ఆర్బీఐ నిర్ణయమే కీలకం
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్న తరుణంలో, ఈనెల 28-30 తేదీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జరపనున్న పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు కీలకం కానున్నాయి.
స్టాక్ మార్కెట్ ఈ వారం
రెపోరేటు 0.50% వరకు పెంచొచ్చనే అంచనాలు
విదేశీ పెట్టుబడుల తీరూ ముఖ్యమే
ఔషధ, ఎఫ్ఎమ్సీజీ రాణించొచ్చు
ఇతర రంగాల్లో ప్రతికూలతలు
విశ్లేషకుల అంచనాలు
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్న తరుణంలో, ఈనెల 28-30 తేదీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జరపనున్న పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు కీలకం కానున్నాయి. ద్రవ్యోల్బణంతో పాటు ఇతర అంశాలపై ఆర్బీఐ గవర్నర్ చేయబోయే వ్యాఖ్యలు, విదేశీ పెట్టుబడుల తీరు మార్కెట్కు దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రెపోరేటును మరో 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచొచ్చనే ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఆర్థిక కార్యకలాపాలు కొవిడ్ ముందుస్థాయికి చేరనందున.. ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచినా, దూకుడుగా వెళ్లకపోవచ్చని ఏషియన్ డెవపల్మెంట్ బ్యాంక్ పేర్కొంది. వడ్డీరేట్లపై యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మంగళవారం తీసుకునే నిర్ణయమూ ప్రభావం చూపొచ్చు. దేశీయంగా చూస్తే.. నిఫ్టీ-50లో శ్రీసిమెంట్ స్థానంలో అదానీ ఎంటర్ప్రైజెస్ రానుంది. హర్ష ఇంజినీర్స్ సోమవారం ఎక్స్ఛేంజీల్లో నమోదు కానుంది. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
* సిమెంటు కంపెనీల షేర్లు స్తబ్దుగా కదలాడొచ్చు. అన్ని ప్రాంతాల్లోనూ ధరల విషయంలో తయారీదార్లు బలహీనంగా ఉండడం ఇందుకు నేపథ్యం. వ్యయాల ఒత్తిళ్లు, గిరాకీ పుంజుకోవడం వంటివి ఈ రంగానికి కీలకంగా మారొచ్చు.
* యంత్ర పరికరాల షేర్లు ఒత్తిడిలో కనిపించొచ్చు. శుక్రవారం వెలువడే ఆర్బీఐ పరపతి విధాన కమిటీ నిర్ణయాన్ని బట్టి ఇవి కదలాడవచ్చు. దీర్ఘకాలానికి మాత్రం ఈ రంగంపై అంచనాలు బలంగా ఉన్నాయి.
* టెలికాం షేర్లు కీలక సూచీల నుంచే సంకేతాలు అందుకుంటాయి. 5జీ సేవల ప్రారంభంపై అక్టోబరు 1న ప్రధాని నరేంద్రమోదీ చేసే ప్రకటన ఈ రంగానికి ఉపకరించొచ్చు. భారతీ ఎయిర్టెల్పై విశ్లేషకులు ‘బులిష్’గా ఉన్నారు.
* ఐటీ షేర్లు స్తబ్దుగా ఉండొచ్చు. 2022-23 ఆదాయ వృద్ధి అంచనాల కంటే కాస్త తక్కువే ఉంటుందని అసెంచర్ పేర్కొనడం ప్రభావం చూపుతుంది. త్రైమాసిక ఫలితాలకు ఇంకా సమయం ఉన్నందున భారీ పొజిషన్లకు మదుపర్లు దూరంగా ఉండొచ్చు.
* ఎఫ్ఎమ్సీజీ షేర్లు మరింత పెరగొచ్చు. ఊగిసలాట మార్కెట్లో రక్షణాత్మక షేర్ల వైపు మదుపర్లు చూస్తుండడమే ఇందుకు కారణం. డాబర్, బ్రిటానియా, మారికో, ఐటీసీ సానుకూలంగా కదలాడొచ్చు.
* నిల్వలు పెరిగి, ముడి చమురుకు గిరాకీ స్తబ్దుగా ఉన్నందున, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి అప్స్ట్రీమ్ కంపెనీలు ఒత్తిడిలో కనిపించొచ్చు. పెట్రోలు, డీజిల్ రిటైల్ ధరలను అనుసరించి రిఫైనరీల షేర్ల చలనాలుంటాయి.
* బ్యాంకు షేర్లలో ట్రేడింగ్ జాగ్రత్తగా జరగొచ్చు. నిఫ్టీ బ్యాంక్ సూచీ 39,300-40,400 పాయింట్ల మధ్య కదలాడొచ్చు.
* మార్కెట్లో ప్రతికూలతల నేపథ్యంలో వాహన కంపెనీల షేర్లు లాభాలను అందుకోకపోవచ్చు.
* ఔషధ షేర్లు రాణించొచ్చు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రపంచ వ్యాప్తంగా మందగమనం వల్ల రక్షణాత్మక రంగాలకు గిరాకీ కనిపిస్తుండడం ఇందుకు నేపథ్యం.
* లోహ షేర్లలో 2-3 నెలలుగా కనిపిస్తున్న ర్యాలీ గత వారం ఆగింది. ఈ వారమూ బలహీనతలు కొనసాగొచ్చు. గిరాకీ మందగించడం, అంతర్జాతీయంగా అల్యూమినియం ధరలపై ఒత్తిడి ఇందుకు కారణం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.