిక ఇందుకు కారణం.
Adani stocks: ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ (Adani group) కంపెనీ షేర్లు మంగళవారం కూడా రాణించాయి. హిండెన్బర్గ్ నివేదికలోని అంశాలన్నింటినీ ‘వాస్తవాలు’గా కోర్టు పరిగణించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొనడంతో ఇప్పటికే కంపెనీ షేర్లు దూసుకెళ్తుండగా.. తాజాగా అమెరికా ఏజెన్సీ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూప్ షేర్లకు మరోసారి కొనుగోళ్ల కళ కనిపించింది.
👉 Follow EENADU WhatsApp Channel
అదానీ గ్రూప్పై యూఎస్కు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికను ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (DFC) ‘అసంబద్ధం’ అంటూ పేర్కొంది. శ్రీలంకలో కంటెయినర్ టెర్మినల్ ఏర్పాటుకు 553 మిలియన్ డాలర్లు అదానీ గ్రూప్నకు రుణం ఇచ్చే విషయంలో డీఎఫ్సీ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కార్పొరేట్ మోసాలకు పాల్పడిందంటూ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు అసంబద్ధంగా పరిగణిస్తున్నట్లు డీఎఫ్ఎస్కు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఏజెన్సీ వ్యాఖ్యల నేపథ్యంలో అదానీ కంపెనీ స్టాక్స్పై పాలుపోసినట్లయ్యింది.
ఉద్యోగుల వేతనాల కోసం ఇళ్లను తనఖా పెట్టిన బైజూ రవీంద్రన్!
అదానీ గ్రూప్నకు చెందిన ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో ఏకంగా 10 శాతం మేర పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ మరోసారి రూ.3లక్షల కోట్ల మార్కును అందుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ 17 శాతం మేర లాభపడింది. అలాగే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ 9 శాతం చొప్పున లాభపడ్డాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 10%, అదానీ టోటల్ గ్యాస్ 7%, అదానీ పవర్ 7%, అదానీ విల్మర్ 5%, అంబుజా సిమెంట్స్ 5%, ఏసీసీ 6%, ఎన్డీటీవీ 7% చొప్పున లాభపడ్డాయి. మొత్తగా అదానీ గ్రూప్ కంపెనీల విలువ రూ.14 లక్షల కోట్లు దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. -
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!