Amazon: ఉద్యోగులపై నిఘా.. అమెజాన్కు భారీ జరిమానా
ఉద్యోగులపై మితిమీరిన నిఘా ఉంచిందనే ఆరోపణలతో అమెజాన్కు ఫ్రాన్స్ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ భారీ జరిమానా విధించింది.
పారిస్: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon)కి ఫ్రాన్స్ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ సీఎన్ఐఎల్ (CNIL) భారీ జరిమానా విధించింది. ఉద్యోగుల పనితీరుపై మితిమీరిన నిఘా ఉంచినందున 32 మిలియన్ యూరోలు (సుమారు రూ.280 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ (EU) జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR) ప్రకారం ఉద్యోగుల వ్యక్తిగత డేటా సేకరణ, వినియోగంపై వారి అనుమతి తప్పనిసరి. నిబంధనలకు విరుద్ధంగా అమెజాన్ డేటాను సేకరించినట్లు సీఎన్ఐఎల్ ఆరోపించింది. దీనిపై ఉద్యోగుల నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి జరిమానా విధించినట్లు తెలిపింది.
వినియోగదారులు ఆర్డర్ చేసే ఉత్పత్తుల వివరాలను నమోదు చేసే స్కానింగ్ యంత్రాల ద్వారా నిఘా ఉంచినట్లు తెలిపింది. పది నిమిషాల కంటే ఎక్కువ సమయం అవి పనిచేయకుంటే.. యాజమాన్యానికి అలర్ట్ మెసేజ్ పంపుతాయని, వాటి ఆధారంగా ఉద్యోగి పనితీరుని విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది. దాంతోపాటు పని ప్రదేశంలో ఉద్యోగులు ఎంతసేపు ఉంటున్నారనే సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపింది. ఈ తరహా నిఘా వల్ల సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించింది.
బైజూస్ విలువ రూ.16,600 కోట్లే.. ఏడాదిలో 90% పతనం
కాగా, దీనిపై అమెజాన్ తన చర్యలను సమర్థించుకుంది. వినియోగదారులకు మెరుగైన సర్వీసులను అందించేందుకు, ప్రొడక్ట్ను డెలివరీ చేసే ముందు సిబ్బంది పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు ఇలాంటి వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఉద్యోగులపై నిఘా కోసం ఈ డేటా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలను తోసిపుచ్చారు. సీఎన్ఐఎల్ జరిమానాపై అప్పీల్ చేస్తామన్నారు. ఫ్రాన్స్లో అమెజాన్కు 8 అతిపెద్ద పంపిణీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 వేల మంది పనిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్