Gautam Adani: మళ్లీ 100 బిలియన్ డాలర్ల క్లబ్లోకి గౌతమ్ అదానీ
Gautam Adani: అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కొన్ని రోజులుగా భారీగా పుంజుకుంటున్నాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద 100 బిలియన్ డాలర్లు దాటింది.
ఇంటర్నెట్ డెస్క్: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) మళ్లీ 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ధనవంతుల జాబితాలో చేరారు. గతేడాది హిండెన్బర్గ్ నివేదిక తర్వాత ఆయన సంపద భారీగా కుంగిన విషయం తెలిసిందే. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ జాబితాలో 101 బిలియన్ డాలర్లతో ప్రస్తుతం 12వ స్థానంలో కొనసాగుతున్నారు. గతకొన్ని రోజుల్లో అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.
2022లో 150 బిలియన్ డాలర్ల వద్ద గౌతమ్ అదానీ (Gautam Adani) సంపద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆయన సంపద దాదాపు 37.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్ల జాబితాలో తొలి 25 మందిలో స్థానం కోల్పోయారు.
కైనటిక్ ఇ-లూనా వచ్చేసింది..సింగిల్ ఛార్జ్తో 110km
హిండెన్బర్గ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అదానీ గ్రూప్ (Adani Group).. ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపడం కోసం పలు చర్యలు చేపట్టింది. రుణ వాయిదాలను ముందస్తుగానే చెల్లించింది. కొత్తగా నిధులను సమీకరించుకుంది. మరోవైపు తమ దర్యాప్తులో హిండెన్బర్గ్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. ఇదే విషయంపై దృష్టిపెట్టిన సెబీ 22 అంశాల్లో దర్యాప్తు పూర్తి చేసింది. మరో రెండు అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు గత నెల సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. సెబీ దర్యాప్తును సవాల్ చేస్తూ సిట్ విచారణకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అదనపు చర్యలు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ పరిణామాలతో షేర్లు భారీగా పుంజుకున్నాయి.
అదానీ గ్రూప్ (Adani Group) తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన నివేదికలో అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలను పొందినట్లు ఆరోపించింది. అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు పేర్కొంది. పన్నుల విషయంలో సరళ నిబంధనలున్న కరేబియన్, మారిషస్ల నుంచి యూఏఈలో పలు డొల్ల కంపెనీలను అదానీ కుటుంబం నియంత్రిస్తోందని తెలిపింది. వీటి ద్వారానే అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. -
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు