Amazon: కృత్రిమ మేధ స్టార్టప్లో అమెజాన్ రూ.33 వేల కోట్ల పెట్టుబడులు
Amazon: ‘జనరేటివ్ ఏఐ వ్యవస్థ (generative AI systems)’ల అభివృద్ధికి అమెజాన్, ఆంత్రోపిక్ కలిసి పనిచేయనున్నాయి. అందులో భాగంగా ఇరు కంపెనీల భాగస్వామ్యంలో ‘ఫౌండేషన్ మోడల్స్’ను అభివృద్ధి చేయనున్నట్లు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
వాషింగ్టన్: బడా టెక్ కంపెనీలు కృత్రిమ మేధ (Artificial Intelligence- AI)పై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా అమెజాన్ (Amazon) నాలుగు బిలియన్ డాలర్ల (దాదాపు రూ.33.24 వేల కోట్లు) పెట్టుబడులను ప్రకటించింది. ఈ మొత్తంతో ఆంత్రోపిక్ (Anthropic) అనే అంకుర సంస్థలో మైనారిటీ వాటాను సొంతం చేసుకోనున్నట్లు సోమవారం వెల్లడించింది. రానున్న రోజుల్లో ఏఐ వినియోగం పెరగనున్న నేపథ్యంలో టెక్ దిగ్గజాలు భారీ ఎత్తున పెట్టుబడులను కుమ్మరిస్తున్నాయి. ఈ కొత్తతరం సాంకేతికతలోని అవకాశాలను వేగంగా అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అమెజాన్ (Amazon) తాజా భారీ పెట్టుబడులే అందుకు నిదర్శనం.
ఇటీవలి కాలంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ‘జనరేటివ్ ఏఐ వ్యవస్థ (generative AI systems)’ల అభివృద్ధికి అమెజాన్, ఆంత్రోపిక్ కలిసి పనిచేయనున్నాయి. అందులో భాగంగా ఇరు కంపెనీల భాగస్వామ్యంలో ‘ఫౌండేషన్ మోడల్స్’ను అభివృద్ధి చేయనున్నట్లు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ ఫౌండేషన్ మోడల్స్నే ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్’గానూ వ్యవహరిస్తున్నారు. బ్లాగ్ పోస్ట్లు, డిజిటల్ పుస్తకాలు, శాస్త్రసాంకేతికత వ్యాసాలు, పాప్ గీతాలు, టెక్ట్స్, చిత్రాలు, వీడియోలు సహా మనిషి పనిని పోలే ప్రతి అంశంపై ఈ మోడల్స్కు శిక్షణిస్తారు. తాజా ఒప్పందంలో భాగంగా అమెజాన్ను ఆంత్రోపిక్ తన ప్రాథమిక క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్గా వినియోగించుకోనుంది. అలాగే ఈ-కామర్స్లోని కస్టమ్ చిప్స్ ద్వారా ‘జనరేటివ్ ఏఐ సిస్టమ్స్ (generative AI systems)’కు శిక్షణ ఇవ్వనుంది.
ఆంత్రోపిక్ శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తోంది. దీన్ని చాట్జీపీటీ (ChatGPT)ని తయారు చేసిన ఓపెన్ఏఐ (OpenAI) సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగులు ప్రారంభించారు. ఇప్పటికే క్లాడ్ (Claude) పేరిట చాట్జీపీటీ (ChatGPT)కి పోటీగా చాట్బాట్ను విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇది అమెరికా, బ్రిటన్లో అందుబాటులోకి వచ్చింది. వివరమైన ఆదేశాల ద్వారా ఇది సంక్లిష్ట సమస్యలకు సైతం సమాధానాలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏఐ విషయంలో అమెజాన్ తమ ప్రత్యర్థి సంస్థలైన మైక్రోసాఫ్ట్ వంటి వాటితో పోటీ పడుతోంది. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 2019లోనే 1 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. ఆ తర్వాత ఏడాదే మరికొన్ని బిలియన్ డాలర్లు వెచ్చించింది. అమెజాన్ (Amazon) సైతం అదే బాటలో పయనిస్తోంది. ఇప్పటికే ‘అలెక్సా’లో ఏఐతో కూడిన అప్డేట్ను ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్