Freebies: ‘కనీస అవసరాలను పొందడం పేదల హక్కు.. అవి ఉచితాలు కాదు’
పౌష్టికాహారం, హెల్త్కేర్, నివాసం, విద్య.. వంటి పౌరుల కనీస అవసరాలను తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అని ప్రముక ఆర్థికవేత్త జయతీ ఘోష్ తెలిపారు.
ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్
దిల్లీ: పౌష్టికాహారం, హెల్త్కేర్, నివాసం, విద్య.. వంటి పౌరుల కనీస అవసరాలను తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్ అన్నారు. వీటిని ఉచిత తాయిలాలుగా పరిగణించొద్దని వ్యాఖ్యానించారు. వీటిని పొందడం పేద ప్రజల హక్కు అని ఉద్ఘాటించారు.
భారత్లో పెద్ద ఎత్తున పేదరికం ఉందని జయతీ ఘోష్ తెలిపారు. సరైన విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, నివాసం.. వంటి కనీస అవసరాలను అందించడంలో భారత్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిందని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో కనీస అవసరాలను తీర్చే నాణ్యమైన వస్తువులు, సేవల్ని అందించడం ప్రభుత్వ కనీస బాధ్యతగా భావిస్తారని.. ఉచితాలుగా పరిగణించరని తెలిపారు. భారత పన్నుల వ్యవస్థలో పరోక్ష పన్నులదే సింహభాగమని ఆమె తెలిపారు. దీనివల్ల మన దేశంలో ధనవంతుల కంటే పేద ప్రజలే ఎక్కువ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. కాబట్టి వారికి కనీస అవసరాలు పొందే హక్కు ఉందని తెలిపారు.
ఇటీవల ఉచిత తాయిలాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఇటీవల దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాల వల్ల పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా అవుతోందని చెప్పుకొచ్చారు. పైగా భారత స్వయంసమృద్ధికి ఇవి అవరోధాలుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల హామీలను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. ముగిసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంతో పాటు రాబోయే గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆప్ ఉచిత విద్యుత్తు, ఉచిత నీరు వంటి హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సైతం ఉచితాలపై స్పందిస్తూ.. ఉచిత పథకాల అంశం రోజురోజుకీ సంక్లిష్టంగా మారుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస అవసరాలు కల్పించడాన్ని ఉచితం అనగలమా? అని ప్రశ్నించారు.
బ్రిక్స్, జీ20 సభ్యదేశాల్లో భారత స్థూల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జయతీ ఘోష్ తెలిపారు. గిరాకీ ఇంకా తక్కువగానే ఉందన్నారు. నిరుద్యోగిత పెరిగిపోతోందన్నారు. పేదరికం, ఆహార అభద్రత సైతం పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఆర్బీఐ పెద్దఎత్తున ఖర్చు చేసినప్పటికీ.. రూపాయి పతనం మరింత కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. దీనివల్ల ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. అయితే.. శ్రీలంక తరహాలో భారత్లో సంక్షోభం రాబోదని ధీమా వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వ రుణాలు శ్రీలంక స్థాయిలో లేవని గుర్తుచేశారు. అయితే, సమీప భవిష్యత్తులో కొన్ని ఆర్థిక ఇబ్బందులు మాత్రం తప్పవని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. -
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం