EPFO కీలక నిర్ణయం.. కొవిడ్ అడ్వాన్స్ నిలిపివేత!
EPFO covid advance: కొవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ నిలిపివేసింది. కొవిడ్ సమయంలో ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది.
EPFO Covid advance | ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ సమయంలో తీసుకొచ్చిన కొవిడ్ అడ్వాన్స్ (Covid advance) సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నిలిపివేసింది. కొవిడ్ వేళ ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. హెల్త్ ఎమర్జెన్సీ జాబితా నుంచి కొవిడ్-19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తప్పించిన నేపథ్యంలో ఈ సదుపాయాన్ని నిలిపివేస్తూ ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది.
వారం క్రితం ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంటే ఇకపై పీఎఫ్ చందాదారులు కొవిడ్ అడ్వాన్స్ పేరిట భవిష్య నిధి నుంచి సొమ్ములను ఉపసంహరించుకోవడం సాధ్యపడదు. ప్రస్తుతం ఉమాంగ్ యాప్లోకి వెళ్లి కొవిడ్ అడ్వాన్స్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ‘సర్వీసు అందుబాటులో లేదు’ అనే సందేశం కనిపిస్తోంది.
SBI ‘అమృత్ కలశ్’ గడువు పొడిగింపు.. ఎఫ్డీ వడ్డీ రేట్ల పెంపు
కొవిడ్ కాలంలో తీసుకొచ్చిన ఈ నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ సదుపాయం చాలా మందికి ఉపకరించినా.. కొందరు మాత్రం వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారు. ఈ సదుపాయాన్ని ఇన్నేళ్ల పాటు కొనసాగించడం వల్ల చాలామంది రిటైర్మెంట్ సేవింగ్స్పై ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. 2020 మార్చి 28న తీసుకొచ్చిన కొవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని 2.2 కోట్ల మంది వినియోగించుకున్నారు. రూ.48 వేల కోట్లు కొవిడ్ అడ్వాన్స్ రూపేణ ఉపసంహరించుకున్నారని ఈపీఎఫ్ వార్షిక నివేదిక ద్వారా వెల్లడైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM