అక్షతా మూర్తికి ఇన్ఫీ నుంచి రూ.126.61 కోట్లు
బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి.. 2022లో ఇన్ఫోసిస్ నుంచి రూ.126.61 కోట్ల డివిడెండు ఆదాయాన్ని ఆర్జించారు.
2022లో డివిడెండు రూపేణా ఆదాయం
దిల్లీ: బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి.. 2022లో ఇన్ఫోసిస్ నుంచి రూ.126.61 కోట్ల డివిడెండు ఆదాయాన్ని ఆర్జించారు. ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అయిన అక్షతకు సెప్టెంబరు చివరినాటికి కంపెనీలో 0.93% వాటా లేదా 3.89 కోట్ల షేర్లున్నాయి. బీఎస్ఈలో మంగళవారం ముగింపు ధర (రూ.1,525.75) ప్రకారం.. ఆమె వాటా విలువ సుమారు రూ.5,956 కోట్లు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండు కింద రూ.16ను ఈ ఏడాది మే 31న ఇన్ఫోసిస్ చెల్లించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ నెలలో కూడా రూ.16.5 మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ రెండు డివిడెండ్లు కలిపితే ఒక్కో షేరుకు రూ.32.5 చొప్పున.. అక్షత వద్ద ఉన్న 3.89 కోట్ల షేర్లకు రూ.126.61 కోట్లు అవుతుంది. ఇన్ఫోసిస్ 2021లోనూ ఒక్కో షేరుకు మొత్తంగా రూ.30 డివిడెండు చెల్లించింది. ఆ ఏడాది కూడా అక్షత డివిడెండు రూపేణా రూ.119.50 కోట్లు ఆర్జించారు. భారత పౌరసత్వం ఉన్న అక్షత బ్రిటన్లో ‘నాన్- డొమిసైల్’ పన్ను హోదాలో నివసిస్తున్నారు. ఈ హోదా ఉన్న వారు.. 15 ఏళ్ల పాటు విదేశాల్లో ఆర్జించే ఆదాయానికి బ్రిటన్లో పన్ను చెల్లించనక్కర్లేదు. అయితే ఏప్రిల్లో ప్రధాని రేసులోకి సునాక్ అడుగుపెట్టినప్పుడు అక్షత పన్ను హోదా అంశంపై బ్రిటన్లో తీవ్రంగా చర్చ జరిగింది. దీంతో తన భర్త పదవికి ఇది ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతో.. విదేశాల్లో ఆర్జించే ఆదాయం మీద లభిస్తున్న ఈ పన్ను ప్రయోజనాన్ని ఇక పొందబోనని ఆ సమయంలో ఆమె స్పష్టం చేశారు. అయితే ఏప్రిల్ తర్వాత నుంచి ఆమె బ్రిటన్లో ఎంత పన్ను చెల్లించారనే వివరాలపై కచ్చితమైన సమాచారమైతే లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ 64ఎంపీ కెమెరా సహా అత్యాధునిక ఏఐ ఫీచర్లతో భారత్లో విడుదలైంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు
Air India Express: దాదాపు 300 మంది క్యాబిన్ క్రూ అనారోగ్య కారణంతో సెలవు పెట్టినట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. దీంతో దాదాపు 80కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 267 పాయింట్ల నష్టంతో 73,244 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 22,276 దగ్గర కొనసాగుతోంది. -
టాటా సెమీ కండక్టర్ చిప్ల ఎగుమతి!
మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే. -
మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్!
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. -
డాక్టర్ రెడ్డీస్కు రూ.1,307 కోట్ల లాభం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
అయిదేళ్ల కనిష్ఠానికి పొదుపు
దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. -
3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు లేనట్లే
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
వైద్య పరికరాల దిగుమతులు తగ్గాలి
వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్ చావ్లా వెల్లడించారు. -
హ్యాపియెస్ట్ మైండ్స్ డివిడెండ్ 163%
ఐటీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు, పెద్ద పెద్ద షాపింగ్మాల్స్కు మారడమే ఇందుకు కారణం. -
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
Warren Buffett: ప్రముఖ మదుపరి, బిలియనీర్ వారెన్ బఫెట్ ఏఐ సాంకేతికపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని అణుబాంబుతో పోల్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
-
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
-
‘రెడ్లైన్ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్ హెచ్చరిక
-
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
-
యూకే ఎయిర్ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!