బ్యాంకింగ్ యాప్లకు సోవా ముప్పు
పండగల వేళ డిజిటల్ లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయి. ఇ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు, దుకాణాల్లో చెల్లింపులు అన్నీ డిజిటల్లోనే జరుగుతున్నాయి. ఇదే అదనుగా మోసగాళ్లు బ్యాంకింగ్ యాప్లే లక్ష్యంగా కొత్త వైరస్లను సృష్టించి, మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ఖాతాదారులను హెచ్చరిస్తున్న బ్యాంకులు
ఈనాడు, హైదరాబాద్: పండగల వేళ డిజిటల్ లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయి. ఇ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు, దుకాణాల్లో చెల్లింపులు అన్నీ డిజిటల్లోనే జరుగుతున్నాయి. ఇదే అదనుగా మోసగాళ్లు బ్యాంకింగ్ యాప్లే లక్ష్యంగా కొత్త వైరస్లను సృష్టించి, మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. ఈ వైరస్ల లింకులను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు.. ఫోన్లో ఉన్న బ్యాంకింగ్ యాప్ల సమాచారం నేరగాళ్లకు చేరిపోతోంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త వైరస్ వచ్చింది. ‘సోవా’ పేరుతో ఒక వైరస్ మొబైల్ ఫోన్లలోకి జొరబడుతోందని, అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
అరచేతిలోనే బ్యాంకింగ్ లావాదేవీలన్నీ క్షణాల్లో నిర్వహించుకునే వీలు యాప్ల ద్వారా వీలవుతుంది. ఇప్పుడు ప్రతి బ్యాంకూ తమ ఖాతాదారుల ప్రయోజనం కోసం వీటిని అందుబాటులోకి తీసుకొచ్చాయి. అవగాహనతో వీటిని వాడితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, మోసగాళ్లు ఈ బ్యాంకింగ్ యాప్లను పోలినట్లుగానే మరో నకిలీ యాప్లను సృష్టిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బ్యాంకింగ్ యాప్ల నుంచి సమాచారాన్ని తస్కరించేందుకు ‘సోవా’ మొబైల్ బ్యాంకింగ్ మాల్వేర్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశం పంపిస్తున్నారు. అందులో ఉన్న పొరపాటున క్లిక్ చేస్తే చాలు. ఈ ఆండ్రాయిడ్ ట్రోజన్ ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్టీ) సోవా వైరస్ విషయంలో బ్యాంకులకు సమాచారం ఇవ్వడంతో పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ సూచించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్లతో పాటు పలు బ్యాంకులు ఈ విషయంపై ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ సంక్షిప్త సందేశాలను పంపిస్తున్నాయి.
ఏమిటిది?
‘సోవా ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ మాల్వేర్. ఇది ఫోన్లలో చేరి, అందులో ఉన్న వ్యక్తిగత సమాచారంతోపాటు, నెట్- బ్యాంకింగ్ యాప్లను వాడినపుడు పాస్వర్డ్లను తస్కరిస్తుంది. ఒక్కసారి ఇది ఫోన్లో చేరితే..దీన్ని తొలగించడం దాదాపు అసాధ్యం’ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ట్విటర్ ఖాతాలో తెలిపింది. ఈ వైరస్ ఎక్కువగా సంక్షిప్త సందేశాల రూపంలోనే వస్తోంది. ఒక్కసారి ఫోన్లో చేరాక.. అందులో ఉన్న యాప్ల గురించి కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్కు సమాచారాన్ని చేరవేస్తుంది. ఆ తర్వాత అందులో ఉన్న బ్యాంకింగ్ యాప్లను లక్ష్యంగా చేసుకొని, మాల్వేర్ను పంపించి, వాటిని తమ నియంత్రణలోకి తీసుకుంటారు.
టోకన్లనూ పసిగట్టేలా..
క్రెడిట్ కార్డు, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ఈ నెల 1 నుంచి టోకనైజేషన్ అమల్లోకి వచ్చిన విషయం విదితమే. ఈ సోవా వైరస్ ఈ ‘మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ)’ వివరాలనూ తస్కరించేంత శక్తిమంతంగా ఉందని బ్యాంకింగ్ సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏకంగా 200 రకాలకు పైగా బ్యాంకింగ్, పేమెంట్ లావాదేవీలను గుర్తించడంతోపాటు, క్రిప్టోకరెన్సీ వాలెట్లనూ ఇది లక్ష్యంగా చేసుకుంటోందని పేర్కొంటున్నారు. కేవలం బ్యాంకింగ్ యాప్లే కాదు.. ఇతర సమాచారాన్నీ ఇది ఎన్క్రిప్షన్ చేయడంతోపాటు, వాటిని తిరిగి పొందేందుకు కొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
జాగ్రత్తలు ఇలా..
సోవా వైరస్ విషయంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలంటూ బ్యాంకులు కొన్ని సూచనలు చేస్తున్నాయి. అవేమిటంటే..
* అధీకృత యాప్ స్టోర్ల నుంచి మాత్రమే యాప్లను డౌన్లోడ్ చేసుకోండి. ఎన్ని డౌన్లోడ్లు ఉన్నాయి, వాటికి సంబంధించిన సమీక్షలు (రివ్యూలు) తదితరాలు చూసుకోండి.
* మీరు యాప్ ఉపయోగించుకునేందుకు అవసరమైన మేరకు మాత్రమే సమాచారాన్ని అందించండి. అనుమతుల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది.
* అధీకృత యాప్లు ఇస్తున్న అప్డేట్లను ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి.
* ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే వెబ్సైట్ లింకులను ఎట్టి పరిస్థిత్లుల్లోనూ క్లిక్ చేయొద్దు.
* పొట్టి యూఆర్ఎల్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాటిని ఉపయోగించే ముందు వాటిని యూఆర్ఎల్ చెకర్లో వేసి చూడాలి. అక్కడ దాని పూర్తి వివరాలు కనిపిస్తాయి.
* బ్యాంకింగ్ యాప్లో ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక